03/09/2026
•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు
•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు
•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు
•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/13MXl