16/09/2024
🔹గణేష్ నిమజ్జనం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశం
🔹నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలి
🔹అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
🔹మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు
🔹మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో ముందస్తూ 30 చోట్ల హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు
🔹రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ కు లక్షలాది గా తరలివస్తున్న గణేష్ భక్తులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
🔹మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో 30 చోట్ల హెల్త్ క్యాంప్ లను, అంబులెన్స్ లతో డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది మెడికల్ కిట్లు ను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. వైద్య పరమైన అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి చేరుకునే వారికి సత్వరం వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.