27/04/2026
నిశ్శబ్ద దొంగలు!
అవినీతికి అడ్డాగా మారిన సిద్దిపేట జిల్లా గ్రంథాలయం!
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థలో జరుగుతున్న అవినీతి భాగోతంపై గళం ఎత్తుదాం. అక్షర దేవాలయాలుగా ఉండాల్సిన గ్రంథాలయాలు, కొందరు స్వార్థపరుల వల్ల అవినీతి నిలయాలుగా మారుతున్నాయి.
ఏం జరుగుతోంది?
• నకిలీ బిల్లుల దందా: TA, DAల పేరుతో అసత్యపు లెక్కలు చూపి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు.
• బహిర్గతమైన అక్రమాలు: వర్గల్, దౌల్తాబాద్, చిన్నకోడూరు, చేర్యాల్, మద్దూర్ ప్రాంతాల్లో పొంతన లేని బిల్లులు బయటపడినా చర్యలు సున్నా.
• నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు: ఇన్ని ఆధారాలు దొరుకుతున్నా జిల్లా అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు.
"అందిన కాడికి పంచుకుని తింటున్న సిబ్బంది వ్యవహారం సిద్దిపేట జిల్లాకే గొడ్డలి పెట్టు!"
మా డిమాండ్లు:
1. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి.
2. ప్రభుత్వ నిధులను కాజేసిన వారి నుండి రికవరీ చేసి, వారిని విధుల నుండి తొలగించాలి.
3. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గ్రంథాలయాల ప్రతిష్టను కాపాడాలి.
అవినీతిని అంతం చేద్దాం - గ్రంథాలయాలను రక్షించుకుందాం!
ఇట్లు,
నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించే సిద్దిపేట జిల్లా పౌర సమాజం. Kaloji TV Revanth Reddy - The future of Telangana చక్రన్న సేన Qnews.live Chakradhar Goud Kalvakuntla Kavitha Q Group Media Anchor Ramu Telangana Congress Telangana Mallanna Mahipal Yadav Official Theenmar Mallanna Sainyam Team Journalist Raghu