13/02/2026
🔶 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులలో భాగంగా 32వ డివిజన్ ఎన్.సీ.సీ. కాలనీ లో జరుగుతున్న ఖబరస్థాన్ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ తాళ్ళూరు అవినాష్ మరియు నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔶ముస్లిం మైనారిటీ సోదరులకు ఎంతో అవసరమైన ఖబరస్థాన్ ను స్థానిక ప్రజలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా, వెంటనే అధికారులతో కలిసి సందర్శించి మొదటి దశలో 40లక్షల రూపాయలు మౌలిక సదుపాయాలు కల్పన కోసం కేటాయించడం జరిగింది.టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔶 గత నెల 24వ తేదీన 27 కోట్లతో 240 అభివృద్ధి పనులకు స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔶 240 అభివృద్ధి పనులలో 121 అభివృద్ధి పనులు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి, క్యూరింగ్ దశలో ఉన్నాయి . టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔶 నెల్లూరు రూరల్ లో కూటమి ప్రభుత్వం జెండా ఒక్కటే కూటమి నాయకులు అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుదాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔶 ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔶 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామ నారాయణ రెడ్డి గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి,నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ , కో క్లస్టర్ ఇంచార్జ్, డివిజన్ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు, టిడిపి, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.