31/08/2026
చెంచు రెడ్డి పాలెం లో ఆర్.ఓ ప్లాంట్ ను, పునర్ధరించాలి
కరువు పర్యటనలో సిపిఎం నాయకులు డిమాండ్.
గుడ్లూరు మండలం చెంచు రెడ్డి పాలెం గ్రామంలో ఆర్. ఓ. ప్లాంటును పునరుద్ధరించి. ప్రజల దాహార్తి ని తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున, సాగునీటికి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా సిపిఎం గ్రామ గ్రామాన కరువు పర్యటనలు, చేపట్టింది. ఇందులో భాగంగానే గుడ్లూరు మండలం చెంచు రెడ్డిపాలెం గ్రామంలో, సిపిఎం బృందం పర్యటించింది. గత ప్రభుత్వం,3 లక్షల 75 వేల తో ఎంపీ నిధులతో మంచినీటి సరఫరా ట్యాంక్ ఏర్పాటు చేసి ఉంది. ఆరో ప్లాంట్ వద్ద ఉన్న వాటర్ నిలువ ఉంచే ట్యాంక్ డ్యామేజ్ కావడంతో ఈ రెండు సంవత్సరాల నుంచి పట్టించుకోని కారణంగా, ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంగా పడి ఉంది. వెంటనే , మరమ్మతులు చేపట్టి ఆర్వో ప్లాంట్ నుండి త్రాగునీటిని వెంటనే సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తుంది. అలాగే చుక్కల భూములు ఆన్లైన్ ఎక్కించనీ కారణంగా, సుమారు 100 ఎకరాలకు పైగా, ప్రభుత్వం నుండి రావలసిన పథకాలు రాకుండా పోతున్నాయని, 22A, ఫ్రీ హోల్డ్, పథకాన్ని రద్దుచేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి పని ప్రారంభం నుండి, 5 వారాలు మాత్రమే పని కల్పించాలని, మిగతా రోజులు పని లేనందువల్ల ఇబ్బందులు పడుతున్నామని, సిపిఎం బృందానికి గ్రామ ప్రజలు తెలిపారు. వెంటనే వి బి జి రాంజీ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గుడ్లూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి, వ్యవసాయ కార్మికుల్ని రైతాంగాన్నీ ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ పర్యటనలో, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి, సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ జి వెంకటేశ్వర్లు, సిపిఎం శాఖా కార్యదర్శులు, కొట్టే వెంకయ్య, గుత్తి మల్లికార్జున, సిపిఎం నాయకులు, దా మా కృష్ణయ్య, పాలకుర్తి నాగేశ్వరరావు, రైతులు, నరసారెడ్డి, మల్యాద్రి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.