03/11/2024
🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, అన్నమయ్య సర్కిల్, మాగుంట లేఔట్ నందు 2 కోట్ల రూపాయల వ్యయంతో నందమూరి తారకరామారావు పార్కు ను ప్రజలకు అంకితం చేసిన నెల్లూరు రూరల్ శానసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతి ప్రియ.
🔸 నందమూరి తారకరామారావు పార్కు అభివృద్ధి కావాలని స్థానిక ప్రజల చిరకాల కల ఈరోజు నెరవేరింది. ఈ పార్కును ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాటి మంత్రి పొంగూరు నారాయణ గారు, నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేక చొరవతీసుకుని దాదాపు ఈ పార్కు పనులను పూర్తిచేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పార్కు ప్రారంభానికి నోచుకోలేదు. అనేకసార్లు నేను స్థానిక శానసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేసినా వీలుకాని పరిస్థితి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 ఈనాడు దేవుడి దయ, ప్రజలందరి అశీస్సులతో, నాయకుల, కార్యకర్తల కష్టంతో తెలుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రిగా పొంగూరు నారాయణ గారి సహాయసహకారాలతో నేడు ఎన్.టి.ఆర్. పార్కుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 ఇంకాకుడా ఈ పార్కుని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఈ పార్కు అభివృద్ధికి స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకుంటా. నెల్లూరు నగరంలోనే విశాలమైన పార్కు, వాకింగ్ ట్రాక్, క్రీడా పరికరాలు, షటిల్ మరియు టెన్నీస్ కోర్ట్ మరియు అన్నివిధాలుగా స్థానిక ప్రజలకు ఈ పార్కు ఉపయోగపడుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 నెల్లూరు నగరంలో ఏ పార్కు చూసినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చూసినా గుర్తొచ్చేది మంత్రి పొంగూరు నారాయణ గారు. ఆనాటి కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి సహాయసహకారాలతో, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నగరంలో భూగర్భ డ్రైనేజీ, ప్రతి ఇంటికి మంచి నీటి పథకం పనులు చేసారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలపక్షాన మంత్రి పొంగూరు నారాయణ గారికి, మాజీ నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, మాజీ నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గారికి, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మరియు నుడా అధికారులకు నా ప్రత్యేక ధన్యవాదములు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, క్లస్టర్ ఇంచార్జీ నెల్లూరు మురళి, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.