Telugu Desam Party: Razole

Telugu Desam Party: Razole Official Page of TDP Razole

* 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

* 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

* తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

* మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

* కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

* ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW


29/05/2026

అధికారంలో ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన జగన్ .. ప్రజలు ఛీ కొట్టి గద్దె దింపేస్తే అంబేద్కర్ రాజ్యాంగం గుర్తొచ్చింది.

29/05/2026

విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు గారు..

ట్రూ-డౌన్ అమలు అనేది కేవలం కరెంట్ బిల్లులకు సంబంధించిన అంశం కాదు. ఇది మన రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, పరిశ్రమల పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన విషయం. 1947 నుంచి 1995 వరకు రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులుగా పని చేసినప్పటికీ, కేవలం 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగింది.

1995లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి, విద్యుత్ రంగానికి కొత్త బాట వేశారు. కేవలం 10 ఏళ్ల కాలంలోనే మరో 5,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలుచేయడం, పరిశ్రమలు తీసుకురావడం, ప్రాజెక్టులను నిర్మించడం ఎంత ముఖ్యమో... ప్రజల మనోభావాలను గౌరవించడం కూడా పాలకులకు అంతే ముఖ్యం. ప్రధానంగా మతపరమైన విశ్వాసాలను కాపాడటం ప్రభుత్వ ధర్మం. ఎన్టీఆర్ అయినా, చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా ఈ ధర్మానికి కట్టుబడే పనిచేస్తున్నారు.




#నాతెలుగుదేశంనాబాధ్యత

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలుగొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వ...
29/05/2026

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలు

గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది. ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది టీచర్లను అనుమానిస్తోంది.

29/05/2026

సమస్య లేదా సంక్షోభం వచ్చాక తలపట్టుకునే బదులు ముందుగానే జాగ్రత పడటమే దార్శనికత. ప్రధాని మోదీ గారికి , ఏపీ సీఎం చంద్రబాబు గారికి ఆ దార్శనికత ఉంది కాబట్టే ఇంధన పొదుపు చేయమని మోదీ గారు పిలుపును ఇవ్వడం... చంద్రబాబుగారు దాన్ని వెంటనే అందుకుని తన కాన్వాయ్ ని కుదించుకోవడం, మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం జరిగాయి.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న సత్సంబంధాల పై గిట్టని వాళ్ళు అనేకం అనుకోవచ్చు. కానీ ఈ బంధం వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడింది. విశాఖ రైల్వే జోన్ సాకారమైంది. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, AMCA వంటి ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయి. ఐదేళ్ళ విధ్వంసం నుండి వికాసం వైపుకు ఏపీ పయనిస్తోంది.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

పేదలకు పట్టెడన్నం పెట్టడమే రాజకీయం అన్న ఎన్టీఆర్... ఆనాడు పేదల కనీస అవసరాలు తీర్చేలా కృషిచేశారు. చంద్రబాబు గారు పేదలను పేదరికం నుండి బయటపడేసి వారికి మెరుగైన జీవితం ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇక లోకేష్ గారు పేదల పిల్లల మేధాశక్తిని, సామర్థ్యాలను లోకానికి చాటి చెబుతున్నారు. మొత్తంగా మొదటి నుంచీ పేదల సేవలోనే తరిస్తోంది టీడీపీ.





#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

ఐదేళ్ళ జగన్ పాలన చూసాక ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకుంటుందా అనిపించింది. ఆ ఐదేళ్లు జగన్ కూల్చిన వ్యవస్థలు మళ్ళీ నిలిచి ప్రజలకు సేవలందిస్తాయా అనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా రెండేళ్లలోనే విధ్వంసం నుంచి కోలుకుని వికాసం వైపుకు ఏపీ దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబుగారు, మంత్రి లోకేష్ గార్ల పాలనా సామర్థ్యాలకు ఇదే నిదర్శనం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

• తెలుగుజాతి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోమారు కోరతాం.. తెలుగుదేశం ప...
29/05/2026

• తెలుగుజాతి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోమారు కోరతాం.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు
• 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు ఘన నివాళి." జై కార్యకర్త ,జై జై కార్యకర్త" నినాదంతో ముగిసిన పసుపు పండుగ "మహానాడు 2026"
• "మహానాడు 2026" కు వర్చువల్ గా హాజరైన 24.5 లక్షల మంది. 88 మంది నాయకుల ప్రసంగం.వివిధ అంశాలపై 21 తీర్మానాలు.
• ఆడబిడ్డలకు" మహానాడు 2026" అంకితం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని కీలక తీర్మానం
• స్థానిక ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లా ఏకగ్రీవాలు చేసుకోం.. "మహానాడు 2026" లో ఇష్టాగోష్టి గా టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/OE8YI

Address

Razole

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Razole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Razole:

Share