Sri Sathya Sai District Police

Sri Sathya Sai District Police Official Handle of Sri Sathya Sai District Police. Please don't report Crime here. In case of Emergency Please / ,

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు...ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు – సీఐ కరీం ట్రాఫిక్...
03/09/2026

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు...ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు – సీఐ కరీం

ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సిఐ అబ్దుల్ కరీం తెలిపారు. గురువారం సాయంత్రం విజిబుల్ పోలింగ్ నిర్వహించి వాహనాల తనిఖీలు విస్తృతంగా చేపట్టారు.

సిగ్నల్ జంప్, మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలియజేశారు.

ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేయడం, మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను గుర్తించి, నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన చోట వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.

ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాతో పాటు చట్టప్రకారం తదుపరి చర్యలు/శిక్షలు కూడా విధించబడతాయి. మైనర్లు వాహనాలు నడుపుతున్న సందర్భాల్లో వాహనం, డ్రైవర్ మరియు వాహన యజమాని బాధ్యతలను పరిశీలించి, అమల్లో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా రెడ్ సిగ్నల్ వద్ద వాహనాలను నిలిపివేయాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతి వాహనానికి నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలని సూచించారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, సురక్షితమైన రహదారి ప్రయాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.

03/09/2026

🚨 ధర్మవరంలో పోలీసుల మెగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్!

🔹 75 ద్విచక్ర వాహనాలు
🔹 11 ఆటోలు, 1 కారు సీజ్
🔹 అక్రమంగా నిల్వ చేసిన క్రాకర్స్ స్వాధీనం
🔹 13 మంది రౌడీషీటర్లు, 6 మంది సస్పెక్ట్‌షీటర్లకు కౌన్సెలింగ్

గణేష్ ఉత్సవాలు, ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ IPS గారి పర్యవేక్షణలో 102 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

నేరాలకు చెక్… ప్రజలకు భద్రతే లక్ష్యం! 🚔

🚨 శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS గారి ఆదేశాల మేరకు, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు పోలీసులు...
03/09/2026

🚨 శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS గారి ఆదేశాల మేరకు, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 🚔

⚠️ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ.10,000 జరిమానా!

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారుడిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.

కోర్టు విచారణ అనంతరం నిందితుడికి రూ.10,000 జరిమానా విధించినట్లు పుట్టపర్తి పట్టణ సీఐ యువరాజు తెలిపారు. ⚖️

🍺❌ మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం.
మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని సీఐ యువరాజు తెలిపారు.

ప్రతి వాహనదారుడు తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

🚔 డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

👉 “మద్యం సేవిస్తే డ్రైవింగ్ వద్దు… సురక్షితంగా ఇంటికి చేరండి!” 🙏

🚨 డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కదిరి రూరల్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా మాత్రమే కాదు… జైలు శిక్ష...
03/09/2026

🚨 డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కదిరి రూరల్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా మాత్రమే కాదు… జైలు శిక్ష కూడా తప్పదు! ⚠️

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ IPS గారి ఆదేశాల మేరకు, కదిరి డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి గారి పర్యవేక్షణలో కదిరి రూరల్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

🍺 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు:
➡️ ఇప్పటివరకు 12 కేసులు నమోదు
➡️ 10 మందికి కలిపి ₹1,00,000 జరిమానా
➡️ 2 మందికి 7 రోజుల చొప్పున జైలు శిక్ష
➡️ తాజాగా మరో వ్యక్తికి ₹7,000 జరిమానా

🚫 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై కూడా చర్యలు:
➡️ 255 మందిని న్యాయస్థానం ఎదుట హాజరు
➡️ మొత్తం ₹90,000 జరిమానా

“మద్యం సేవించి వాహనం నడపవద్దు… మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దు.” 🙏

ప్రజా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు ఇకపై కూడా నిరంతరం కొనసాగుతాయని కదిరి రూరల్ పోలీసులు స్పష్టం చేశారు.

🚨 ధర్మవరంలో పోలీసుల భారీ కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌!శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నేరాల నియంత్రణ, శాంతిభ...
03/09/2026

🚨 ధర్మవరంలో పోలీసుల భారీ కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌!

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు మరో కీలక చర్య. 👮‍♂️

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్‌. సతీష్‌ కుమార్‌ ఐపీఎస్‌ గారి పర్యవేక్షణలో ధర్మవరంలోని ఎర్రగుంట్ల, లక్ష్మీ చెన్నకేశవ, మహాత్మా గాంధీ కాలనీల్లో గురువారం విస్తృత కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

🔎 రానున్న గణేష్‌ ఉత్సవాలు, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు, పాత నేరస్తుల కదలికలను గుర్తించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.

🚔 సీజ్‌ చేసినవి: • 75 ద్విచక్ర వాహనాలు
• 11 ఆటోలు
• 1 కారు
• అక్రమంగా నిల్వ ఉంచిన క్రాకర్స్‌

ఈ ఆపరేషన్‌లో 5 మంది సీఐలు, ఎస్‌ఐలు సహా మొత్తం 102 మంది పోలీసు సిబ్బంది పాల్గొని ఇళ్లు, అనుమానాస్పద ప్రాంతాలను విస్తృతంగా తనిఖీ చేశారు.

👮 రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీటర్లకు కౌన్సెలింగ్‌

13 మంది రౌడీషీటర్లు, 6 మంది సస్పెక్ట్‌షీటర్ల ఇళ్లను తనిఖీ చేసిన ఎస్పీ గారు స్వయంగా వారితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. మంచి ప్రవర్తనతో నేరాలకు దూరంగా ఉంటే నిబంధనల మేరకు రౌడీషీట్‌ తొలగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

🏠 ప్రజలకు ఎస్పీ భద్రతా సూచనలు

కొత్త వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్‌ తదితర గుర్తింపు పత్రాలను పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నేర కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

📹 కాలనీల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసుల బీట్‌ పెట్రోలింగ్‌కు ప్రజలు సహకరించాలని ఎస్పీ సూచించారు.

ప్రజల భద్రత కోసం పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుంది. నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం కూడా ఎంతో కీలకం. 🤝🚔

02/09/2026

🚨 బైండోవర్ షరతులు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదు!

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

రోళ్ల మండలంలో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై బాండ్ ఫోర్‌ఫీచర్ చర్యలు చేపట్టారు. కల్లురొప్పం గొల్లహట్టి గ్రామానికి చెందిన వ్యక్తికి 15 రోజుల రిమాండ్ విధించగా, అనంతరం జైలుకు తరలించారు.

⚠️ బైండోవర్ చేసిన వ్యక్తులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
బైండోవర్ అనంతరం 1 సంవత్సరం పాటు గొడవలు, ఇతర నేరాల్లో పాల్గొనకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల వరకు జరిమానా లేదా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

👉 చట్టాన్ని గౌరవించండి — శాంతిభద్రతలకు సహకరించండి.

📍 రోళ్ల పోలీస్ స్టేషన్, శ్రీ సత్యసాయి జిల్లా

02/09/2026

🚨 ప్రభుత్వ ఆస్తికి నష్టం.. నిందితుడి అరెస్ట్!

శ్రీ సత్యసాయి జిల్లా, కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల గ్రామంలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల గ్రామానికి చెందిన సాకే వంశీ, వయస్సు 21 సంవత్సరాలు, తండ్రి సాకే నరసింహులు శిలాఫలకంపై ఉన్న ప్రముఖుల చిత్రాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేసి, దాని రూపురేఖలను మార్చి నాశనం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో సుమారు రూ.12,000 విలువైన ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లింది.

గ్రామ పంచాయతీ సెక్రటరీ జానగొండ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనగానపల్లి పోలీస్ స్టేషన్‌లో Crime No.75/2026, U/s 351(2), 324(3) BNS, Sec.3 of PDPP Act కింద కేసు నమోదు చేశారు.

👮‍♂️ నిందితుడు సాకే వంశీని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

⚠️ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా, వాటిపై దాడులకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పో�

🚨 పుట్టపర్తిలో ట్రాఫిక్ క్రమశిక్షణకు పోలీసుల ప్రత్యేక దృష్టి!“ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు” అని డీఎస...
02/09/2026

🚨 పుట్టపర్తిలో ట్రాఫిక్ క్రమశిక్షణకు పోలీసుల ప్రత్యేక దృష్టి!

“ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు” అని డీఎస్పీ శ్రీ సత్యనారాయణ గారు స్పష్టం చేశారు.

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పుట్టపర్తి పట్టణంలో డీఎస్పీ శ్రీ సత్యనారాయణ, సీఐ యువరాజు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. 🚶‍♂️👮‍♂️

జనరల్ హాస్పిటల్ నుంచి సత్యమ్మ గుడి వరకు ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, భక్తులు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు.

🛑 షాపుల ముందు వాహనాలు, తోపుడు బండ్లు రోడ్డుపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు.
📵 డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించవద్దని హెచ్చరించారు.
🪖 హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని అవగాహన కల్పించారు.
🛺 గణేష్ గేట్, ఉత్తరం గేట్ వద్ద దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగేలా ఆటోలు, ద్విచక్ర వాహనాలు నిలపవద్దని సూచించారు.

అక్రమ పార్కింగ్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాల పత్రాలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. 💰

ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ట్రాఫిక్ క్రమశిక్షణతో పాటు నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని డీఎస్పీ తెలిపారు.

🤝 ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తూ, భద్రతపై నమ్మకాన్ని పెంచేలా ఇటువంటి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

02/09/2026

🚨 మడకశిరలో జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసుల దాడి!

జూదం నిర్వహిస్తున్న స్థలంపై పోలీసులు మెరుపు దాడి చేసి, జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

🎲 జూదానికి దూరంగా ఉండండి… చట్టాన్ని గౌరవించండి! 🚔

Address

Puttaparthi

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sathya Sai District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share