Rajanna Sircilla District

Rajanna Sircilla District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajanna Sircilla District, Government Organization, Integrated District Offices Complex , Ragudu Chowrasta, Sircilla.

సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడిన ఎమ్మెల్యే, కలెక్టర్ఐడీఓసీలో జిమ్ ను పరిశీలించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ--...
26/09/2025

సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడిన ఎమ్మెల్యే, కలెక్టర్

ఐడీఓసీలో జిమ్ ను పరిశీలించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

------------------------------------
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ - 26
------------------------------------

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన జిమ్ ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శుక్రవారం పరిశీలించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీవైఎస్ఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా బతుకమ్మ సంబురాలుప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాఆడిపాడిన మహిళా అధికారులు, సిబ్బంది------------------------...
26/09/2025

వైభవంగా బతుకమ్మ సంబురాలు

ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఆడిపాడిన మహిళా అధికారులు, సిబ్బంది

-------------------------------------
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ - 26
-------------------------------------
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ సంబురాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ప్రారంభించగా, బతుకమ్మ పాటలకు మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కలెక్టర్ తెలియజేశారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీవై ఎస్ఓ రాందాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, లత, భారతి, రవీందర్ రెడ్డి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఐడీఓసీలో జిమ్ ప్రారంభించిన కలెక్టర్------------------------------------రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ - 26----------------...
26/09/2025

ఐడీఓసీలో జిమ్ ప్రారంభించిన కలెక్టర్

------------------------------------
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ - 26
------------------------------------

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జిమ్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ప్రారంభించారు.

ఐడీఓసీలోని మొదటి అంతస్తులో జిమ్ ను ఏర్పాటు చేయగా, కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం పలువురు ఉద్యోగులతో సరదాగా టేబుల్ టెన్నిస్ ను కలెక్టర్ ఆడారు. అన్ని జిమ్ పరికరాలను పరిశీలించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్,
డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంలబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాఎల్లారెడ్డిపేట మండ...
26/09/2025

ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం

లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్

----------------------------------
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ -26
----------------------------------

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు నాలుగు విడతల్లో ఆర్థిక సహాయం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోనేటి రాజవ్వ, శ్రీరామోజు భాగ్యలక్ష్మి, సిరిసిల్ల మంజుల, గోషిక తార, దోమల లత, రాచర్ల గుండారం గ్రామంలో బోయిని మణెవ్వ, గరిగే శ్రీలత, సిద్దాల అఖిలకు చెందిన ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ దశకు చేరుకోగా, కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు.

"మీ బ్యాంక్ ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమ అయ్యాయి అని" వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా *కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ,* ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 4 దశల్లో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు,ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారందరూ త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.

సీసీ రోడ్డు వేయాలి

ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం - రాచర్ల తిమ్మాపూర్ దారిలో రహదారి కొంతమేరకు తాత్కాలికంగా దెబ్బతినడంతో సీసీ రోడ్డు మంజూరు చేయాలని ఎంపీడీఓ సత్తయ్యను కలెక్టర్ ఆదేశించారు.

కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ సుజాత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తుది దశ పనులు పూర్తి చేయాలితరగతి గదులను వినియోగంలోకి తీసుకురావాలికలెక్టర్ సందీప్ కుమార్ ఝాఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర...
26/09/2025

తుది దశ పనులు పూర్తి చేయాలి

తరగతి గదులను వినియోగంలోకి తీసుకురావాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
------------------------------------
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ - 26
------------------------------------

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తుది దశ పనులను పూర్తి చేయాలని, తరగతి గదులను వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంకా మిగిలి ఉన్న వైరింగ్, పెయింటింగ్, ఇతర పనులను ఈ సెలవులు ముగిసేలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంజూరు చేసిన బోర్ ను కలెక్టర్ పరిశీలించారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకంఅన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలిపోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలికలెక్టర్ సందీప్ కుమార్...
26/09/2025

ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకం

అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి

పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్డిపేట కళాశాలలో పీటీఎంకు హాజరైన కలెక్టర్

-------------------------------------
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ -26
-------------------------------------
ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రతి విద్యార్థి పదో తరగతి ముగిసిన తర్వాత ఇంటర్మీడియట్ దశ కీలకమని స్పష్టం చేశారు. ఇంటర్ నుంచే ప్రతి సబ్జెక్టు పరిధి పెరుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ తాము ఎంచుకున్న గ్రూప్ లకు సంబంధించి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కళాశాల లోని లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం డాక్టర్, ఇంజనీర్ కాకుండా లాయర్, ఆర్కిటెక్, టీచర్, బిజినెస్ మ్యాన్ ఇతర రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రతి విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ భవిష్యత్తు కోసం శ్రద్ధగా చదువుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంట్లో చదివించాలని తెలిపారు. తల్లిదండ్రుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో జూనియర్ కళాశాలలు మరింత బలపడి పూర్వవైభవం వస్తుందని తెలిపారు.

కళాశాలలో గదులు ఇతర సమస్యలను తాను పరిష్కరి స్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రతిరోజు కళాశాలలో జరిగే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్ధగా విని రాసుకొని వాటిని నిరంతరం సాధన చేయాలని తెలిపారు. అధ్యాపకులు అందరూ ఎప్పటికప్పుడు ముగుస్తున్న పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలని ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరూ ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని కలెక్టర్ సూచించగా, కళాశాలలో శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ , విద్యార్థులకు ఆర్టీసీ బస్ స్టాప్ సౌకర్యం, తదితర సమస్యలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

తరగతి గదుల్లో అవసరమైన డెస్క్ లను వెంటనే సమకూరుస్తామని, ఆన్ అకాడమీ కోసం అవసరమైన డిజిటల్ బోర్డులు త్వరలోనే వస్తాయని, శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని, త్వరలోనే నిర్మాణం చేపడుతామని కలెక్టర్ తెలిపారు.

కళాశాలలో మైదానం, ఆవరణను కలెక్టర్ పరిశీలించారు. గడ్డి, పిచ్చిమొక్కలు శుభ్రం చేయించాలని ఎంపీడీఓ సత్తయ్యను ఆదేశించారు.

కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, తహసిల్దార్ సుజాత, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలునివాళులర్పించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా-------------------------------------రాజన్న సిరి...
26/09/2025

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నివాళులర్పించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

-------------------------------------
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 26
-------------------------------------

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేపట్టగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల అధికారులు, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారుజిల్లాలో మొత్తం 48 దుకాణాలుగౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపుకలెక్టర్ సందీప్ కు...
25/09/2025

మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు

జిల్లాలో మొత్తం 48 దుకాణాలు

గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

----------------------------
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -25
----------------------------

జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో డ్రా ను గురువారం కలెక్టర్ చేపట్టారు.

జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీ లకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని కలెక్టర్ వెల్లడించారు. రౌండ్ల వారిగా డ్రాను తీశారు.

ఎస్సీలకు డ్రా పద్ధతిలో వచ్చిన దుకాణాల నంబర్లు

14, 28, 34, 40, 43

గౌడ్లకు డ్రా పద్ధతిలో వచ్చిన 9 దుకాణాల నంబర్లు

02,15,17,18, 33,36,38,46,48

రేపటి నుంచి..
ఈ నెల 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరించనున్నారు. అప్లికేషన్లు ఇచ్చేందుకు ఆఖరి గడువు వచ్చే నెల(అక్టోబర్) 18వ తేదీ కాగా, వచ్చే నెల 23వ తేదీన దుకాణాల లైసెన్స్ కేటాయించేందుకు డ్రా తీయనున్నారు. డిసెంబర్ 01 వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.

కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలికలెక్టర్  సందీప్ కుమార్ ఝాచందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో స్వస్థ్ నారి, సాశక్త్...
25/09/2025

ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ పరిశీలన
-------------------------------------
చందుర్తి, సెప్టెంబర్ -25
-------------------------------------
స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ కింద జిల్లాలోని ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

ఈ నెల 17 వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు కొనసాగనున్న *స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్*లో భాగంగా చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో గురువారం మహిళలకు వైద్య శిబిరం నిర్వహించగా, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళలకు వివిధ పరీక్షలు వైద్యులు, సిబ్బంది చేస్తుండగా ఆరా తీశారు.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రతి రోజూ ప్రత్యేక వైద్య నిపుణులు ఆసుపత్రుల్లో అన్ని ఆరోగ్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత డయాబెటిస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు సలహాలు అందించాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబము అనే కార్యక్రమం కింద ప్రత్యేక వైద్య నిపుణులతో కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు, రక్తపోటు, డయాబెటిస్, దంత పరీక్షలు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, టీబీ పరీక్షలు చేస్తారని, సికిల్ సెల్ ఎనీమియా, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు వంట నూనెలను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడం, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం గురించి మహిళలకు అవగాహన కల్పిస్తారని వివరించారు.

రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి కావలసిన మందులు, పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని ఆదేశించారు. మహిళలు శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

శిబిరంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణాల పరిశీలన

వేములవాడ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఆ విద్యాలయంలో టాయిలెట్స్ నిర్మిస్తుండగా, కలెక్టర్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలిరాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలికలెక్టర్ సందీప్ కుమార్ ఝ...
25/09/2025

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

చందుర్తి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
-------------------------------------
చందుర్తి, సెప్టెంబర్ - 25
-------------------------------------
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు ఇచ్చారు.

చందుర్తి మండల కేంద్రం, కట్టలింగంపేట గ్రామాల్లో తుది దశకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ గురువారం పరిశీలించారు.

చందుర్తి మండల కేంద్రంలో పోలిశెట్టి లక్ష్మీ, కట్టలింగంపేటలో పల్లికొండ మౌనిక, మారుపాక నర్సవ్వ, కొంక సృజన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటుండగా వారితో కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులుదీపావళి లోగా ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోవాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూ ఆన్ లైన్ లో నమోదు చేయాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ తరఫు నుంచి ఆర్థిక సహాయం సకాలంలో అందేలా అధికారులు చూడాలని, పెండింగ్ ఉండకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఇసుక తీసుకెళ్ళెందుకు కూలీ, రవాణా చార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని, జిల్లాలో ఎక్కడైనా 1500 కంటే ఎక్కువ ట్రాక్టర్ ఇసుక సరఫరా కోసం వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక కోసం ఇబ్బందులు ఎదురైతే సంబంధిత తహసీల్దార్లను సంప్రదించాలని, లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

పర్యటనలో పిడి హౌసింగ్ శంకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి క...
22/09/2025

రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు.

రాష్ట్రంలో పెండింగ్ ఉన్న నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్డు అంశాలపై చర్చ.

రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టండిఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలిఅభివృద్ధి పనులకు ప్రతిపాదనలు...
20/09/2025

రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టండి

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇల్లంతకుంట మండలంలో పలు రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

-------------------------------------
ఇల్లంతకుంట, సెప్టెంబర్ - 20
-------------------------------------
ఇల్లంతకుంట మండలంలోని పలు రోడ్ల నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను శనివారం ఆదేశించారు.

ముందుగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి మండలంలోని వంతడుపులకు చేరుకొని గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పురోగతిని పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకొని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

అనంతరం వంతడుపుల నుంచి నారెడ్డిపల్లి రోడ్డును ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ద్విచక్ర వాహనంపై వెళ్లి ..

తాళ్లపల్లిలో రోడ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే, కలెక్టర్ ద్విచక్ర వాహనాలపై వెళ్లారు.

తాళ్లపల్లి నుంచి ముస్కాన్ పేటకు వెళ్లే మట్టి రోడ్డును పరిశీలించారు. కాల్వ పై ఉన్న సీసీ నిర్మాణం ఇటీవల వర్షాలకు దెబ్బతినగా, దానిని పరిశీలించి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. తాళ్లపల్లి నుంచి బేగంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

*ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి*

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటించగా, పలువురు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామంలోని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆదేశించారు.

ఈ పర్యటన లో ఈఈ సుదర్శన్ రెడ్డి, పీడీ హౌసింగ్ శంకర్, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Address

Integrated District Offices Complex , Ragudu Chowrasta
Sircilla
505301

Alerts

Be the first to know and let us send you an email when Rajanna Sircilla District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share