Sangareddy District Police

Sangareddy District Police Please Follow/Like "Sangareddy District Police" Page to Know What We are Doing for your Protection. official page of sangareddy district police

జిల్లా పోలీస్ కార్యాలయం,            సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన - తేది: 04.06.2026,• హత్నూర పోలీసు స్టేషన్‌ను ఆకస్మి...
04/06/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన - తేది: 04.06.2026,

• హత్నూర పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
• స్టేషన్ ఆవరణ, రికార్డులు, సిబ్బంది బ్యారెక్స్ పరిశీలన.
• ప్రతి రికార్డును ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి.
• సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
• పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: హత్నూర పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారెక్స్ పరిశుభ్రతను పరిశీలించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించగలమని, అందుకు సిబ్బంది ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక (ప్లాన్ ఆఫ్ యాక్షన్) ఉండాలని అన్నారు.
తరచూ వాహనాల తనిఖీలు, నాకాబందీ వంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల వివరాలు ప్రతి సిబ్బందికి తెలుసుకొని ఉండాలని, పగలు-రాత్రి బీట్‌లలో క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఆన్‌లైన్ రికార్డుల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల నేరాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌హెచ్‌ఓ కు సూచించారు.
సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, తమకు కేటాయించిన విధులను పూర్తి భాద్యతగా నిర్వర్తించాలని సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా విని సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పోలీసు శాఖలో శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగతంగా గానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని, సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ తనిఖీలో హత్నూర ఎస్‌హెచ్‌వో శ్రీధర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,          సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 03.06.2026,• "సైబర్ జాగృత్ దివస్" కార్యక్రమంలో ...
03/06/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 03.06.2026,

• "సైబర్ జాగృత్ దివస్" కార్యక్రమంలో భాగంగా చెర్యాల్‌ గ్రామంలోని ఎక్సెల్ ప్లాంట్ యూనిట్-4 ఉద్యోగులు మరియు సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.
• బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, లోన్ యాప్, ప్రకటనల పేర్లతో జరుగుతున్న మోసాల గురించి అవగాహన..
• సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే మార్గం.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సైబర్ నేరాల నుండి ప్రజలకు విముక్తి కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా సైబర్ జాగ్రుకత దివాస్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు.
జూన్ నెల మొదటి బుధ వారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు తేది: 03.06.2026 నాడు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రుకత దివాస్ పేరుతో ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలం, చర్యాల్‌ గ్రామంలోని ఎక్సెల్ ప్లాంట్ యూనిట్-4 ఉద్యోగులు మరియు సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ళు ప్రస్తుతం ఉపయోగిస్తున్న వివిధ రకాల మోసపూరిత పద్ధతుల గురించి వివరించి, సైబర్ నేరాల భారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.
1. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు– అధిక లాభాల పేరుతో పెట్టుబడులు వస్తాయని మోసపూరిత మాటలు చెప్పి మొదట డబ్బులు వస్తున్నట్లు చూపించి, సైబర్ నేరాలకు పాల్పడతారని అన్నారు.
2. అడ్వర్టైజ్‌మెంట్ ఫ్రాడ్ – నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు అందకపోవడం వంటి మోసాలు.
3. ఇంపర్సనేషన్ / కొరియర్ ఫ్రాడ్ – కొరియర్ కంపెనీ ప్రతినిధులమని లేదా ఇతర అధికారులమని చెప్పి మోసం చేసే పద్ధతులు.
4. లోన్ యాప్ ఫ్రాడ్ – అక్రమ రుణ యాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేయడం, వేధించడం.
5. ఓఎల్ఎక్స్ (OLX) ఫ్రాడ్ – వస్తువుల కొనుగోలు, అమ్మకాల పేరుతో జరిగే ఆన్‌లైన్ మోసాలు.

గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు మరియు పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత మరియు బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైనట్లు తెలిసిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవి, ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్, సైబర్ సెల్ సిబ్బంది, ఎక్సెల్ ప్లాంట్ యూనిట్-4 యాజమాన్యం, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,      సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 02.06.2026• ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి (సొసైటీ ఫర్ సంగారెడ్డ...
02/06/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 02.06.2026

• ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి (సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్) ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖకు ఇంటర్‌సెప్టర్ వాహనం..
• వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సి. దామోదర రాజనర్సింహ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం.
• ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా తక్షణ స్పందించడానికి 24×7 అందుబాటులో ఉంటుంది.
• ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద పరిస్థితులను వీడియో రికార్డు చేయగల సామర్థ్యం కలిగి ఉంది : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు (02.06.2026) సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు ఇంటర్‌సెప్టర్ వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు సి. దామోదర రాజనర్సింహ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వాహనం పనితీరును వివరించగా, ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి మేనేజ్‌మెంట్‌ను వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి (సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్) ఆధ్వర్యంలో గౌరవ వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు సి.దామోదర రాజనర్సింహ గారి చేతుల మీదుగా పోలీసు ఇంటర్‌సెప్టర్ వాహనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వాహనం రాత్రి గస్తీ నిర్వహించడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద పరిస్థితులను వీడియో రికార్డు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.

హైవేలపై వాహనాల వేగాన్ని గుర్తించి, ఫోటోలు క్యాప్చర్ చేస్తుందని తద్వారా పరిమిటికి మించిన వేగంతో వెళుతున్న వాహనాలకు ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు 24×7 అందుబాటులో ఉంటుందని, ఈ వాహనంలో ఆయుధ సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా తక్షణ స్పందన అందించే విధంగా ఉంటుందని ఎస్పీ వివరించారు.

సంగారెడ్డి జిల్లా ప్రజలు, పరిశ్రమల భద్రత, ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు ఏర్పాటు చేసిన ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి (సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్) ద్వారా జిల్లాకు విశేష ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో "షీ-షట్లర్" పేరుతో ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా ప్రజల శ్రేయస్సు కోసం జిల్లా పోలీసు శాఖ, ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి ఆధ్వర్యంలో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, ఎస్‌.ఎస్‌.ఎస్‌.సి మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,    సంగారెడ్డి జిల్లా,పత్రికా ప్రకటన, తేది: 02-06-2026.• అమరవీరుల పోరాటం, ఆత్మత్యాగల ఫలితంగా సాధ...
02/06/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా,
పత్రికా ప్రకటన, తేది: 02-06-2026.

• అమరవీరుల పోరాటం, ఆత్మత్యాగల ఫలితంగా సాధించుకున్నదే.. తెలంగాణ రాష్ట్రం..
• సంగారెడ్డి జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు తేది: 02.06.2026 నాడు సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నందు ఉదయం 07:20 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించి 12 వసంతాలు పూర్తి చేసుకొని, నవశకానికి నాంది పలుకతూ 13 వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా మనవంతు కృషి చేయవలసిందిగా సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు ఏర్పడి, యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు మెరుగయ్యాయి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది నా భాద్యత అని ప్రతి ఒక్క పోలీసు అధికారి, యువత భావించాలన్నారు. ఎందరో అమరుల ఆత్మ బలిదానాలు, మహనీయుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం అని, తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉండి, రాష్ట్ర అభివృద్ది, మహనీయుల ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా మనవంతు కృషి చేయవలసిందిగా సూచించారు.

సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ తరపున మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, పొక్సో అత్యాచార కేసుల గురించి జిల్లా ప్రజలను కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు.ఎస్పీ చైతన్య రెడ్డి, డిఎస్పి సత్యయ్య గౌడ్, ఎ.ఆర్. డిఎస్పి నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐ. టి. సెల్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్.ఐ.లు సురేష్, డానియెల్, శ్రీనివాస్ రావ్, డి.పి.ఓ సూపర్డెంట్ మోహనప్ప, అశోక్, మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం,        సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 01.06.2026• తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వే...
01/06/2026

జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 01.06.2026

• తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం.
• పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి.
• పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌, భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకల్లో పోలీసు శాఖ తరఫున నిర్వహించే పరేడ్ ఆకర్షణీయంగా, గౌరవప్రదంగా ఉండేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

కవాతులో పాల్గొనే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణను ప్రతిబింబించే విధంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పరేడ్ కమాండర్ మరియు పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,         సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 01.06. 2026• ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్...
01/06/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 01.06. 2026

• ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం..
• ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ..
• ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్‌.హెచ్‌.ఓలకు సూచనలు..
: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అంశాలపై స్థానిక ఎస్‌.హెచ్‌.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లలో సమస్యలు పరిష్కారం కాకపోయిన పక్షంలో ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే మధ్యవర్తులను నమ్మకుండా తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిరంతరం మానిటరింగ్ చేస్తూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,                         సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 01.06.2026.• సంగారెడ్డి జిల్లా వ...
01/06/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 01.06.2026.

• సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: జిల్లా యస్.పి. పరితోష్ పంకజ్ ఐపియస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి 30 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు.
ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ గారు సూచించారు.

అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం         సంగారెడ్డి జిల్లాపత్రిక ప్రకటన, తేది: 29.05.2026,• స్పార్క్ - (SPARK: Supporting Potenti...
29/05/2026

జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా
పత్రిక ప్రకటన, తేది: 29.05.2026,

• స్పార్క్ - (SPARK: Supporting Potential and Academic Rise for Khaki Kids) కార్యక్రమంలో భాగంగా ఖాకీ కిడ్స్, పోలీసు సిబ్బందికి భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: నిరంతరం శాంతి భద్రతలు, ఇతర రక్షణ విధులలో నిమగ్నమయ్యే సిబ్బంది, వారి కుటుంబాలకు చెందిన పిల్లలు ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, వారికి సరైన మార్గానిర్ధేశం ఇవ్వాలనే సంకల్పంతో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి స్పార్క్ అనే కార్యక్రయాన్ని చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ., పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి విద్యా ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమమే స్పార్క్ అన్నారు. ప్రతి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న “స్పార్క్” కార్యక్రమం ద్వారా పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలు మరియు పోలీసు సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధి సాధించేందుకు విలువైన సూచనలు, సలహాలు అందించడంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా, విధుల విరామ సమయంలో సిబ్బంది చదువుకునేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఖాకీ కిడ్స్‌కు భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, విద్య యొక్క ప్రాముఖ్యత, లక్ష్య సాధన, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ వికాసంపై పలు సూచనలు చేశారు. చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, ప్రతిరోజూ న్యూస్ పేపర్ చదవడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
పోలీసు సిబ్బంది విధులతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, పిల్లల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. అర్హత కలిగిన సిబ్బంది కూడా సమయానుసారంగా చదువుకొని పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పోలీసు సిబ్బంది, ఖాకీ కిడ్స్ మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,              సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 28.05.2026• ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ ...
28/05/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 28.05.2026

• ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు..
• పండుగలను సుఖ:సంతోషాల నడుమ, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి..
• అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
• సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దు – షేర్ చేయవద్దు.
• బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
పరితోష్ పంకజ్ ఐపిఎస్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: గురువారం 28 మే 2026 బక్రీద్ పండుగను పురస్కరించుకొని, జిల్లా వ్యాప్తంగా అన్ని ఈద్గాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వివరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణాలలో హాస్టల్ గడ్డ, నాలసాబ్ గడ్డ, ఇంద్రాకాలనీ, కల్వకుంటా ఈద్గాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అక్కడి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలను సుఖ:సంతోషాల నడుమ, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందని ఎస్పీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739కు సమాచారం అందించాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

Address

Sangareddy
Sangareddy
502001

Alerts

Be the first to know and let us send you an email when Sangareddy District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sangareddy District Police:

Share