27/05/2026
ఒంగోలు నియోజకవర్గంలో కోలాహలంగా తెలుగుదేశం పార్టీ మహానాడు-2026
* ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ మహానాడు పండగ.
* ప్రతి క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ల ద్వారా మహానాడును వీక్షిస్తున్న టీడీపీ శ్రేణులు...
* మహానాడు కార్యక్రమాలకు హాజరై క్లస్టర్-08 బండ్లమిట్ట నందు తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు ఎన్టీఅర్ కు నివాళులర్పించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు.
* ఒంగోలు నగరం మరియు ఒంగోలు మండల పరిధిలోని 10 క్లస్టర్ల పరిధిలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.
* ఈ సందర్భంగా శాసనసభ్యులు జనార్దన్ గారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాల ఆవిర్భావానికి ఎన్టీఆర్ ఆద్యుడని, పేద ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని తెలిపారు. టిడిపికి అసలైన బలం కార్యకర్తలేనని, తరాలు మారినా పసుపు జెండా మారదని జనార్దన్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల రుణం ఎన్నటికీ తీర్చలేమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల వెంటే నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు.
* ఏపీ అభివృద్ధికి దిక్సూచి చంద్రబాబు నాయుడేనని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబేనని, కార్యకర్తల త్యాగాల వల్లే పార్టీ, ప్రభుత్వాల్లో పదవులు దక్కుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా కుటుంబ సభ్యుల్లా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
* ఈ కార్యక్రమం లో పార్టీ పరిశీలుకులు శివ ప్రసాద్ గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, నగర అధ్యక్షులు బండారు మదన్ గారు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ /గ్రామ కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర /జిల్లా /నియోజకవర్గ /నగర అనుబంధ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, ఐటీడీపి సభ్యులు మరియు ప్రజలకు పెద్ద ఏత్తున పాల్గొన్నడం జరిగినది.