03/09/2026
పార్వతిపురం మన్యం జిల్లా సెప్టెంబర్ 3
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
* **గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ల గ్రీన్ గార్డుల సమస్యను పరిష్కారం చేయాలని, ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని రెండో రోజు కొనసాగిన దీక్షలు ఈ సందర్భంగా చర్చి సెంటర్లో మానవహారం చేసి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారికి వినతి పత్రం అందించడం జరిగింది* *
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ యూనియన్ (సిఐటియు)
*ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు, జె గౌరీ, చంటి*,
*సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ* యమ్మల మన్మధరావు
గ్రామ పంచాయతీ గ్రీనంబసిడర్స్ గ్రీన్ గార్డ్స్ కి నెలలు తరబడి,సంవత్సరాలు తరబడి జీతాలు చెల్లించకపోతే ఏ విధంగా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు,పెండింగ్ జీతాలు . మున్సిపల్ కార్మికులు మాదిరిగా 21000 జీతం చెల్లించాలని మాస్కులు గ్లౌజులు యూనిఫామ్ గమ్ బూట్లు ఇవ్వాలని 10 లక్షల రూపాయలతో కూడిన ఇన్సూరెన్స్ సౌకర్యం దాన సంస్కరణలకు 20,000 ఇవ్వాలని ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి 132,142,680, జీవోలు అమలు చేయాలని హెల్త్ అలవెన్స్ ₹4,000 అమలు చేయాలని తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించి, జిల్లా కలెక్టర్ గారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఆదివారం కూడా పని చేయండి అని చెప్పడం పనిచేసిన కాలానికి నెలలు తరబడి చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం అని వీళ్ళందరూ దళితులు గిరిజనులు బిసి పేదలు ఉన్నారని ఒకపక్క ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే ఈ విధంగా గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్ వేధించడం పద్ధతి కాదు తక్షణమే పెండింగ్ జీతాలు జిల్లా కలెక్టర్ గారు చెల్లించాలని కోరారు, గతంలో పంచాయతీ అధికారులు సర్పంచులు జీతాలు సక్రమంగా చెల్లించలేదు. ఇప్పుడు స్పెషల్ అధికారులు పరిపాలన వచ్చిన దగ్గర నుండి మరియు గత పంచాయతీ పరిపాలన నుండి మాకు సక్రమంగా జీతాలు రావట్లేదు మేము గ్రామములో పారిశుధ్యం పనులు చేస్తూ వేరే పనులకు వెళ్ళలేక పోతున్నాము ఇస్తున్న 6000 కూడా సక్రమంగా ఇవ్వకపోతే భార్య పిల్లలతో ఏ విధంగా బ్రతుకుతాము అయ్యా మాకు జీతాలు చెల్లించి మమ్ములను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2,3 తేదీల్లో అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరాహార దీక్షలు మరియు ధర్నాలో పాల్గొన్న గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ కార్మికులందరికీ ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు *గొర్లి వెంకటరమణ వి,ఇందిరా,బివి,రమణ , ఆర్ వేణు,బొంకుర సూరిబాబు, ఫకీరు, వెంకటి గుండయ్య, రాము, సింహాచలం, గౌరీ*, తదితరులు పాల్గొన్నారు.