03/09/2026
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్..
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారు జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలు, విగ్రహాల ప్రతిష్ఠ, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ప్రతి గ్రామం, మండలం, పట్టణ పరిధిలోని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ముందస్తుగా పరిశీలించాలని జిల్లా ఎస్పీగారు ఆదేశించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళలు మరియు భక్తుల రక్షణతో పాటు అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, నిమజ్జన మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని ఎస్పీగారు ఆదేశించారు.
గణేష్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఆరుగురు ప్రత్యేక అధికారులను నియమించి, జిల్లా వ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. వీరు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తారని తెలిపారు.
సింగిల్ విండో విధానం ద్వారా తప్పనిసరిగా అనుమతులు పొందాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారు తెలిపారు. ఇందుకు ఎటువంటి చలానా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
దరఖాస్తు విధానం:
1. రిజిస్ట్రేషన్: ganeshutsav.net వెబ్సైట్లో New Application పై క్లిక్ చేయాలి.
2. OTP వెరిఫికేషన్: మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా వెరిఫై చేయాలి.
3. వివరాల నమోదు: నిర్వాహకులు, కమిటీ, మండపం, నిమజ్జనం, వాహనం తదితర వివరాలను నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి.
4. పోలీసు పరిశీలన: స్థానిక పోలీసులు మండప ప్రదేశాన్ని పరిశీలించి నిబంధనల మేరకు అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తారు.
5. NOC & QR కోడ్: దరఖాస్తు ఆమోదం అనంతరం ganeshutsav.net/applicationStatus ద్వారా NOC, QR కోడ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చుని తెలిపారు.
6.సదరు QR కోడ్ను స్కాన్ చేసి, అందులో సంబంధిత గణేష్ మండపం యొక్క Latitude & Longitude వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.
గణేష్ నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, ఉత్సవ కమిటీలు, వివిధ ప్రభుత్వ శాఖలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారు విజ్ఞప్తి