31/08/2026
11వ వార్డు చాంద్ బడాలో SDPI కీలక సమావేశం
ప్రజా సమస్యలపై పోరాటం… ప్రజా హక్కుల కోసం ఉద్యమం… రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం!
నంద్యాల 11వ వార్డు చాంద్ బడా బ్రాంచ్ నాయకుల సమావేశం ఈ రోజు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో 11వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్లో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చాంద్ బడా 11వ వార్డు నుంచి SDPI తరఫున బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా ఎన్నికల కార్యాచరణను రూపొందించడం, వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల్లోకి వెళ్లడం కాదు… ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల పక్షాన నిలబడటమే SDPI లక్ష్యం.
✊ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
✊ అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా గళం
✊ వార్డు అభివృద్ధి కోసం నిరంతర కృషి
✊ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో SDPI బలమైన ప్రత్యామ్నాయం
ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా కార్యదర్శి టీ. కరీముల్లా గారు, అసెంబ్లీ కోశాధికారి నూరుల్లా గారు, 11వ వార్డు బ్రాంచ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🔥 చాంద్ బడా మార్పు కోసం… SDPI ముందడుగు!
✊ ప్రజల కోసం పోరాటం – ప్రజల చేత పాలన!