Punganur SDPI

Punganur SDPI SDPI-Social Democratic Party Of India

**తేదీ: 24 జూలై, 2026 పుంగనూరు. అన్నమ్య జిల్లా  # # # ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగ...
24/07/2026

**తేదీ: 24 జూలై, 2026
పుంగనూరు. అన్నమ్య జిల్లా

# # # ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం!

**- కేంద్ర ప్రభుత్వ చేతగానితనమే నీట్ (NEET) పేపర్ లీకేజీకి కారణం**

**- బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి**

**- SDPI అన్నమయ్య జిల్లా అధ్యక్షులు యూసుఫ్**

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అన్యాయంగా లాఠీఛార్జి చేయడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) అన్నమయ్య జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా న్యాయం అడగడానికి వచ్చిన ఆడబిడ్డల పట్ల పోలీసులు వ్యవహరించిన అమానుష తీరు అత్యంత దారుణం మరియు క్షమించరానిది అని SDPI అన్నమయ్య జిల్లా అధ్యక్షులు యూసుఫ్ మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రాణాలతో ముడిపడి ఉన్న ప్రతిష్టాత్మక పరీక్షలో పేపర్ లీకేజీ జరగడం కేంద్ర ప్రభుత్వ పూర్తి చేతగానితనానికి మరియు వైఫల్యానికి నిదర్శనం అని ఆయన విమర్శించారు. విద్యావ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించడం వారి నిరంకుశత్వానికి అద్దం పడుతోంది.

*** నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి, మరియు విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.

*దాడులపై చర్యలు:** శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆడబిడ్డలపై మరియు విద్యార్థులపై లాఠీఛార్జికి ఆదేశించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

*న్యాయ విచారణ:** పేపర్ లీకేజీ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.

*అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేసి చేయాలి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు SDPI వారికి అండగా ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని యూసుఫ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

యూసుఫ్,
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)
అన్నమయ్య జిల్లా.

దేశవ్యాప్త నిరసనవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి!దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత విద్యా వ్యవస్థలో జవా...
21/07/2026

దేశవ్యాప్త నిరసన

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి!

దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత, న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం మీ గళం వినిపించండి.

సీజేపీ మార్చ్‌లో విద్యార్థులపై లాఠీ చార్జ్ బిజెపి ప్రభుత్వ యువత భయాన్ని ప్రతిబింబిస్తున్నాయి, సిజెపి మార్చ్‌లో పాల్గొనే ...
20/07/2026

సీజేపీ మార్చ్‌లో విద్యార్థులపై లాఠీ చార్జ్ బిజెపి ప్రభుత్వ యువత భయాన్ని ప్రతిబింబిస్తున్నాయి, సిజెపి మార్చ్‌లో పాల్గొనే విద్యార్థులపై క్రూరమైన లాఠీ అభియోగం తీవ్రంగా ఖండించదగినది.

చర్చల ద్వారా యువకుల ఆందోళనలతో నిమగ్నమవ్వడానికి బదులుగా, బిజెపి ప్రభుత్వం మరోసారి అణచివేత మరియు హింసను ఎంచుకుంది.

పోలీసు బలగాలతో శాంతియుత విద్యార్థుల నిరసనలకు ఈ ప్రతిస్పందన ప్రభుత్వం ప్రజాస్వామ్య అసమ్మతి భయాన్ని వెల్లడిస్తుంది.

విద్యార్థులు దేశానికి శత్రువులు కాదు; వారు సమాజానికి మనస్సాక్షి.
వారి అభిప్రాయాలను సమీకరించడానికి మరియు వ్యక్తీకరించడానికి వారి హక్కు తప్పనిసరిగా రక్షించబడాలి, అణచివేయబడకూడదు.

యంగ్ డెమోక్రాట్లు పోలీసు చర్యను ఎదుర్కొన్న విద్యార్థులకు సంఘీభావంగా నిలుస్తారు.

ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్,రాజ్యాంగ స్వేచ్ఛలను గౌరవించాలని మరియు ప్రతి పౌరునికి ప్రజాస్వామ్య వాతావరణం తెరిచి ఉండేలా చూడాలని మేము అధికారులను కోరుతున్నాము.

మొహమ్మద్ షమీర్
నేషనల్ జాయింట్ కన్వీనర్
యంగ్ డెమోక్రాట్స్.

ప్రెస్ నోట్తేదీ: 18-07-2026SDPI పార్టీ పుంగనూరు అసెంబ్లీ కమిటీ సమావేశం నిర్వహణఈ రోజు పుంగనూరు అసెంబ్లీ కార్యదర్శి శ్రీ అ...
18/07/2026

ప్రెస్ నోట్
తేదీ: 18-07-2026

SDPI పార్టీ పుంగనూరు అసెంబ్లీ కమిటీ సమావేశం నిర్వహణ

ఈ రోజు పుంగనూరు అసెంబ్లీ కార్యదర్శి శ్రీ అసిఫ్ గారి ఆధ్వర్యంలో, ఎస్‌డీపీఐ (SDPI) పార్టీ జిల్లా కార్యాలయంలో పుంగనూరు అసెంబ్లీ కమిటీ సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశానికి ఎస్‌డీపీఐ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మరియు పుంగనూరు అసెంబ్లీ ఇన్‌చార్జి శ్రీ యునుస్ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి శ్రీ అసిఫ్ గారు మాట్లాడుతూ, పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, రాబోయే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఉద్యమాత్మకంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.

అనంతరం ఉమ్మడి జిల్లా కార్యదర్శి మరియు పుంగనూరు అసెంబ్లీ ఇన్‌చార్జి శ్రీ యునుస్ గారు మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామ, వార్డు, బూత్ స్థాయిల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పుంగనూరు అసెంబ్లీ పరిధికి చెందిన పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొని పార్టీ అభివృద్ధి, సభ్యత్వ నమోదు, రాబోయే కార్యక్రమాలపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు.

చివరగా సమావేశం విజయవంతంగా ముగియగా, పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఎస్‌డీపీఐ (SDPI) పార్టీ
పుంగనూరు అసెంబ్లీ కమిటీ

Condemn the Forcible Removal of Sonam Wangchuk and Fellow ProtestersStop Suppressing Peaceful Democratic ProtestsI stron...
18/07/2026

Condemn the Forcible Removal of Sonam Wangchuk and Fellow Protesters
Stop Suppressing Peaceful Democratic Protests

I strongly condemn the Modi Government's forcible removal of Sonam Wangchuk from Jantar Mantar, effectively crushing the peaceful protest he had sustained through a 21-day indefinite hunger strike in support of the movement against alleged irregularities in the NEET examination. Instead of engaging with the legitimate demands raised by Sonam Wangchuk and the protest committee, the government chose to use the court's directions as a pretext to suppress a peaceful and democratic expression of dissent. A government committed to democratic values should respond to public grievances through dialogue, not by silencing peaceful protests. I urge the Union Government to immediately address the demands raised by Sonam Wangchuk and the protest committee through meaningful engagement and ensure a just, transparent, and democratic resolution.

Mohammed Shafi
National Vice President
Social Democratic Party of India

కొత్త ఓటర్ల నమోదు కోసం తల్లిదండ్రుల SIR వివరాలను తప్పనిసరి చేయడాన్ని ఈసీఐ(ECI)  వెంటనే ఉపసంహరించుకోవాలిప్రెస్ రిలీజ్ 13 ...
15/07/2026

కొత్త ఓటర్ల నమోదు కోసం తల్లిదండ్రుల SIR వివరాలను తప్పనిసరి చేయడాన్ని ఈసీఐ(ECI) వెంటనే ఉపసంహరించుకోవాలి

ప్రెస్ రిలీజ్
13 జూలై 2026

కొత్త ఓటర్ల నమోదు కోసం ఆన్‌లైన్ ఫారం-6లో తల్లిదండ్రుల SIR వివరాలను తప్పనిసరి చేయాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) తీవ్రంగా ఖండిస్తుంది.

ఈ నిబంధనకు భారత రాజ్యాంగంలో గానీ, ప్రజాప్రతినిధుల చట్టం-1950 (Representation of the People Act, 1950)లో గానీ ఎలాంటి చట్టబద్ధ ఆధారం లేదు. అవసరమైన చట్ట సవరణలు చేయకుండానే ఈ నిబంధనను అమలు చేయడం జరిగింది.

ఓటు హక్కు అనేది పౌరసత్వం, నిర్దిష్ట వయస్సు మరియు సాధారణ నివాసం ఆధారంగా కలిగే రాజ్యాంగబద్ధ హక్కు. అది తల్లిదండ్రుల ఎన్నికల చరిత్ర లేదా వారి ఓటరు నమోదు స్థితిపై ఆధారపడి ఉండదు.

ప్రస్తుతం ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) కారణంగా విస్తృత స్థాయిలో ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయనే ఆరోపణలు, అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పించబడుతున్నారనే తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త నిబంధన మొదటిసారి ఓటు నమోదు చేసుకునే యువతకు, వలస కార్మికులకు మరియు అట్టడుగు వర్గాలకు మరింత భారంగా మారుతుంది.

SIR, పౌరసత్వ సవరణ చట్టం (CAA), అలాగే ప్రతిపాదిత జాతీయ పౌరుల నమోదు పట్టిక (NRC) చుట్టూ ఇప్పటికే నెలకొన్న వివాదాల నేపథ్యంలో, ఈ చర్య సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు కొత్త అడ్డంకులను సృష్టించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

అందువల్ల ఎన్నికల కమిషన్ ఈ చట్టవిరుద్ధమైన మరియు వివక్షపూరితమైన నిబంధనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత మరియు సమగ్ర ఎన్నికలను నిర్వహించాల్సిన తన రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించాలని SDPI డిమాండ్ చేస్తోంది.

ఎం. కె. ఫైజీ
జాతీయ అధ్యక్షులు
సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)

SIR ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు పొడిగించిన ఎన్నికల కమిషన్(ECI) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం –SDPIస్పెషల్ ఇంటెన్సివ్...
15/07/2026

SIR ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు పొడిగించిన ఎన్నికల కమిషన్(ECI) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం –SDPI

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఉన్న గడువును రెండు వారాలు పొడిగించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) తరఫున రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సత్తార్ గారు ఇటీవల ఒక ప్రకటనలో కోరారు.

అదేవిధంగా, అనేక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల కమిషన్‌ను కలిసి గడువు పొడిగింపు అవసరాన్ని వివరించి నివేదికలు సమర్పించాయి. అన్ని పార్టీల నుంచి వచ్చిన ఈ వినతులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్, ప్రస్తుతం గడువును పది రోజులు పొడిగిస్తూ ప్రకటన చేయడం స్వాగతించదగిన పరిణామం.

అదేవిధంగా, ఎలాంటి అర్హ ఓటరు ఓటరు జాబితా నుండి తొలగించబడకుండా, పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను ఎస్‌డీపీఐ విజ్ఞప్తి చేస్తోంది.

ప్రెస్ నోట్ 09/07/2026SDPI పార్టీ చిత్తూరు & అన్నమ్య ఉమ్మడి జిల్లాల సమావేశం .SOCIAL DEMOCRATIC PARTY OF INDIA (SDPI) అన్...
09/07/2026

ప్రెస్ నోట్

09/07/2026
SDPI పార్టీ చిత్తూరు & అన్నమ్య ఉమ్మడి జిల్లాల సమావేశం .

SOCIAL DEMOCRATIC PARTY OF INDIA (SDPI) అన్నమ్య జిల్లా కార్యాలయంలో జిల్లా పుంగనూరు లో కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ కార్యదర్శి రోషన్ గారి అధ్యక్షతన నిర్వహించబడింది.

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మహమ్మద్ గని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియలో ప్రజలకు గత SIR ఓటర్ల వివరాలను గుర్తించి అందించడంతో పాటు, వారి ఓటు ఆధారంగా సంబంధిత BLOలను గుర్తించి ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే Enumeration Forms పూరించడంలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా వ్యాప్తంగా చాలామంది SIR ఫారం లు తీసుకొని దానిని ఫిలప్ చేసి ఇవ్వకుండా తమ దగ్గరనే పెట్టుకోవడం జరిగింది తొందరగా ఫారం ఫిలప్ చేసి మీ BLO లోకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము
అలా ఇవ్వలేని పరిస్థితిలో మీ యొక్క ఓటు తొలిగిపోయే అవకాశం ఉంది ఈనెల 14వ తేదీ వరకు చివరి రోజు కాబట్టి చివరి సమయంలో ఆన్లైన్ పనిచేయడం కష్టం అవుతుంది కావున ప్రజలు తమ యొక్క పనులను పక్కన పెట్టి తమ ఓటు హక్కును కాపాడుచుకోవాల్సింది అవసరం ఉందని తెలిపారు ..

పార్టీ కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా SIR ఫారం ఫిలిప్ చేయడంలో మరియు 2002 ఓటర్ లిస్టులో పేరు వెతికి ఇవ్వడానికి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలపడం అయినది ..

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు రోషన్ గారూ యూనుస్ గారూ. ఏజాస్ గారూ జిల్లా ఉపాధ్యక్షలు జమీర్ లాల్ గారు జిల్లా నాయకులు హుజెఫ మరియు పుంగనూరు అసెంబ్లీ కార్యదర్శి అసిఫ్ గారు పలమనేరు అధ్యక్షులు ముబారక్ గారు కార్యదర్శులు మహబూబ్ గారు. అబ్దుల్ వారిస్ గారూ పార్టీ నాయకులు పాల్గొన్నారు..ప్రెస్ నోట్

09/07/2026
SDPI పార్టీ చిత్తూరు & అన్నమ్య ఉమ్మడి జిల్లాల సమావేశం .

SOCIAL DEMOCRATIC PARTY OF INDIA (SDPI) అన్నమ్య జిల్లా కార్యాలయంలో జిల్లా పుంగనూరు లో కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ కార్యదర్శి రోషన్ గారి అధ్యక్షతన నిర్వహించబడింది.

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మహమ్మద్ గని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియలో ప్రజలకు గత SIR ఓటర్ల వివరాలను గుర్తించి అందించడంతో పాటు, వారి ఓటు ఆధారంగా సంబంధిత BLOలను గుర్తించి ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే Enumeration Forms పూరించడంలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా వ్యాప్తంగా చాలామంది SIR ఫారం లు తీసుకొని దానిని ఫిలప్ చేసి ఇవ్వకుండా తమ దగ్గరనే పెట్టుకోవడం జరిగింది తొందరగా ఫారం ఫిలప్ చేసి మీ BLO లోకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము
అలా ఇవ్వలేని పరిస్థితిలో మీ యొక్క ఓటు తొలిగిపోయే అవకాశం ఉంది ఈనెల 14వ తేదీ వరకు చివరి రోజు కాబట్టి చివరి సమయంలో ఆన్లైన్ పనిచేయడం కష్టం అవుతుంది కావున ప్రజలు తమ యొక్క పనులను పక్కన పెట్టి తమ ఓటు హక్కును కాపాడుచుకోవాల్సింది అవసరం ఉందని తెలిపారు ..

పార్టీ కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా SIR ఫారం ఫిలిప్ చేయడంలో మరియు 2002 ఓటర్ లిస్టులో పేరు వెతికి ఇవ్వడానికి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలపడం అయినది ..

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు రోషన్ గారూ యూనుస్ గారూ. ఏజాస్ గారూ జిల్లా ఉపాధ్యక్షలు జమీర్ లాల్ గారు జిల్లా నాయకులు హుజెఫ మరియు పుంగనూరు అసెంబ్లీ కార్యదర్శి అసిఫ్ గారు పలమనేరు అధ్యక్షులు ముబారక్ గారు కార్యదర్శులు మహబూబ్ గారు. అబ్దుల్ వారిస్ గారూ పార్టీ నాయకులు పాల్గొన్నారు..
SDPI Andhra Pradesh OfficiaI

03/07/2026

ఈ రోజు 03-07-2026 పుంగనూరు పట్టణం లో MRO ఆఫీస్ నందు MRO గారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలా నాయకులు నాయకుల సమావేశం జరిగింది

ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిలుగా అన్నమయ జిల్లా జాయింట్ కలెక్టర్ పుంగనూరు ఎన్నికల అధికారి గారు పుంగనూరు MRO గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు రాజకీయ పార్టీల సంబంధించిన నాయకుల పాల్గొనడం జరిగింది

ఈ సందర్బంగా SDPI పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు యూసుఫ్ గారు SIR లో ప్రజలకు వస్తున్న సమస్యలు మరియు ఇబ్బందులను జాయిన్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది

ఇందులో ప్రధానంగా 2002 ఓటర్ లిస్టులో పేరులేని వారు పడుతున్న ఇబ్బందిని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎవరికైతే SIR ఫారంలు అందినవారు ప్రతి ఒక్కరూ ఫారంను ఈనెల 14వ తేదీ లోపల ఫిలప్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా సమయం ఉంది కదా అని ఆలస్యం చేయకుండా తొందరగా ఫిలప్ చేసి ఇవ్వలి అలా లేని పక్షంలో మా యొక్క ఓటు ఎగిరిపోయే అవకాశం ఉంది

2002 ఓటర్ లిస్టులో పేరు లేని వారు ఫారం లో పై రెండు భాగాలు వదిలేసి కింద భాగం ఫిలప్ చేసి ఇవ్వాలి ఆలా ఇచ్చిన వారికి నోటీస్ వస్తుంది నోటీస్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాల్లో ఏదో ఒక్క ఆధారం చూపించిన సరిపోతుంది మళ్ళీ ఓటు హక్కు పొందే అవకాశం ఉంది కావున ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి ఓటుహక్కు కోసం పాటుపడడానికి SDPI పార్టీ సిద్ధంగా ఉంది
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జామిర్ లాల్ గారు.ఆసిఫ్ గారు.ఖాదర్ బాషా గారు.జుబేర్ గారు. ముస్తాఫా గారు పార్టీ నాయకులు పాల్గొన్నారు

Address

Punganur

Website

Alerts

Be the first to know and let us send you an email when Punganur SDPI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share