02/09/2026
🚨 సోషల్ మీడియా చూసి దొంగనోట్ల దందా!
హైదరాబాద్లో నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి **రూ.2.91 లక్షల విలువైన 1,124 నకిలీ నోట్లు**, ప్రింటర్, స్కానర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
రాత్రివేళల్లో నోట్లు తీసుకునేటప్పుడు వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!