01/08/2026
మూలాపేట DSR హైస్కూల్లో నారాయణ ఉచిత వైద్య శిబిరం
నారాయణ నేత్ర జ్యోతి, దంత సురక్ష శిబిరాలకు విశేష స్పందన
మంత్రి నారాయణ సేవలు అభినందనీయం..డిప్యూటీ మేయర్ రూప్ కుమార్
DSR హైస్కూల్లో 200 మంది విద్యార్థులకు కంటి, దంత పరీక్షలు
విద్యార్థులకు త్వరలోనే ఉచితంగా కళ్లద్దాల పంపిణీ: అన్నంగి ప్రసాద్
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజల శ్రేయస్సు, ముఖ్యంగా నిరుపేదల ఆరోగ్యం మరియు విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా అనేక బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారు.ప్రజాసేవే పరమావధిగా భావించే మంత్రి నారాయణ, సొంత నిధులతో నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష పేరిట ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వేలాది మందికి కంటి చూపును, మెరుగైన దంత ఆరోగ్యాన్ని అందిస్తున్నారు.కేవలం వైద్య సేవలతోనే ఆగకుండా, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునీకరించి, విద్యార్థుల సౌకర్యార్థం వేలాది ఉచిత సైకిళ్లను పంపిణీ చేసి విద్యా వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారు.ఈ క్రమంలోనే, నెల్లూరు నగరం మూలాపేటలోని 39వ డివిజన్లో ఉన్న DSR హైస్కూల్లో శనివారం నారాయణ నేత్ర జ్యోతి,నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని వైభవంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 39 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ అన్నంగి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ గారి సేవా కార్యక్రమాలను విశేషంగా కొనియాడారు...నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఇప్పటివరకు 12,000 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసి, 7,000 మందికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేయడంతో పాటు 200 మందికి ఉచిత శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారని, అలాగే నారాయణ దంత సురక్ష ద్వారా 6,900 మందికి దంత పరీక్షలు నిర్వహించి, సంచార బస్సులోనే 1,000 మందికి పైగా అక్కడికక్కడే ఉచితంగా చికిత్స అందించి మిగతా వారిని ఆస్పత్రికి రిఫర్ చేశారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరం మూలాపేటలోని 39వ డివిజన్ DSR హైస్కూల్లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించి, తొలిరోజే 200 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించరు...ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి, ఇటీవల 7,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసిన బాటలోనే, పేద విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా సొంత నిధులతో ప్రజాసేవ అందిస్తున్న మంత్రి నారాయణ గారికి ఆశీస్సులు తెలియజేస్తూ, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు, వైద్యులతో సమన్వయం చేస్తూ ఈ శిబిరాన్ని విజయవంతం చేస్తున్న క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు...అనంతరం *క్లస్టర్ ఇంచార్జ్ అన్నంగి ప్రసాద్ మాట్లాడారు* DSR పాఠశాలలో ఇప్పటివరకు సుమారు 200 మంది పేద విద్యార్థులు ఈ కంటి మరియు దంత పరీక్షల సేవలను వినియోగించుకున్నారని. ఈ పరీక్షల్లో కళ్ళద్దాలు అవసరమని తేలిన పిల్లలకి, ఎల్లుండి అదే పాఠశాలలో వైద్యుల ద్వారా ఉచితంగా కళ్ళద్దాలను పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఈ డివిజన్లో ప్రజల కోసం ఇప్పటివరకు 4 మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు.. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ ప్రియ, డెంటల్ ప్రొఫెసర్ రాహుల్, AO ఆఫీసర్ సుధీర్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.