Telugu Desam Party: Pedana

Telugu Desam Party: Pedana Official Page of TDP Pedana

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో విశ్రాంతి...
02/05/2026

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.


02/05/2026

భవన నిర్మాణ కార్మికుల కుటుంబంలోని స్త్రీలకు చంద్రన్న ఇచ్చిన ఆర్థిక భరోసా "రూ.20,000 ప్రసూతి సాయం".
#పేదలసేవలో



కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దా...
02/05/2026

కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ కూడా పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఎయిర్ పోర్ట్ కారణంగా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి.




02/05/2026

ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు.





* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు * కృష్ణా జిల్లాలోని గుడ్...
02/05/2026

* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు

* కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు లో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

* గుంటూరు పార్లమెంట్ నేతల ఆత్మీయ విందు సమావేశంలో హాజరైన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

* ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ

* పేదలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నాం. రూ.30తో ప్రారంభమైన పెన్షన్‌ను రూ.4000కు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే. మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/0TDSr



కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారం...
01/05/2026

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం ఐ కేర్ సెంటర్‌లోని వివిధ విభాగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.


01/05/2026
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదలసేవలో’ కార్యక్రమంలో భాగ...
01/05/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదలసేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ అనే 13 ఏళ్ల బాలుడుకి రూ.10 వేల పింఛను సొమ్మును అందించారు. అతని ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధి కారణంగా నెలకు మూడు నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ ఖర్చవుతోందని వివేక్ కుటుంబ సభ్యులు సీఎంకు దృష్టికి తీసుకొచ్చారు. చదువులోనూ వివేక్ చురుగ్గా ఉంటారని, వ్యాధి నుంచి బయటపడేందుకు సాయం అందించాలని సీఎంను కోరారు. వారి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
#పేదలసేవలో





పదవ తరగతిలో 600లకు 596 మార్కులు సాధించడం అంటే ఆ విద్యార్థి ఏ కార్పొరేట్ స్కూల్లోనో చదివి ఉంటారని అనుకుంటారు. కానీ ఆంధ్రప...
01/05/2026

పదవ తరగతిలో 600లకు 596 మార్కులు సాధించడం అంటే ఆ విద్యార్థి ఏ కార్పొరేట్ స్కూల్లోనో చదివి ఉంటారని అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులు ఈ ఘనతను సాధించారు. ఇదంతా విద్యామంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ అధికారులు అమలుచేసిన వంద‌రోజుల ప్ర‌ణాళిక‌ వల్ల సాధ్యమైంది.





కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నార...
01/05/2026

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
#పేదలసేవలో





01/05/2026

పామర్రు"పేదలసేవలో" లబ్దిదారులను , కార్మికులను పక్కన కూర్చోబెట్టుకొని వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 😍🥰👏👏...

Address

Pedana
521366

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pedana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pedana:

Share