VinodKumar BRS

VinodKumar BRS జై కేసీఆర్ జై భారత రాష్ట్ర సమితి
పెద్ది సుదర్శన్ రెడ్డి వీరాభిమాని
BRS బి.ఆర్.స్ సోషియల్ మీడియా

23/05/2026

బీజేపీ - కాంగ్రెస్ ఇద్దరూ తోడుదొంగలే!

ఈ బీజేపీ - కాంగ్రెస్ తోడుదొంగలు ఒకరినొకరు కాపాడుకుంటూ...
రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు!

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

22/05/2026

ఒకవేళ నేను తెలంగాణ జెండా దించినా
లేదా ఉద్యమానికి ద్రోహం చేసినా..
"నన్ను రాళ్లతో కొట్టి చంపండి" అన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ ✊

ధన బలం లేదు.. మీడియా బలం లేదు..
కేవలం ఉన్నదల్లా గుండె బలమే 🩷

యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిండు..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు.

జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊

20/05/2026

కష్టపడి మళ్లీ కేసీఆర్ నే ముఖ్యమంత్రి చేసుకుంటాం..
అప్పుడే మా బాధలు, కష్టాలు పోతయ్!



19/05/2026

I got over 100 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

17/05/2026

ఈసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టబోతున్నాం.

ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం, మరోవైపు కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత.. ప్రతి బూత్ లెవెల్ కమిటీకి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి.

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

15/05/2026

ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి, నమ్మించి
గద్దెనెక్కినంక రైతులను నట్టేట ముంచిన రాబందు కాంగ్రెస్ 🦅

రైతన్న బతుకును ఆగం చేసిన రేవంత్..
అదే రైతన్న నిన్ను, నీ పార్టీని బొందపెట్టడం ఖాయం!




12/05/2026

*నర్సంపేట/ఖానాపురం:*

*గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయం కూల్చివేత.*

*బడి పేరుతో గుడిని కూల్చిన రేవంత్ రెడ్డి.. లంక బిందెల వేటలో 24 అడుగుల తవ్వకాలు.*

*ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో 500 కోట్ల భారీ కుంభకోణం.. అన్నీ ఎక్సెస్ టెండర్లే.*

*అశోక్ నగర్‌లో ధ్వంసమైన మట్టికోట శివాలయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ రావు.*

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శివాలయ సందర్శన అనంతరం హరీశ్ రావు గారు మీడియాతో మాట్లాడారు.







*ప్రెస్ రిలీజ్**నర్సంపేట/ఖానాపురం:**గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయం కూల్చివేత.**బడి పేరుతో గ...
11/05/2026

*ప్రెస్ రిలీజ్*
*నర్సంపేట/ఖానాపురం:*

*గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయం కూల్చివేత.*

*బడి పేరుతో గుడిని కూల్చిన రేవంత్ రెడ్డి.. లంక బిందెల వేటలో 24 అడుగుల తవ్వకాలు.*

*ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో 500 కోట్ల భారీ కుంభకోణం.. అన్నీ ఎక్సెస్ టెండర్లే.*

*అశోక్ నగర్‌లో ధ్వంసమైన మట్టికోట శివాలయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ రావు.*

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శివాలయ సందర్శన అనంతరం హరీశ్ రావు గారు మీడియాతో మాట్లాడారు.

*మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్..*

రేవంత్ రెడ్డి పాలనలో బడులు ఆగమే కాదు.. ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతోంది.

ఆనాడు కేసీఆర్ గారు మన ఊరు-మన బడి పెడితే రేవంత్ రెడ్డి దాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది.

దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణమాఫీ చేయకుండా మాట తప్పిన భారతదేశ తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తీ లేదు.

కేసీఆర్ గారు యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చీలు, ఇప్పుడు ఏకంగా గుడులు కూలగొడుతున్నాడు.

విశాఖ పీఠం కూలుస్తా అని మొన్న అధికారులను పంపాడు.

సీఎం అయిన కొత్తలో సెక్రటేరియట్ కు పోతే లంక బిందెలు దొరుకుతాయనుకున్నా అని రేవంత్ రెడ్డి అన్నాడు.

ఆయన అనుయాయులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం బాగానే వెతికాడు. అక్కడ దొరకకపోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడుల మీద పడ్డాడు.

అశోక్ నగర్ లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేశారు.

ఆలయ రక్షణ కోసం ఉన్న అతిపెద్ద మట్టి ఆనకట్టను తొలుచుకుంటూ వెళ్లి మరీ గర్భగుడిని ధ్వంసం చేశారు.

రాత్రి 12 నుంచి 1 గంట మధ్య, చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారు.

స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారు? గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ కుట్ర జరిగింది.

ఇది గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకమే అని పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి గారు ఈ నెల 7వ తేదీన కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆర్కియాలజీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు, మిషనరీ సీజ్ చేయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది స్పష్టం.

బీఆర్ఎస్ హయాంలో ధరణిలో ఇది దేవాలయ భూమి గా ఉంటే.. కాంగ్రెస్ రాగానే భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది?

స్కూల్ కట్టడానికి చుట్టూ కావలసినంత స్థలం ఉంది. అసలు ఈ నియోజకవర్గంలో వేరే చోట జీవో వచ్చిన స్కూల్ ను ఇక్కడికి ఎందుకు మార్చారు.

గుడి ఉన్నకాడ బడి కట్టొచ్చు, కానీ పోయిపోయి గుడినే కూలగొట్టడం ఎందుకు.

పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్ట్ చేసి మిషనరీని సీజ్ చేయాలి.

యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలి.
1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించాలి.

అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలి.

సీవీసీకి, విజిలెన్స్ కు సైతం ఫిర్యాదు చేస్తాం.

విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలిస్తే.. అన్నీ 4.86%, 4.96%, 4.99% ఎక్సెస్ కే ఇచ్చారు.

ఒక్క టెండర్ కూడా మైనస్ కు పోకుండా అన్నీ ఎక్సెస్ కే ఎట్లా పోయాయి.

ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా 494 కోట్ల ఒక లక్ష రూపాయల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యింది.

నర్సంపేట ప్యాకేజ్-8 కింద 136 కోట్లకు టెండర్ ఉంటే అది 142 కోట్లకు (4.86% ఎక్సెస్) ఇచ్చారు.

తమకు అనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా పెట్టుకుని ఈ 500 కోట్ల దోపిడీకి తెరతీశారు.

కాంట్రాక్టర్లు నా మనుషులైతే టెండర్లు రద్దు చేయి.

టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీశ్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. వాళ్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయి..నేనే కదా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నది.

మొన్న HAM రోడ్ల పేరుతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25% ఎక్సెస్ తో జరిగిన 5000 కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీలో బయటపెట్టి పోరాడింది నేనే.

అవి నీ మనుషులా? నా మనుషులా? అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయం.

బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5% కి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి, వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలి.

*ఈ రోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ  పర్యటన..**బిఆర్ఎస్ రాష్ట్రనేత,మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ త...
11/05/2026

*ఈ రోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన..*

*బిఆర్ఎస్ రాష్ట్రనేత,మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఈరోజు మధ్యానం 2:30 గంటలకు నర్సంపేట నియోజకవర్గం ఖనాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ధ్వంసం చేయబడిన చారిత్రక మట్టికోట శివాలయాన్ని సందర్శించనున్నారు..*

*ఈ కార్యక్రమానికి BRS పార్టీ శ్రేణులు,మహా దేవుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి...*

*ఇట్లు..*
*పెద్ది సుదర్శన్ రెడ్డి*
*మాజీ శాసనసభ్యులు,నర్సంపేట*

🔷 కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపైన నమోదైన పాక్సో కేసుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔷 ప్రధానమంత్ర...
09/05/2026

🔷 కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపైన నమోదైన పాక్సో కేసుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

🔷 ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైన పలు ప్రశ్నలు సంధించిన కేటీఆర్

🔷 బాలిక పరిస్థితి, వారి కుటుంబంపైన జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ 👇

🔹ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?

🔹కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? అతనికి మినహాయింపు ఉంటుందా?

🔹బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు లేదా మంత్రివర్గం నుండి ఎప్పుడు బర్తరఫ్ చేయబడతారు?

🔹రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి 'జంగల్ రాజ్' నడుపుతోంది?

🔹ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత వేగంగా ఎందుకు స్పందించలేదు?

🔹కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇతర POCSO నేరస్తుల మాదిరిగానే కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరపడం లేదు?

🔹మైనర్ బాలికపైనే ఎదురు కేసు ఎందుకు పెట్టారు?

🔹ఉన్నావ్ కేసులో చేసినట్లుగా, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్‌ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడతారా? లేక ఇది తెలంగాణ బాధితులకు వర్తించదా?

🔹తెలంగాణ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రాంచైజీలా పనిచేస్తోందా?

🔹ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో కాంగ్రెస్ మరియు బిజెపి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా?

🔹ఒక 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు మరియు ఆమె కుటుంబం, ఒక FIR నమోదు చేయించుకోవడానికే మూడు నెలలకు పైగా ఎందుకు పోరాడాల్సి వస్తోంది?

🔹మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఆ కుటుంబం కష్టం చూస్తే అర్థమవుతుంది అంటూ ఆవేదన

🔹బాధితురాలిని మరియు ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ ఎందుకు వేధిస్తున్నారు?

🔹ఆ మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది.

🔹న్యాయం కోసం వారు మూడు నెలలుగా తిరుగుతున్నారు.

🔹ఇప్పుడు మీరు ఆమెనే నిందిస్తున్నారా?

🔹ఏ నిబంధన ప్రకారం తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్ మరియు వసూళ్ల కేసు నమోదు చేశారు?

🔹మన మహిళల గౌరవం కోసం గతంలో పోరాడాం.

🔹ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్‌సార్లు మళ్ళీ పోరాడుతాం.
KCR

Ram Kalvakuntla

Address

Narsampet

Telephone

+919000025056

Website

Alerts

Be the first to know and let us send you an email when VinodKumar BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to VinodKumar BRS:

Share