Ramagundam Police Commissionerate

Ramagundam Police Commissionerate To maintain public relation which in turn helping a lot in taking proper action against criminal activities in my region and also in taking up many cases.
(1)

గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు748 గ్రాముల గంజాయి స్వాధీనం.. విల...
03/06/2026

గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు

748 గ్రాముల గంజాయి స్వాధీనం.. విలువ సుమారు రూ.37,500/-
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని,వారి వద్ద నుంచి గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్‌టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ పోలీసు సిబ్బందితో కలిసి బీ పవర్ హౌస్ టర్నింగ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,బోరే కిషన్ (26), రామగుండం, లింగంపల్లి శ్రావణ్ కుమార్ (26), ఇందిరమ్మ కాలనీ, ఎన్‌టీపీసీ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు.వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయిని కొనుగోలు చేసి కొంత వినియోగించడంతో పాటు మిగిలిన గంజాయిని ఎన్‌టీపీసీ ప్రాంతంలో కూలీ పనులు చేసే ఇతర రాష్ట్రాల కార్మికులకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు.పంచుల సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద ఉన్న బ్యాగులో 748 గ్రాముల గంజాయి లభ్యమైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.37,500/-గా అంచనా వేశారు. అలాగే నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.గంజాయి అక్రమరవాణాను అడ్డుకుని, చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎన్‌టీపీసీ ఎస్‌ఐ టి.ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బందిని ఏసీపీ గోదావరిఖని ఎం.రమేష్, రామగుండం సీఐ కృష్ణకుమార్‌తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.

మహిళా పోలీస్ స్టేషన్‌తో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి.ప్రజల సహకారంతో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తాం : పోలీస్ కమిష...
03/06/2026

మహిళా పోలీస్ స్టేషన్‌తో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి.
ప్రజల సహకారంతో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

సీసీ కెమెరాల సాంకేతిక వ్యవస్థతో నేర నియంత్రణ మరింత బలోపేతం : ఎమ్మెల్యే విజయ రమణారావు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్,పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో, పెద్దపల్లి పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ విజయ రమణారావు,పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐలు లక్ష్మణరావు, నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
పెద్దపల్లి పట్టణం ప్రస్తుతం నిఘానేత్రాల పర్యవేక్షణలో ఉంది. నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ,భద్రతలో భాగంగా గతంలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలకు అదనంగా నేడు మరో 65 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,* పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు అభినందనలు తెలిపారు.పెద్దపల్లి నియోజకవర్గానికి ఒకేసారి నాలుగు పోలీస్ స్టేషన్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో మహిళలపై జరిగే నేరాలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారంలో మహిళా పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కౌన్సెలింగ్ ద్వారా అనేక కుటుంబాలు తిరిగి కలుస్తుండటంతో కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతోందని తెలిపారు.పోలీస్ స్టేషన్లలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.సీసీ కెమెరాలు నేటి సమాజంలో నేరాల నియంత్రణకు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారాయని సీపీ తెలిపారు.జిల్లా కేంద్రంగా ఉన్న పెద్దపల్లిలో ట్రాఫిక్ సమస్యలు,రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు వంటి సంఘటనలను నివారించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేరస్థుల కదలికలను గుర్తించడంలో కూడా ఈ నిఘా వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.ప్రతి వ్యాపార సంస్థ,దుకాణం,కాలనీ,నివాస ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సీసీ కెమెరాల ఏర్పాటు,సాంకేతిక ప్రమాణాలు, నిర్వహణ తదితర అంశాల్లో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే నిధులతో పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలలో కూడా సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,* సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు,నిర్వహణ విషయంలో పోలీస్ కమిషనర్ చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.గతంలో పట్టణంలో ఏర్పాటు చేసిన అనేక సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కొత్త కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశారని తెలిపారు.ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే సమాచారాన్ని పర్యవేక్షించే విధంగా పోలీస్ స్టేషన్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఆధునిక నిఘా వ్యవస్థను అందుబాటులో ఉంచినందుకు పెద్దపల్లి పోలీసులను అభినందించారు.ఇటీవల ఇతర ప్రాంతాల్లో జరిగిన దోపిడీ ఘటనలను ప్రస్తావిస్తూ,ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ చర్యలు హర్షణీయమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.డీసీపీలు, ఏసీపీలు,సీఐలు, ఎస్‌ఐలు సహా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.పెద్దపల్లి నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తమ అనుభవం,సమర్థ నాయకత్వంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు.క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది నుంచి కమిషనర్ స్థాయి వరకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ కమిషనర్,పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్,ఎస్‌ఐలు లక్ష్మణరావు,నరేష్, ప్రజాప్రతినిధులు, ప్రజలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్‌పీసీఎల్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝ...
03/06/2026

హెచ్‌పీసీఎల్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గురువారం కుందనపల్లి వద్ద ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)ను సందర్శించి,సంస్థలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా భద్రతా చర్యలు,సెక్యూరిటీ వ్యవస్థ,సిబ్బంది విధుల నిర్వహణ,సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు,అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు,మాక్ డ్రిల్స్ నిర్వహణ తదితర అంశాలపై మేనేజర్ మనీష్‌ను అడిగి తెలుసుకున్నారు.సంస్థ పరిధిలో భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పటిష్టంగా అమలు చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.అలాగే సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.సంస్థకు సంబంధించిన వాహనాల డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంగా వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.సంస్థలో ఎదురవుతున్న సమస్యలు, భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పోలీస్ కమిషనర్,పరిశ్రమల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్,పెట్రో కార్ల పాత్ర కీలకం.డయల్-100 కాల్స్‌కు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాల...
03/06/2026

శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్,పెట్రో కార్ల పాత్ర కీలకం.
డయల్-100 కాల్స్‌కు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలి : అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్.
డయల్-100 ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు,సిబ్బంది వేగంగా స్పందించాలని,నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్,పెట్రోకార్ల సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని రామగుండం అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీ కె. శ్రీనివాస్ అన్నారు.
రామగుండం హెడ్‌క్వార్టర్స్‌లో కమిషనరేట్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు,బ్లూ కోల్ట్స్,పెట్రో కార్ల సిబ్బందితో సమావేశం నిర్వహించారు.బ్లూ కోల్ట్స్,పెట్రో కార్ల సిబ్బంది ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల తీరుతెన్నులపై అధికారులు వివరించారు.అలాగే ఫిర్యాదుదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ డయల్-100 కాల్స్‌కు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తూ, నేరస్తుల్లో భయాన్ని కలిగించేలా బ్లూ కోల్ట్స్ సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు.తమ పరిధిలోని ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.బ్లూ కోల్ట్స్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ,ఫిర్యాదులు అందిన వెంటనే నిర్దేశిత సమయంలో గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో డయల్-100 కాల్స్‌పై స్పందించాలని ఆదేశించారు.బ్లూ కోల్ట్స్,పెట్రో కార్ల సిబ్బంది కేవలం పెట్రోలింగ్ విధులకే పరిమితం కాకుండా, పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
అలాగే కేడీలు,రౌడీ షీటర్లను నిరంతరం తనిఖీ చేయాలని, కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తితో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బ్లూ కోల్ట్స్,పెట్రో కార్ల వర్టికల్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్,సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు అనిల్ కుమార్,బాబురావు, బ్లూకోల్ట్స్,పెట్రో కార్ల సిబ్బంది పాల్గొన్నారు.

భూపతిపూర్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు.మహిళల భద్రత, సైబర్ మోసాలు, బాలల రక్షణపై అవగాహన.వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో వెంటన...
03/06/2026

భూపతిపూర్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు.
మహిళల భద్రత, సైబర్ మోసాలు, బాలల రక్షణపై అవగాహన.
వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన.

రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ మహిళల భద్రత, బాలల రక్షణ,సైబర్ నేరాలు,ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళల భద్రత కోసం బస్టాండ్లు,ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో షీ టీమ్ నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని తెలిపారు.ఎవరైనా మహిళలు లేదా విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యను తెలియజేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.ప్రస్తుతం అనేక మంది అత్యాశకు లోనై సైబర్ నేరాలు,ఆన్‌లైన్ మోసాలు,లోన్ యాప్‌ల బారిన పడుతున్నారని పేర్కొంటూ,అలాంటి మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఒకవేళ ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని కోరారు.మహిళలు ఏదైనా ప్రమాదం, బెదిరింపులు లేదా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటే వెంటనే 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఆసియా బేగం,ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మి,షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త్యాగాల ఫలితంఅవినీతి,నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తాం ...
02/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త్యాగాల ఫలితం
అవినీతి,నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. *ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు,కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు*.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనందరికీ గర్వకారణమైన రోజు అని అన్నారు.ఈ రాష్ట్ర సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలు, పోరాటాలు, అంకితభావం ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ,రాష్ట్ర సాధన వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించబడిందని తెలిపారు. వ్యవసాయం,విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు తదితర రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేసిందన్నారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు సామాజిక సామరస్యం, శాంతిభద్రతలు కూడా బలోపేతమయ్యాయని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని,ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి కష్టపడి పనిచేసినప్పుడే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు,అధికారులు, ఉద్యోగులు అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు శాఖ గత మూడు దశాబ్దాలుగా ఎంతో అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతాలుగా భావించిన అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్నదని తెలిపారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పగలు,రాత్రి స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడ్డాయని,ఇది పోలీసు శాఖ నిరంతర కృషి ఫలితమని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని చెప్పారు.ప్రజల భద్రత,సంక్షేమం కోసం 24/7 అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సేవా పతకాలను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేష్,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏవో శ్రీనివాస్,ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, వివిధ విభాగాల అధికారులు, ఎస్‌ఐలు,సిబ్బంది, సీపీఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్అధికారులు, సిబ్బందికి పలు సూ...
01/06/2026

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్
అధికారులు, సిబ్బందికి పలు సూచనలు... అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశం
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా క్షేత్రస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల జిల్లాకు చేరుకుని స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు నివాసంలో స్వల్ప విరామం తీసుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, కీలక కూడళ్లు, భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు. పర్యటన పూర్తయ్యే వరకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని, వాహనాల రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించాలని ఆదేశించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

లాడ్జీలు,రెస్టారెంట్లు, వైన్ షాపులు, బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు.గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసుల ప్...
01/06/2026

లాడ్జీలు,రెస్టారెంట్లు, వైన్ షాపులు, బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు.
గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక డ్రైవ్.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరిఖని-1 టౌన్ పోలీసులు,పోలీస్ యాంటీ నార్కోటిక్స్ వింగ్,నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సంయుక్త ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గోదావరిఖని బస్టాండ్, పాన్ షాపులు, స్మోకింగ్ జోన్లు,వైన్ షాపులు,రెస్టారెంట్లు, లాడ్జీలు,ఐబీ కాలనీ పరిసరాలు,ఆటో స్టాండ్లు,టీ స్టాళ్లు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికుల సామగ్రి, అనుమానాస్పద ప్రాంతాలు,అలాగే ప్రజలు అధికంగా సంచరించే ప్రదేశాలను ప్రత్యేకంగా పరిశీలించారు.ఈ సందర్భంగా గోదావరిఖని-1 టౌన్ ఎస్‌ఐ శ్రీ రమేష్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు ..అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు.రామగుండం పోలీ...
01/06/2026

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు ..అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.మద్యం మత్తులో వీధులు, రహదారులపై అసభ్య పదజాలంతో ప్రవర్తించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని,ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.ఈ నిషేధాజ్ఞలు 01-06-2026 నుండి 01-07-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం,1348 ఫసలీ నిబంధనల ప్రకారం నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*డీజే సౌండ్స్, డ్రోన్లపై నిషేధాజ్ఞల పొడిగింపు*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్‌లలో డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.చిన్నపిల్లలు,వృద్ధులు, రోగులు,విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు భారీ శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు.వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజలను సమీకరించేందుకు డీజే సౌండ్స్ వినియోగిస్తున్నట్లు గమనించామని పేర్కొన్నారు.అయితే, కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.మైక్ సెట్ వినియోగానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నట్లు తెలిపారు.ఈ నిషేధాజ్ఞలు కూడా 01-06-2026 నుండి 01-07-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం,1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో రామగుండం పోలీస్ కమిషనరేట్ యాక్ట్–2016లోని సెక్షన్ 7(1),సెక్షన్ 22(1)(a) నుండి(f), సెక్షన్ 22(2)(a),(b), సెక్షన్ 22(3),సిటీ పోలీస్ యాక్ట్ 1348 నం. IX ఫసలీ,సెక్షన్ 30,పోలీస్ యాక్ట్–1861 ప్రకారం 01-06-2026 ఉదయం 6.00 గంటల నుండి 01-07-2026 ఉదయం 6.00 గంటల వరకు అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఈ కాలంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు,రాస్తారోకోలు,సభలు,సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.బంద్‌ల పేరిట సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, ఒత్తిడి చేయడం లేదా బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది.కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝానేరస్తులకు శిక్ష ...
30/05/2026

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది.
కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి,మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు,లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, నేరస్తులకు శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు.దోషులకు శిక్ష పడే ప్రక్రియలో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. నేరస్తులకు సంబంధించిన వారెంట్లు,సమన్లు సత్వరమే అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలు, సలహాలను పాటించాలని ఆదేశించారు.కోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు,సమన్ల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని సూచించారు.
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే పోలీసులపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారందరికీ తప్పనిసరిగా శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.

టీఎస్‌కాప్ (TSCOP) అప్లికేషన్‌లోని సీసీడీ (CCD) మాడ్యూల్‌కు సంబంధించిన సమన్లు,వారెంట్ల నమోదు,జారీ ప్రక్రియ, సర్వీస్ వివరాల నమోదు,పెండింగ్ వారెంట్ల పర్యవేక్షణ, కోర్టు ప్రక్రియల నిర్వహణ అంశాలపై పోలీస్ సిబ్బందికి శిక్షణ అందించారు.

Address

RAMAGUNDAM
Ramagundam
505209

Alerts

Be the first to know and let us send you an email when Ramagundam Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share