07/09/2026
*బ్రహ్మంగారిమఠంలో అన్నదాన సత్ర నిర్మాణానికి శంకుస్థాపన:*
------------------------------------------------------------
*బ్రహ్మంగారిమఠం:*
వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని బద్వేల్ రోడ్, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక వడియరాజుల అన్నదాన సత్రం శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి *ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్* హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో, *చక్రవర్తి దంపతుల కూర్చున్నారు* ఉదయం 9.10 గంటలకు తులా లగ్న శుభ ముహూర్తాన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది.
*ప్రజాసేవే పరమావధిగా అన్నదాన సత్రం:*
ఈ సందర్భంగా వడ్డే వెంకట్ మాట్లాడుతూ, బ్రహ్మంగారిమఠం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవా దృక్పథంతో ముందడుగు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ చైతన్య సంస్థ వ్యవస్థాపకులు బి.సి. రమణ, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బరాయుడు, ప్రముఖులు వీర కుమార్ బాలకృష్ణ, వీర భాస్కర్, బాలయ్య, గుత్తి దేవీ శ్రీనివాసులు, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.
*అభినందనలు:* భక్తిభావంతో సామాజిక సేవా దృక్పథంతో అన్నదాన సత్ర నిర్మాణానికి పూనుకున్న నిర్వాహకులను ఈ సందర్భంగా వడ్డే వెంకట్ ప్రత్యేకంగా అభినందించారు.