iTDPNelloreCity

iTDPNelloreCity Nellore

*AP Budget Sessions | Legislative Council - Live.**Live Link*:
12/02/2026

*AP Budget Sessions | Legislative Council - Live.*

*Live Link*:

AP Budget Sessions | Legislative Council - Live. ...

11/02/2026
*AP Budget Sessions - Honourable Governor's Speech - Live.**Live Link*:
11/02/2026

*AP Budget Sessions - Honourable Governor's Speech - Live.*

*Live Link*:

AP Budget Sessions - Honourable Governor's Speech - Live. ...

🔴LIVE: ఢిల్లీలో సీఎం చంద్రబాబు  ప్రెస్ మీట్ || CM Chandrababu Press Meet In  Delhi || ABN Watch Live-->>https://youtube....
10/02/2026

🔴LIVE: ఢిల్లీలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ || CM Chandrababu Press Meet In Delhi || ABN
Watch Live-->>https://youtube.com/live/43H4szYO6mQ

🔴LIVE: ఢిల్లీలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ || CM Chandrababu Press Meet In Delhi || ABN WATCH ABN LIVE HERE: ...

భారత తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. - కేంద్ర శాస్త్ర సాంకేతిక...
09/02/2026

భారత తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

- కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి శ్రీ Dr Jitendra Singh సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారు అమరావతి క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేశారు.
- రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ టవర్స్ నిర్మాణం
- భారత్ లో తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ సెంటర్ ను ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఏర్పాటు చేయబోతున్నాయి.
- ఈ కార్యక్రమంలో నాతోపాటు కేంద్ర మంత్రి Dr.Chandra Sekhar Pemmasani గారు, యువనేత మంత్రి Nara Lokesh గారు, మంత్రి కందుల దుర్గేష్ గారు, ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులు, తిరుపతి, చెన్నై ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


పేదలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర పురపాలక...
09/02/2026

పేదలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

39వ డివిజన్ మూలాపేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్‌ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మంత్రి మాట్లాడుతూ, నగరంలో రోజుకు 3 లక్షల లీటర్ల మినరల్ వాటర్‌ను ప్రజలకు అందించేందుకు 2014లోనే శ్రీకారం చుట్టామని చెప్పారు. మూడు మదర్ ప్లాంట్లు, 60 చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రూ.2 కోట్ల 60 లక్షలతో పనులు చేపట్టామని, గత ప్రభుత్వం వాటిని నిలిపివేసి ప్రజా ధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు.
ఇప్పటికే 26 ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లను ప్రారంభించామని, మరో ఐదు ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అవసరమైతే మరో 60 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను పేదలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని స్పష్టం చేశారు. జూన్ 12 నాటికి చేపట్టిన అన్ని పనులను పూర్తి చేస్తామని, ప్రజల సహకారంతో నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నగర ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలన్న మంత్రి నారాయణ సంకల్పంతో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 60 వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మూలాపేటలో 26వ వాటర్ ప్లాంట్‌ను ఈరోజు మంత్రి ప్రారంభించారని చెప్పారు. అలాగే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ హైస్కూల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, పేదల సంక్షేమం కోసం కూడా సంవత్సరానికి 10 కోట్లు సొంత నిధులను నారాయణ గారు ఖర్చు చేస్తున్నారని, ఇది మంత్రి సేవ భావానికి నిదర్శంగా రూప్ కుమార్ చెప్పారు

అనంతరం మూలాపేట బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆదునీకరణ పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. DSR ఫౌండేషన్ సహకారంతో కార్పొరేట్ హంగులతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, జూన్ నాటికి పాఠశాల అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, కార్పొరేటర్ నాగరాజు, అన్నంగి ప్రసాద్, నాని స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

*నెల్లూరు*08-02-2026➖ *16 కోట్ల 70 లక్షలతో మూలాపేట లోని వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు*➖ ఆలయ నమూనా డిజైన్లను పరి...
09/02/2026

*నెల్లూరు*
08-02-2026

➖ *16 కోట్ల 70 లక్షలతో మూలాపేట లోని వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు*

➖ ఆలయ నమూనా డిజైన్లను పరిశీలించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ

➖ నిర్మాణ పనులపై దేవాదాయశాఖ అధికారులకు పలు సూచనలు చేసిన ఇరువురు మంత్రులు

➖ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని ఆదేశం

➖అనంతరం వేణుగోపాలస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు .

*మంత్రులు ఆనం ,నారాయణ మాట్లాడుతు*

➖ ఆరునెలల క్రితం త్రిదండి చినజీయర్ చినజీయర్ స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు

➖ ప్రధాన ఆలయంతో పాటు ,నరసింహస్వామి ఆలయ ఫౌండేషన్ పూర్తయింది

➖ ఆలయానికి నాలుగు వైపులా మాడవీధులు ఏర్పాటు చేస్తాము

➖ అనుకున్న సమయానికే శాస్త్రోక్తంగా పనులు పూర్తి చేస్తాము.

➖ మరో 18 నెలల్లో ఆలయాన్ని పూర్తి చేసి భక్తులకు కానుకగా ఇస్తాము

*అట్టహాసంగా మూలస్థానేశ్వర స్వామివారి పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం*➖ హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...
09/02/2026

*అట్టహాసంగా మూలస్థానేశ్వర స్వామివారి పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం*

➖ హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నగర ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు

➖ శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయ పాలకమండలి కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టా అజయ్ కుమార్ రెడ్డి, పాలకమండలి సభ్యులు

➖ మంత్రులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన ఆలయ వేదపండితులు, ఆలయ అధికారులు

*మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్*

➖ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఆలయాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది

➖ రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలతో పాటు నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఎంతో పవిత్రమైనది

➖ ఇంత గొప్ప ఆలయానికి పాలకమండలి సభ్యులుగా ఎంపికైన వారందరూ అపారమైన భక్తి, విశ్వాసాలతో భక్తులకు సేవ చేయాలి

➖ భక్తుల సేవకులుగా ఆలయ పాలకమండలి సభ్యులు పనిచేయాలి... ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయాలి

➖ మంత్రి నారాయణ సూచనలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం మేరకు పాలకమండలి ఎంపిక చేశాం

➖ చైర్మన్ పుట్టా అజయ్ , నూతన కమిటీ సభ్యులకు అభినందనలు

➖ పాలకమండలి సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

➖ మంత్రి నారాయణ గారి సూచనలు, స్థానిక ప్రజల అభిప్రాయాల మేరకు మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

*మంత్రి నారాయణ కామెంట్స్*

➖ మూలస్థానేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన పుట్టా అజయ్ కుమార్ రెడ్డి , కమిటీ సభ్యులకు అభినందనలు .

➖ భక్తులకు సేవలు అందించి పాలకమండలి మంచి పేరు తెచ్చుకోవాలి

➖ ఈనెల 15 నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి

➖ ఈనెల 15న శివరాత్రి,17వ రథోత్సవం రోజుల్లో భక్తుల రద్దీకనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

➖ విద్యుత్, మున్సిపల్, పోలీసు తదితర శాఖలన్నీ సమర్థవంతంగా తమ విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

➖ 2018 లో తాను మంత్రిగా ఈ ఆలయ కోనేరును 6.80 కోట్లతో అత్యంత సుందరంగా నిర్మించాం

➖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో నెల్లూరు నగరంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం

Address

Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDPNelloreCity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share