CPM PMD

CPM PMD communist party of marxist (cpm)

01/06/2026
సిఐటియు 56వఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీరఘట్టం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో ఒట్టిగడ్డ వంతెన (గ్రోమోర్ సెంటర్)సమీపంలో మజ్...
30/05/2026

సిఐటియు 56వఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీరఘట్టం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో ఒట్టిగడ్డ వంతెన (గ్రోమోర్ సెంటర్)సమీపంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ , వ్యవసాయ కార్మికులు పంచాయతీ వర్కర్స్, గ్రీన్ అంబాసిడర్లు ప్రజలు పాల్గొన్నారు.

*కార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలను అరికడదాం** సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు* పార్వతీపురం మున్సిపల్ కార్మ...
30/05/2026

*కార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలను అరికడదాం*
* సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
* పార్వతీపురం మున్సిపల్ కార్మికులు జండా ఆవిష్కరణ

దేశ కార్మిక వర్గ హక్కుల సాధన కోసం, శ్రమజీవుల సంక్షేమం కోసం, కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం నిరంతరం సిఐటియు పోరాడుతుందని సిఐటియు నాయకులు అన్నారు. శనివారం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) 56 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమస్త కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పార్వతీపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు, కళాసీ, ఆటో స్టాండ్ వద్ద సిఐటియు జెండాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు మాట్లాడుతూ 1970 మే 30న స్థాపించబడిన సిఐటియు, దేశంలోని కార్మిక వర్గానికి అండగా నిలుస్తూ వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలను విజయవంతంగా నడిపిందనీ అన్నారు. అసంఘటిత రంగ కార్మికులు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తోందనీ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కార్మిక చట్టాల పరిరక్షణ, ప్రజా రంగ సంస్థల రక్షణ, కార్మికుల జీవన హక్కుల సాధన కోసం మరింత ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందనీ కొనియాడారు. నాలుగు లేబర్ అమలు చేస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. పని గంటలు పెంచుతూ వేతనాలు తగ్గిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. కార్పొరేట్ల కోసం కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్న బిజెపి విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికులపై ధమనకాండం విధిస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సిఐటియు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ కార్మికులందరూ సంఘటితమై తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పార్వతిపురం కార్యదర్శి సిహెచ్ సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, ఆటో యూనియన్ నాయకులు సింహాచలం కృష్ణ, కళాసి యూనియన్ నాయకులు భానుమూర్తి, జి.కృష్ణ, మున్సిపల్ కార్మికులు రవి, వరదరాజు, శంకర్రావు, ఎం.శివా, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రచురణార్ధంతేదీ. 30.05.2026పార్వతీపురం *సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం**ఐక్య పోరాటాలు ద్వారానే హక్కులు సాధ్యమవుతాయి సిఐ...
30/05/2026

ప్రచురణార్ధం
తేదీ. 30.05.2026
పార్వతీపురం

*సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం*

*ఐక్య పోరాటాలు ద్వారానే హక్కులు సాధ్యమవుతాయి సిఐటియు జిల్లా కార్యదర్శి యమ్మల మన్మధరావు* . సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్వతిపురం సుందరయ్య భవనం వద్ద సిఐటియు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఐక్యత - పోరాటం'' నినాదం ఊపిరిగా 1970లో అతి కొద్ది మందితో ఏర్పడిన సిఐటియు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో విస్తరించి కార్మికుల హక్కులు కోసం, సమస్యలు పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించిందని 1974లో భారతదేశ వ్యాప్తంగా మహత్కరమైనటువంటి రైల్వే పోరాటం నడిపింది.పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి సాధించిందంటే కారణం కార్మికుల, ఇతర శ్రామిక ప్రజలను తీవ్ర శ్రమ దోపిడీ చేయడం ద్వారానె , వారి శ్రమను పీల్చి పిప్పిచేయడం ద్వారానే పెట్టుబడిదారీ జరిగిందని అన్నారు. దోపిడీ పీడనల నుండి విముక్తి కోసం కార్మికవర్గం చేసిన, చేస్తున్న పోరాటాలు, ఆ పోరాటాలను అణచివేయడానికి పాలక వర్గాలు సాగిస్తున్న దమనకాండే ఈ కాలపు చరిత్ర అని అన్నారు. భారత కార్మిక వర్గాన్ని, కార్మిక కర్షకమైత్రిని ఐక్యం చేయడం ద్వారా దోపిడీ, పీడన లేని సమ సమాజం సాధించడంసిఐటియు లక్ష్యమని అన్నారు. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలను నిర్వహించడంలో సిఐటియు ముందు ఉందని అన్నారు. పాలకవర్గాలపై పోరాడటానికి, హక్కులు సాధనకు ఐక్యత అవసరం అని అన్నారు. తరతరాలుగా కార్మికవర్గం అశేష త్యాగాలతో పోరాడిసాధించిన కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే 29 కార్మిక చట్టాలను విలీనం చేసి 4 కోడ్‌లుగా మార్చిపడేసిందని అన్నారు. ప్రజలతో పాటు కార్మికుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి బిజెపి తన పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వానికి ప్రజలు ప్రయోజనాలు కంటే అంబానీ, అదానీ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. హక్కులు నిలబెట్టుకోవడం కోసం ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఉపాధ్యక్షులు రెడ్డి వేణు, కార్యదర్శి బివి రమణ, పట్టణ నాయకులు సూరిబాబు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

మే 28, సాలూరు పట్టణం. సిపిఎంపై  ఈడీ దాడులను నిరసిస్తూ ఆందోళన. దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ ...
28/05/2026

మే 28, సాలూరు పట్టణం.
సిపిఎంపై ఈడీ దాడులను నిరసిస్తూ ఆందోళన.
దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ .
దేశంలో దర్యాప్తు సంస్థలను, వారి హక్కులను స్వార్థ ప్రయోజనాల కోసం బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కై జేబు సంస్థలుగా మార్చేశాయని సిపిఎం వెల్లడించింది.
కేరళలో మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్ నేత విజయన గారి పై ఉండీ దాడులు నిరసిస్తూ

మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వై నాయుడు మాట్లాడారు.
కేరళలో మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్ నాయకులు వినరయి విజయన లక్ష్యంగా చేసుకుని బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏకకాలంలో ఈ డి తో బిజెపి దాడులు చేయిస్తే దానికి కేరళలో పాలక కాంగ్రెస్ సహాయ చేసినటు భావించాల్సి ఉంటుందని, దేశంలో బిజెపి మాత్రమే ఉండాలని సిద్ధాంతాన్ని బిజెపి కోరుకుంటుందని ,
వాటికి వ్యతిరేకంగా ఉండే పార్టీలు మరియు సంస్థలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని,
రోజంతా దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తు అధికారులు ఏమి కనిపెట్టకుండానే ఒట్టి చేతులతో వెళ్లారని,
దీనినిబట్టి పాలక బిజెపి కాంగ్రెస్లు సిపిఎం పై , నాయకులు పై బురదజల్లే బురద జల్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయని,
ఇలాంటి పరిస్థితులను ప్రజా మద్దతుతో పోరాటాలు నిర్వహించి ఎదుర్కోవడానికి సిపిఎం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
ఇలాంటి వైఖరిని మేధావులు ప్రజాసంఘాలు ఖండించాలని కోరారు. వైఖరి పాలక పార్టీలు ఆపకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు శ్రీను, దేవి, వెంకన్న, శంకరరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈడి దాడులకు నిరసనగా పాచి పెంట  మండల కేంద్రం సిపిఎం మండల నాయకులు సుర్రు రామారావు  జె రామయ్య  ఆధ్వర్యంలో  ఆర్టీసీ కాంప్లెక...
28/05/2026

ఈడి దాడులకు నిరసనగా పాచి పెంట మండల కేంద్రం సిపిఎం మండల నాయకులు సుర్రు రామారావు జె రామయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం ఆవరణలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ కేరళ సిపిఎం మాజీ ముఖ్యమంత్రి పిన్నరై విజయం పైన బిజెపి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కేరళలో యుడిఎఫ్ ప్రభుత్వం సహకారంతో ఈ విధంగా ఈడి దాడులు చేస్తున్నారని సిపిఎం ఎదుగుదలను భరించలేక కేరళలో ఓడిపోయిన బిజెపి ఈ విధంగా దుర్మార్గం చర్యలు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు, పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయని అన్నారు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కొన్ని రోజుల్లోనే ప్రతిపక్ష ముఖ్యమంత్రిపై ఇటువంటి ఈ డి దాడులు చేయించడం ఇటువంటి నియంత పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారని భవిష్యత్తులో ఇటువంటి పాలకులకు గట్టి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ పై దాడులు చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యుల పైన కూడా ఇటువంటి దాడులు జరపడం దారుణమని ప్రజలంతా ఈ దాడులను ఖండించాలని భవిష్యత్తులో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇటువంటి నియంత పాలకులకు బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిలపర్తి పోలిరాజు ఆటో యూనియన్ నాయకులు ఏ వసంతరావు కే శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు✊

28/05/2026

* *అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న మాజీ సీఎం పినరయి విజయన్ పై ఈడి దాడులను ఖండిస్తున్నా నిరసన*

• *సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిరా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్*

*పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కొమరాడ అంటి వలస జల పెద్ద శాఖ డ0గ భద్ర గ్రామంలో ఈరోజు అనగా గురువారం కేరళ మాజీ ముఖ్యమంత్రి మరియు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ఇళ్ళ పై ఈడి దాడులు నిర్వహించడం* *అన్యాయమని, ఈ చర్యలను తీవ్రంగా ఖండించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు కొమరాడ మండలం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా విద్య వైద్య రంగంలోనూ మరియు పర్యాటక కేంద్రంలోనూ అన్ని విధాలుగా ఆదర్శంగా పేరు ప్రఖ్యాతిగాంచిన కేరళ రాష్ట్రంపై కేంద్ర బిజెపి ప్రభుత్వం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా , దాడులకు పాల్పడుతుందని ఇది చాలా అన్యాయమని* *మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రోజులలోనే ప్రతిపక్ష ముఖ్యమంత్రి పై ఇటువంటి ఈడీ దాడులు చేయించడం అమానుషమని ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని అన్నారు. కేరళ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ బిజెపితో చేతులు కలిపి ఈ నీచమైన దాడులకు పాల్పడిందని తెలిపారు*. *మాజీ ముఖ్యమంత్రి ఇంటి తో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా ఈడి దాడులు చేయడం దారుణమని వాపోయారు. ఇది కేవలం కుట్రపూరితమైన దాడిలో భాగమేనని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న మంత్రులు ఎన్నో అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో వాళ్లపై కూడా* *ఈడి దాడులు ఎందుకు చేయరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం మీ వారు అయితే ఒకలా బయటివారైతే ఒకలా ఇదేనా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కాబట్టి వెంటనే ప్రజల పక్షాన మరియు దళితులు మరియు గిరిజనులు మరియు కార్మికుల సమస్యలపై పోరాడుతూ అనేక నిర్బంధాలను ఎదిరించి పోరాడుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి పై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఇలాగే కొనసాగితే* *దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజలతోటి అన్ని ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి అదెత్తిన ఆందోళన తప్పదని ఈ సందర్భంగా నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో చిరిగిన సంఘం నాయకులు గంగరాజు రామారావు సత్యం మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*.

* *అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న మాజీ సీఎం పినరయి విజయన్ పై ఈడి దాడులను ఖండిస్తున్నా నిరసన*• *సిపిఎం ...
28/05/2026

* *అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న మాజీ సీఎం పినరయి విజయన్ పై ఈడి దాడులను ఖండిస్తున్నా నిరసన*

• *సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిరా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్*

*పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కొమరాడ అంటి వలస జల పెద్ద శాఖ డ0గ భద్ర గ్రామంలో ఈరోజు అనగా గురువారం కేరళ మాజీ ముఖ్యమంత్రి మరియు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ఇళ్ళ పై ఈడి దాడులు నిర్వహించడం* *అన్యాయమని, ఈ చర్యలను తీవ్రంగా ఖండించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు కొమరాడ మండలం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా విద్య వైద్య రంగంలోనూ మరియు పర్యాటక కేంద్రంలోనూ అన్ని విధాలుగా ఆదర్శంగా పేరు ప్రఖ్యాతిగాంచిన కేరళ రాష్ట్రంపై కేంద్ర బిజెపి ప్రభుత్వం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా , దాడులకు పాల్పడుతుందని ఇది చాలా అన్యాయమని* *మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రోజులలోనే ప్రతిపక్ష ముఖ్యమంత్రి పై ఇటువంటి ఈడీ దాడులు చేయించడం అమానుషమని ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని అన్నారు. కేరళ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ బిజెపితో చేతులు కలిపి ఈ నీచమైన దాడులకు పాల్పడిందని తెలిపారు*. *మాజీ ముఖ్యమంత్రి ఇంటి తో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా ఈడి దాడులు చేయడం దారుణమని వాపోయారు. ఇది కేవలం కుట్రపూరితమైన దాడిలో భాగమేనని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న మంత్రులు ఎన్నో అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో వాళ్లపై కూడా* *ఈడి దాడులు ఎందుకు చేయరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం మీ వారు అయితే ఒకలా బయటివారైతే ఒకలా ఇదేనా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కాబట్టి వెంటనే ప్రజల పక్షాన మరియు దళితులు మరియు గిరిజనులు మరియు కార్మికుల సమస్యలపై పోరాడుతూ అనేక నిర్బంధాలను ఎదిరించి పోరాడుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి పై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఇలాగే కొనసాగితే* *దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజలతోటి అన్ని ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి అదెత్తిన ఆందోళన తప్పదని ఈ సందర్భంగా నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో చిరిగిన సంఘం నాయకులు గంగరాజు రామారావు సత్యం మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*.

28/05/2026

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇళ్ళ పై ఈ డి దాడులు కు నిరసన గా జియ్యమ్మ వలస లో ధర్నా కార్యక్రమం జరిగింది సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, మండల కార్యదర్శి కూరంగి సీతారాం పాల్గొన్నారు.

Address

Kralitivari Street Opp, Belagam, Mainroad
Parvathipuram
PARVATHIPURAM

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM PMD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPM PMD:

Share