08/01/2021
*విద్యా కుసుమానికి అభినందన ఆశీస్సులు*
వరదయ్యపాలెం ఉన్నత పాఠశాలలో చదివిన బీ నందకుమార్ త్రిబుల్ ఐటీ కి ఎంపికయ్యారు.చదువే ప్రాణంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో చదువుతున్న ఈ అబ్బాయి ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అమ్మానాన్నలు లేక అన్న సంరక్షణలో పెరిగి ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు, హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు దీవించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ మత గురువు చాంద్ బాషా,ఫిరోజ్ ఖాన్,ఫరూక్, మొదలగు వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతిభను కనపరచడానికి ధనిక పేద అనే తారతమ్యాలు లేవని,అందుకు నందకుమార్ నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.గతంలో కూడా ఇదే విధంగా మండలం నుంచి విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో స్థానం దక్కించుకోవడానికి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,విద్య ద్వారానే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని తెలిపారు...🙏💐
ఇట్లు
మీ
షేక్.అబ్దుల్
YSRCP ముస్లిం మండలం మైనారిటీ కన్వీనర్
వరదయ్యపాలెం(మ)