Chakradhar Goud

Chakradhar Goud రైతు దేవో భవ:
(1)

నిశ్శబ్ద దొంగలు!అవినీతికి అడ్డాగా మారిన సిద్దిపేట జిల్లా గ్రంథాలయం!సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థలో జరుగుతున్న అవినీతి ...
27/04/2026

నిశ్శబ్ద దొంగలు!
అవినీతికి అడ్డాగా మారిన సిద్దిపేట జిల్లా గ్రంథాలయం!
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థలో జరుగుతున్న అవినీతి భాగోతంపై గళం ఎత్తుదాం. అక్షర దేవాలయాలుగా ఉండాల్సిన గ్రంథాలయాలు, కొందరు స్వార్థపరుల వల్ల అవినీతి నిలయాలుగా మారుతున్నాయి.
ఏం జరుగుతోంది?
• నకిలీ బిల్లుల దందా: TA, DAల పేరుతో అసత్యపు లెక్కలు చూపి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు.
• బహిర్గతమైన అక్రమాలు: వర్గల్, దౌల్తాబాద్, చిన్నకోడూరు, చేర్యాల్, మద్దూర్ ప్రాంతాల్లో పొంతన లేని బిల్లులు బయటపడినా చర్యలు సున్నా.
• నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు: ఇన్ని ఆధారాలు దొరుకుతున్నా జిల్లా అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు.
⁠"అందిన కాడికి పంచుకుని తింటున్న సిబ్బంది వ్యవహారం సిద్దిపేట జిల్లాకే గొడ్డలి పెట్టు!"
మా డిమాండ్లు:
1. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి.
2. ప్రభుత్వ నిధులను కాజేసిన వారి నుండి రికవరీ చేసి, వారిని విధుల నుండి తొలగించాలి.
3. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గ్రంథాలయాల ప్రతిష్టను కాపాడాలి.
అవినీతిని అంతం చేద్దాం - గ్రంథాలయాలను రక్షించుకుందాం!
ఇట్లు,
నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించే సిద్దిపేట జిల్లా పౌర సమాజం. Kaloji TV Revanth Reddy - The future of Telangana చక్రన్న సేన Qnews.live Chakradhar Goud Kalvakuntla Kavitha Q Group Media Anchor Ramu Telangana Congress Telangana Mallanna Mahipal Yadav Official Theenmar Mallanna Sainyam Team Journalist Raghu

https://youtu.be/sZDC2BGsMzY?si=eCEOzTGPXFXMxNps ఎవరెన్ని గాలి మాటలు మాట్లాడిన, 100 కోట్ల రూపాయల భూమి అక్రమ బదలాయింపు ని...
21/04/2026

https://youtu.be/sZDC2BGsMzY?si=eCEOzTGPXFXMxNps ఎవరెన్ని గాలి మాటలు మాట్లాడిన, 100 కోట్ల రూపాయల భూమి అక్రమ బదలాయింపు నిజం, చివరకు న్యాయస్థానం కూడా అదే తేల్చింది Telangana Congress Mahipal Yadav Official Theenmar Mallanna Sainyam Telangana Mallanna MBR TV Team Journalist Raghu Qnews.live Revanth Reddy - The future of Telangana Kaloji TV Anchor Ramu Kalvakuntla Kavitha Chakradhar Goud చక్రన్న సేన Q Group Media

6 likes. "పొన్నం ఫ్యామిలీ దందాకు హైకోర్ట్ దిమ్మతిరిగే షాక్! | Highcourt Big Shock to Ponnam Over Siddipet Land"

20/04/2026

మ(కంత్రి) పొన్నం కుటుంబానికి షాక్! సిద్దిపేట 100 కోట్ల రూపాయల భూమి అక్రమ బదలాయింపులో, గతంలో సిద్దిపేట కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ను సస్పెండ్ చేసిన తెలంగాణ హై కోర్ట్. పోరాడితే పోయేదేమీ లేదు

https://youtu.be/0WMdpfiE-p8?si=u-xjs_ZuJ6TbvPgR తెలంగాణా జర్నలిస్ట్ KVR పైన ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరియు ఆంధ్ర ప...
19/04/2026

https://youtu.be/0WMdpfiE-p8?si=u-xjs_ZuJ6TbvPgR తెలంగాణా జర్నలిస్ట్ KVR పైన ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరియు ఆంధ్ర పోలీసులు అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్ట్ కు ప్రయత్నం చెయ్యడం సిగ్గు చేటు. ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు ఆపకపోతే తెలంగాణ సమాజం నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకోవలసి వస్తుంది. ఒక్క యూట్యూబ్ ఛానెల్ జర్నలిస్ట్ పైన కక్ష సాధింపు చర్యలను చూసి మీ కూటమి ప్రభుత్వం ఇంతల వనుకుతే, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మిమల్ని చూసి నవ్వుతారు

11 likes, 1 comment. "ఒక్క కేవీఆర్ కే ఉ*చ్చ పోసుకుంటున్నావ్ | Chakradhar Goud Response on KVR Arrest Issue | KalojiTV"

18/04/2026

మరో వెలుగుమట్ల కానున్న సిద్దిపేట. ఈమె చెప్తున్న ప్రకారం అక్కడ కొన్నేళ్లుగా నివాసముంటున్న ప్రజలు ఇళ్లు కాలి చేసి రోడ్డున పడవలసిందేనా. న్యాయం ఉంది కాబట్టే బాధిత కుటుంబానికి అండగా నిలబడిన. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిన తగ్గేదెలే

17/04/2026

సిద్దిపేట లో అధికారం అడ్డం పెట్టుకొని రైతు భూమి స్వాహా చేసిన మంత్రి. ఆగమైపోయిన రైతు కుటుంబం

17/04/2026

రవాణా శాఖలో రూ.600 కోట్ల స్కాం.! :

- కోసినా రూపాయి లేదంటూనే అయినవాళ్ల కోసం అప్పనంగా అడ్డగోలుగా పైసల ఖర్చు..
-ATS( ఫిట్ నెస్ టెస్టింగ్ కేంద్రాల) ముసుగులో రూ.600 కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్..
- అన్న కొడుకు కోసం ఓ మంత్రి గారి తిప్పలు..
- రెండు సార్లు టెండర్ పిలిచాక రద్దు..
-మూడో సారి క్లస్టర్లుగా విభజించి టెండర్లు..
- నిర్మాణానికి ఒక్కో కేంద్రానికి రూ.8 కోట్ల నిర్ధారించి రూ.11.50 కోట్లకు పెంపు..
- బిడ్డింగ్ లో పాల్గొనే కంపెనీల నిబంధనల విషయంలో చిత్రవిచిత్రాలు..
- పొరుగు రాష్ట్రంలో పైసా ఖర్చు లేకుండా సర్కారుకు ఆదాయం..
- తెలంగాణలో మాత్రం.. ఏడాదికి అటీటుగా రూ.35 కోట్లు వచ్చే ఆదాయానికి ..రూ.49 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయిన సర్కారు

హైదరాబాద్ :
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు స్కాములు.. ఇందుగలదందు లేదని సందేహంబు వలదు.. ఎందెందు వెదకి చూచినా అందందు గలదు.. అన్నట్టుగానే ఉంది. తాజాగా రవాణా శాఖలో దాదాపు రూ.600 కోట్ల స్కాంకు సర్కారు తెరలేపింది. వాహనాల ఫిట్ కేంద్రాల ఏర్పాటు వ్యవహారంలో భారీగా దండుకునేందుకు సర్కారు ప్రణాళికలు వేసింది. పొరుగు రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రయివేటు పార్ట్ నర్ షిప్ లో, ప్రయివేటు వాళ్లే నిర్మించి.. ప్రభుత్వానికి కొంత కమిషన్ చెల్లించే విధానంలో.. సర్కారు ఖజనా నుండి రూపాయి బయటకు పోకుండా.. ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం.. ఖజానా నుండి ఉత్తిపుణ్యానికి రూ.600 కోట్లు గాయబ్ చేసేందుకు రూ 900 కోట్లు ఖర్చు చేసేందుకు సర్కారు సిద్ధపడింది.

ఆది నుండి అక్రమ ఆలోచనలే..

వాహనాల ఫిట్ నెస్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 37 కేంద్రాల కోసం ఫిబ్రవరి 2025లో మొదటి సారి టెండర్లు పిలిచారు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.8 కోట్ల ఖర్చుగా పేర్కొన్నారు. శాంక్షన్ కూడా ఇచ్చారు. కొద్ది రోజులకే దాన్ని రద్దు చేశారు. మళ్లీ జులై.. 2025లో మరోసారి టెండర్ పిలిచారు. దాన్ని కూడా రద్దు చేశారు. ఇక తాజాగా ఈ నెల 2వ తేదీన మరో టెండర్ పిలిచారు.
అయితే.. ఇందులో చాలా మార్పులు చేశారు. గతంలో రెండు టెండర్లలో 37 కేంద్రాలకు గాను బిడ్డింగ్ లు ఆహ్వానించారు. కానీ 2 ఏప్రిల్ 2026 నాడు పిలిచిన టెండర్ .. క్లస్టర్లు గా విభజించి టెండర్లు పిలిచారు. అయితే ఇక్కడ 37 కేంద్రాలకు టెండర్లు పిలవకుండా.. 7 కేంద్రాలతో ఒక క్లస్టర్... 8 కేంద్రాలతో మరో క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇందులో మాత్రం.. ఒక్కో కేంద్రం నిర్మాణానికి అయ్యే ఖర్చును రూ.8 కోట్ల నుండి రూ.11.50 కోట్లకు పెంచేశారు. రూ. 8 కోట్ల చొప్పున 37 కేంద్రాలకు రూ.296 కోట్లు అవుతుంది. కానీ.. పెంచిన మొత్తంతో కలుపుకుంటే.. అది రూ.425 కోట్లకు పెరిగిపోయింది. ఇక్కడే ప్రభుత్వ అవినీతి కుట్రలు బయటపడ్డాయి.
ఇవే కాదు.. మెయింటనెన్స్ కోసం ఒక్కో స్టేషన్ కు నెలకు రూ.11 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. 37 స్టేషన్లకు రూ.ఏడాదికి 48.5 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. పదేళ్లకు గాను టెండర్ పిలుస్తున్నారు. అంటే.. ఇదే 490 కోట్ల రూపాయలు అవుతోంది. 37 ఫిట్ నెస్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు అయ్యే రూ. 425 కోట్లు కలిపితే.. మొత్తంగా రూ.900 కోట్ల ఖర్చు చూపి రూ 600 కోట్ల రూపాయల స్కాంకు సర్కారు తెరలేపింది.

స్కాం అనడానికి ఇదే రుజువు..
మరి ఇంత ఖర్చు పెడితే సర్కారుకు వచ్చే ఆదాయం ఎంత.? దాదాపుగా ఏడాదికి 5 లక్షల వాహనాలు టెస్టింగ్ కోసం వస్తే.. రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఒక్కో కేంద్రానికి ఏడాదికి సర్కారు పెడుతున్న ఖర్చు రూ.49 కోట్లు. అంటే అటీటుగా రూ.15 కోట్లు ప్రభుత్వానికే నష్టం. అయినా కూడా ఈ పని చేస్తున్నారంటే.. స్కాం కాకుంటే మరేంటి.? పొరుగు రాష్ట్రాల్లో పైసా ఖర్చు లేకుండా ఆదాయం వస్తోంటే.. మన సర్కారు మాత్రం ఎందుకు రూ.900 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. ?

టెండర్ల ప్రక్రియలో.. నిబంధనల్లోనూ గోల్ మాల్..
8 స్టేషన్లను కలిపి ఏర్పాటు చేసిన క్లస్టర్ కోసం టెండర్ వేసే వాళ్లు 2025లో రూ.50 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉండాలని నిబందనల్లో పేర్కొన్నారు. కానీ.. 7 స్టేషన్లున్న క్లస్టర్ కు మాత్రం కేవలం రూ.9 కోట్లు ఉంటే సరిపోతుందని చెప్పారు. కేవలం ఒక్క స్టేషన్ తగ్గింది. కానీ.. నెట్ వర్త్ విషయంలో భారీ వ్యత్యాసం వచ్చింది. ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. ఈ నెల 17న(శుక్రవారం రోజున) టెండర్ గడువు ముగుస్తోంది. కానీ సడెన్ గా గురువారం రోజున టెండర్ నిబందనల్లో మార్పులు చేశారు. 8 కేంద్రాలున్న క్లస్టర్ కు నెట్ వర్త్ ను రూ.50 కోట్ల నుండి రూ.10 కోట్లకు తగ్గించేశారు. అలాగని.. టెండర్ గడువు కూడా పెంచలేదు. అంటే ఇంత హడావుడిగా.. ఎవరికి తెలియకుండా.. ఎందుకు నెట్ వర్త్ లో మార్పులు చేయాల్సి వచ్చింది.? తప్పుడు ఉద్దేశం లేకపోతే.. టెండర్ గడువు ముగిసే ముందుకు రోజు ఎందుకు ఈ మార్పులు చేస్తారు?

ఖచ్చితంగా ఇందులో తక్కువలో తక్కువ రూ.600 కోట్లు కొల్లగొట్టేందుకు సర్కారు పెద్దలు ప్రణాళికలు రచించారు. ఇందులో ఓ మంత్రి అన్న కొడుకు కీలకంగా చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కోసమే నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చినట్టు స్పష్టమవుతోంది.

ఇందులో నిజంగానే ఎలాంటి స్కాం లేకపోతే ప్రభుత్వం ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

1.పక్క రాష్ట్రాలు BOO(బిల్డ్ ఓన్ ఆపరేట్ )మోడల్ తీసుకుంటే.. ఎందుకు తెలంగాణ సర్కారు CAPEX (క్యాపిటల్ ఎక్స్ పెండిచర్) కాపెక్స్ మోడల్ తీసుకుంది.? కోసినా రూపాయి లేదని చెబుతూ.. పెన్షన్లు ఇవ్వడానికి.. రిటైర్మెంట్ బెన్ ఫిట్ లు ఇవ్వడానికి..ఏ పనికి.. ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవని చెబుతూ.. ఎందుకు వీటిని ప్రభుత్వ సొమ్ముతో కడుతున్నారు.
2. టెండర్లు రెండు సార్లు ఎందుకు రద్దు చేశారు.? మూడో సారి క్లస్టర్లుగా మార్చి ఎందుకు టెండర్ పిలిచారు.?
3.టెండర్లలో పాల్గొనే వారికి ఒక క్లస్టర్ లో రూ.50 కోట్లు.. నెట్ వర్త్ అని పెట్టి.. మరో క్లస్టర్ లో ఎందుకు కేవలం రూ.8.9 కోట్లుగా పెట్టారు.
4. క్లస్టర్ 1లో నెట్ వర్త్ విలువను టెండర్ గడువు ముగిసే ముందు రోజు ఎందుకు రూ.50 కోట్ల నుండి రూ.10 కోట్లకు మార్చారు..? Telangana Congress Telangana Mallanna Mahipal Yadav Official Theenmar Mallanna Sainyam Team Journalist Raghu Kaloji TV MBR TV Revanth Reddy - The future of Telangana Qnews.live చక్రన్న సేన Kalvakuntla Kavitha

Address

Siddipet
502103

Website

Alerts

Be the first to know and let us send you an email when Chakradhar Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chakradhar Goud:

Share

Category