09/03/2021
*నిధులిస్తే వినియోగించుకోలేక పోయారు*
*కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రివాల్ ను కలిసిన శ్రీవర్ధన్ రెడ్డి*
తెలంగాణకు అనేక రూపాల్లో 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూడా సద్వినియోగ పర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రివాల్ పేర్కొన్నారు. మంగళవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రివాల్ కు బిజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి తెరాస ప్రభుత్వం విద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని పలు విషయాల్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వున్నా 14 యూనివర్సిటీల్లో గత కొంత కాలంగా విసిలను నియమించలేక పోయిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో 5000 పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటి, ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో విఫలమైందని తెలిపారు. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు కూడా భర్తీ చెయ్యలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలకు విద్యను అందించాలానే విషయాన్ని ఈ ప్రబుత్వం ఎప్పుడో మర్చి పోయిందని విమర్శించారు.
విద్య వ్యవస్థను కార్పొరేట్ స్కూల్స్ కాలేజిల చేతిలో పెట్టడం వాళ్ళ, సామాన్య ప్రజలు విద్యకు దూరం అవుతున్నారని, తెలిపారు. తెలంగాణ మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, కలగానే మిగిలి పోయిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కూడా తెలంగాణకు అనేక రూపాల్లో 1వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకోలేదని మంత్రి పేర్కొన్నట్టు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అలీజపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.