Ramagundam Police Commissionerate

Ramagundam Police Commissionerate To maintain public relation which in turn helping a lot in taking proper action against criminal activities in my region and also in taking up many cases.
(1)

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు. రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వ...
05/09/2026

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు. రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పట్టుబడిన 16 మందిని గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వెంకట సచిన్ రెడ్డి ఎదుట హాజరుపరిచారు.
వారిలో 15 మందికి రూ.41,500 జరిమానా విధించడంతో పాటు, కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు చేయించారు.ఒక వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధించగా, అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెన్నెల గ్రామంలో 02-09-2026న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు తోట మల్లేష్‌ను నెన్నెల ప...
05/09/2026

నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెన్నెల గ్రామంలో 02-09-2026న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు తోట మల్లేష్‌ను నెన్నెల పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసు వివరాలను బెల్లంపల్లి రూరల్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. హనూక్ వెల్లడించారు.
మృతురాలు తోట సబిత (38) నిందితుడి భార్య. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో నిందితుడు ఆమెను తరచూ వేధిస్తూ, గొడవపడేవాడని, గతంలో కూడా ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
02-09-2026న మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో నిందితుడు తన భార్య గొంతు నులిమి,అనంతరం ఇంట్లో లభించిన పదునైన వస్తువుతో ఆమె గొంతుపై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం రక్తపు మరకలు ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలి,దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 04-09-2026 సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు తాళ్లగురజాల వై-జంక్షన్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది.
నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ సి.హెచ్. హనూక్ అభినందించి ప్రశంసించారు.

రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు శాఖలో గత 35 సంవత్సరాలుగా హోం గార్డులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుత...
05/09/2026

రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు శాఖలో గత 35 సంవత్సరాలుగా హోం గార్డులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న జె. రామయ్య (హోం గార్డు నంబర్: 256), మంచిర్యాల జిల్లా పరిధిలో,పి. సత్తయ్య (హోం గార్డు నంబర్: 249), గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా పరిధిలో సేవలందించిన సందర్భంగా ఇద్దరికీ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వారికి పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్,ఏఆర్ ఏసీపీ ప్రతాప్,హోం గార్డ్స్ ఆర్‌ఐ పెద్దన్న, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్,ఇన్‌స్పెక్టర్ ఎం.తిరుపతి, ప్రధాన కార్యదర్శి జె. అంజనేయులు, సంయుక్త కార్యదర్శి కె.ఓంకార్, సభ్యులు,హోం గార్డ్స్ ఇన్‌చార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి నేటి విద్యార్థులే.. రేపటి ఐఏఎస్, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులుగంజా...
05/09/2026

ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి నేటి విద్యార్థులే.. రేపటి ఐఏఎస్, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులు
గంజాయి సమాచారం కోసం 1908.. సైబర్ మోసాలకు 1930.. అత్యవసర పరిస్థితుల్లో 112
విద్యార్థులు ఉపాధ్యాయుల మాటకు గౌరవం ఇస్తూ,వారి సూచనలు పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.చెడు వ్యసనాలకు, ముఖ్యంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్‌లోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎన్టీపీసీ టీటీఎస్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకుమార్,సైబర్ నేరాల విభాగం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే తొలి గురువులని,వారి తర్వాత ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని సూచించారు. చదువు,వ్యక్తిగత జీవితం లేదా ఇతర అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పంచుకోవాలని తెలిపారు. సమస్యలను మనసులో దాచుకోకుండా వారితో మాట్లాడితే సరైన మార్గనిర్దేశం లభిస్తుందని అన్నారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908కు తెలియజేయాలని సూచించారు.
సైబర్ నేరాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను తెరవకూడదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు,ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని తెలిపారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు లేదా ఇతర ఆపద సమయాల్లో పోలీసుల సహాయం కోసం 112కు కాల్ చేయాలని విద్యార్థులకు వివరించారు. గతంలో అందుబాటులో ఉన్న 100 నంబర్ స్థానంలో ప్రస్తుతం 112 అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
విద్యార్థుల భద్రత కోసం పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. ఏసీపీలు,సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు పాఠశాలల పరిసరాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ భద్రతా పరిస్థితులను పరిశీలిస్తున్నారని తెలిపారు.అయితే విద్యార్థులే తమ భద్రతకు తొలి రక్షకులని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదువుకోవాలని, భవిష్యత్తులో ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని సీపీ ఆకాంక్షించారు.
వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ భద్రతా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన “వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు” అనే అవగాహన పోస్టర్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ బి.రామ్‌రెడ్డి ఆవిష్కరించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్న రీతిలో వివరిస్తూ ఈ పోస్టర్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, బసంత్‌నగర్ ఎస్‌ఐ శ్రీధర్,రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్‌ఐ వెంకట్,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.జయరాజ్, స్థానిక కార్పొరేటర్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో,ఎస్‌ఐ లక్ష్మణ్,ఎలిగ...
05/09/2026

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో,ఎస్‌ఐ లక్ష్మణ్,ఎలిగేడ్‌ ఎస్‌ఐ మధుకర్ ఆధ్వర్యంలో గంజాయి వినియోగం,అక్రమ రవాణా,సరఫరా, నిల్వపై పోలీసులు నిఘాను మరింత పెంచారు.ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్దపల్లి జోన్‌లోని ఎలిగేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ఎలిగేడ్‌ గ్రామంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం, ఎలిగేడ్‌ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ నిఘా చర్యలు చేపట్టారు.
ఎలిగేడ్‌ గ్రామ కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, తాము గంజాయి సేవించినట్లు వెల్లడించారు.దీంతో తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా ఏడుగురు యువకులను గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించి వైద్య, క్లినికల్‌ పరీక్షలు నిర్వహించారు. గంజాయి సేవించినట్లు నిర్ధారించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం,వారిని డీ-అడిక్షన్‌ సెంటర్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: సీపీ

యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి,ఇతర మాదకద్రవ్యాలపై రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో ఉక్కుపాదంతో వ్యవహరిస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా రవాణా చేయడం,నిల్వ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.
యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.గంజాయి వినియోగం,అక్రమ రవాణా,విక్రయం లేదా నిల్వకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం,రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిష...
04/09/2026

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ టీమ్ సిబ్బంది అక్రమంగా పశువుల తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో..

కౌటాల నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో, మందమర్రి టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ టీమ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పశువులతో వెళ్తున్న 3 మహీంద్రా క్యాంపర్ వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా,వాటిలో 13 ఆవులు,17 దూడలు కలిపి మొత్తం 30 పశువులు ఉన్నట్లు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించి 3 మంది డ్రైవర్లు,4 మంది సహాయకులు కలిపి మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 3 మహీంద్రా క్యాంపర్ వాహనాలు,4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో..
అదేవిధంగా,బెజ్జూర్ గ్రామం నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లగురిజాల గ్రామంలో దాడి నిర్వహించింది.
ఈ సందర్భంగా పశువులతో వెళ్తున్న 2 మహీంద్రా క్యాంపర్ వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా,వాటిలో 20 ఆవులు,7 దూడలు కలిపి మొత్తం 27 పశువులు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి 2 మంది డ్రైవర్లు,2 మంది సహాయకులు కలిపి మొత్తం 4 మందిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 2 మహీంద్రా క్యాంపర్ వాహనాలు,2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి 57 పశువులు,5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు,6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నిందితులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులు, స్వాధీనం చేసుకున్న వాహనాలు,మొబైల్ ఫోన్లు మరియు పశువులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు అప్పగించారు.

గణేష్ ఉత్సవాల్లో మత సామరస్యాన్ని కాపాడాలి శాంతియుత గణేష్ ఉత్సవాలే లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఏసీపీ వెంకటేశ్వ...
04/09/2026

గణేష్ ఉత్సవాల్లో మత సామరస్యాన్ని కాపాడాలి శాంతియుత గణేష్ ఉత్సవాలే లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఏసీపీ వెంకటేశ్వర్లు
ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను మతాలకు అతీతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు.
చెన్నూర్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక మార్వాడి భవన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.
డీజేలు,సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా మత సామరస్యానికి ఎలాంటి భంగం కలగకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని స్వయంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని, పోలీసుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శాంతి యాత్రలో శాంతిభద్రతల పరిరక్షణకు యువత,గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఏసీపీ కోరారు. నిబంధనల ప్రకారం క్రమసంఖ్యను పాటిస్తూ ర్యాలీని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,సీఐ బన్సీలాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు అజీమ్, సంతోష్,కో-ఆప్షన్ సభ్యులు సాధనబోయిన కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, బ్రహ్మయ్య,శాంతి కమిటీ నాయకులు బి.జనార్దన్ రావు, బొల్లంపల్లి లక్ష్మీరాజ గౌడ్, పట్టణంలోని వివిధ కుల సంఘాల నాయకులు,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి పోక్సో కోర్టు మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ...
03/09/2026

పెద్దపల్లి పోక్సో కోర్టు మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది. కేసు వివరాలు
ఎలిగేడు మండలానికి చెందిన ఫిర్యాదుదారు 10-04-2025న ఉదయం సుమారు 9 గంటలకు కూలీ పనికి వెళ్లి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. అంతకుముందు, ఫిర్యాదుదారు కుమార్తె అయిన మైనర్ బాలిక పాఠశాల నుంచి మధ్యాహ్నం సుమారు 1 గంటకు ఇంటికి వచ్చింది.
ఇంట్లో నానమ్మ లేకపోవడంతో, ఫిర్యాదుదారుకు వరుసకు తమ్ముడైన నిందితుడు తీట్ల నవదీప్ ఇంటికి బాలిక ఆడుకోవడానికి వెళ్లింది.ఈ క్రమంలో నిందితుడు బాలికను తన ఇంటిలోని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి,ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
బాలిక అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి వెళ్లి, పనికి వెళ్లి తిరిగి వచ్చిన తన తల్లికి జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో ఫిర్యాదుదారు వెంటనే తన కుమార్తెను తీసుకుని జూలపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అప్పటి ఎస్‌హెచ్‌ఓ చి. సనత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అనంతరం పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి, నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసును పెద్దపల్లి పోక్సో కోర్టు విచారించింది.గౌరవ న్యాయమూర్తి కె. స్వప్నరాణి గారు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, నిందితుడు నేరానికి పాల్పడినట్లు రుజువైన నేపథ్యంలో 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులు

ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ గారు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సమర్థవంతంగా వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి గారు,ఏసీపీ జి.కృష్ణ గారి పర్యవేక్షణలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంలో సహకరించిన పొన్నమనేని రంజిత్ రావు, సుల్తానాబాద్ సీఐ సుల్తానాబాద్, ఎస్‌ఐ ఎల్. మధుకర్ (ఎలిగేడు), కోర్టు కానిస్టేబుల్ పి. శ్రీనివాస్, హెచ్‌సీ-204 సి.ఎం.ఎస్.పి. కోటేశ్వరరావు, హెచ్‌సీ-2465లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు అభినందించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంథని పట్టణ శివారులో గల నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద మొత్తంలో అక్రమంగా గుడుంబా తయారీక...
03/09/2026

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంథని పట్టణ శివారులో గల నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద మొత్తంలో అక్రమంగా గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకాన్ని నిల్వ చేసినట్లు నమ్మదగిన సమాచారం అందడంతో, మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి ఆధ్వర్యంలో మంథని పోలీసులు ఈరోజు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో ప్లాస్టిక్ క్యాన్లు, డ్రమ్ముల్లో నిల్వ చేసిన సుమారు 2,000 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు గుర్తించారు.అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే ఈ పానకం ప్రజలకు అందుబాటులోకి వెళ్లకుండా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకుని, అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుడుంబాను డంప్ చేసిన లేదా అక్రమంగా తయారు చేసి నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. అక్రమంగా గుడుంబా తయారీ, నిల్వ, రవాణా లేదా విక్రయానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
అక్రమంగా తయారు చేసే గుడుంబాను ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. గుడుంబా ఆరోగ్యానికి తీవ్ర హానికరమై,కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు.
మంథని సర్కిల్, పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా తయారీ, నిల్వ లేదా విక్రయానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.
ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్,రమేష్ రావు,కానిస్టేబుళ్లు శివ,అజిత్,సతీష్, అంజి పాల్గొన్నారు.

రామగుండం పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న “సైబర్ జాగ...
02/09/2026

రామగుండం పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న “సైబర్ జాగరూకత దివస్” కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ,సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలియని లింకులపై క్లిక్ చేయకూడదని, ఓటీపీ,ఏటీఎం పిన్, పాస్‌వర్డ్,బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదని విద్యార్థులకు సూచించారు. అనుమానాస్పద కాల్స్,మెసేజ్‌లు, లింకులు మరియు సోషల్ మీడియా ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సైబర్ అవగాహన
రానున్న వినాయక చవితి,గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఆన్‌లైన్ విరాళాల పేరుతో జరిగే మోసాలు, నకిలీ లింకులు,ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సైబర్ అవగాహన పోస్టర్లను ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.ఉత్సవాల సమయంలో ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించని వ్యక్తులు లేదా ఖాతాలకు డబ్బులు పంపవద్దని అధికారులు సూచించారు.ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.అనంతరం ఏసీపీ రంగారెడ్డి డిజిటల్ మోసాలు,పెట్టుబడి మోసాలు,ఆన్‌లైన్ మోసాలు తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
“అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని డీసీపీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ఎ.భాస్కర్, ఐపీఎస్,సీసీపీఎస్ ఏసీపీ రంగారెడ్డి, సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాస్,ఆర్‌ఈ సంపత్,ఎస్‌ఐ మధుసూదన్, సుమారు 300 మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Address

RAMAGUNDAM
Ramagundam
505209

Alerts

Be the first to know and let us send you an email when Ramagundam Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share