22/05/2022
*బైక్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన మాజీ MLA TRR గారు.*
పరిగి నియోజకవర్గ, కుల్కచెర్ల మండల కార్యక్రమ పర్యటనలు ముగించుకొని పరిగికి వస్తున్న మాజీ MLA, DCC అద్యక్షులు T. రామ్మోహన్ రెడ్డి గారు పరిగి సమీపంలో లాక్షిదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీ తరువాత బైక్ ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురి అయి రోడ్డు పై పడ్డ వ్యక్తిని గమనించి తన సిబ్బంది సహాయంతో పక్కకు తీసుకెళ్లారు అతని పెరు RTC రాములు, చాపల్ గూడెం, కుల్కచెర్ల వాసి గా తెలిసింది
అతన్ని TRR గారు తన వాహనంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ సిబ్బంది లేక డాక్టర్ లేకపోవడంతో జిల్లా వైద్య అధికారి (DMHO) తుకారం తో ఫోన్లో మాట్లాడి మండిపడ్డారు.. విధులకు రాని డాక్టర్ను తాను సస్పెండ్ చేస్తున్నామని DMHO తెలిపారు..
రాములుకు బలమైన గాయాలు తగలడంతో వైద్య సిబ్బంది, వస్తాలు లేని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయాలేమని తెలపడంతో మాజీ MLA TRR గారు రాములు ను వైద్యం నిమిత్తము తన వాహనంలో TRR మెడికల్ హాస్పిటల్, పఠాన్ చెరుకు తీసుకెళ్లారు...
తను MLA గా ఉన్నపుడు నిర్మాణం చేయించి పూర్తి అయిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి ప్రభుత్వం సరిఅయిన సిబ్బందిని డాక్టర్లను నియమించకపోవడం దారుణమని మండిపడ్డారు...
ఈ ఒక్క రోజే దురదృష్టవశాత్తు గుండె పోటు, ఆక్సిడెంట్, పాము కాటు లాంటి అత్యవసర చికిత్స కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను చూడటానికి డాక్టర్లు లేకపోవడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యాల విషయంలో అధికారులు, ప్రభుత్వం, స్థానిక MLA ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలుస్తుందని మండిపడ్డారు..
👉🏻.తక్షణమే డాక్టర్లు, సరిపడా సిబ్బందిని నియమించకపోతే బాగుండదని ఫోన్ కాల్ లో DMHO కు హెచ్చరించారు..తీవ్రమైన పరిణామాలు ఎదుర్కుంటారని హెచ్చరించారు.