02/06/2026
🚨 బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు! 🚨
📍 శ్రీ సత్యసాయి జిల్లా | ధర్మవరం
ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ధర్మవరం టూ టౌన్ సీఐ శ్రీ రెడ్డప్ప స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ & తహసీల్దార్ చర్యలు తీసుకుంటూ రూ.50,000 జరిమానా విధించారు.
గతంలో సత్ప్రవర్తన పాటించాలని బాండ్ అమలు చేసినప్పటికీ, బాండ్ అమలులో ఉండగానే నేర కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో BNSS-2023 సెక్షన్ 122(1)(బి) ప్రకారం విచారణ నిర్వహించారు. సంబంధిత వ్యక్తి ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మొదట నిర్ణయించిన రూ.1,00,000 జరిమానాను రూ.50,000కు తగ్గిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా, మరో ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా ఉండేలా తాజా బాండ్ను అమలు చేయాలని ఆదేశించారు.
⚖️ బైండ్ ఓవర్లో ఉన్న వ్యక్తులు గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు లేదా ఇతర నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
👮♂️ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు.