05/06/2026
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, దోమల నివారణ మరియు పరిశుభ్రమైన పరిసరాల కల్పన లక్ష్యంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమాన్ని నేడు మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ఇంటింటికి వెళ్లి నీటి నిల్వలు ఉన్న పాత్రలు, కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మరియు ఇతర వస్తువులలో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల పెరుగుదలను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు వ్యాపించకుండా ప్రతి శుక్రవారం కనీసం 10 నిమిషాల పాటు ఇంటి పరిసరాలను పరిశీలించి నీటి నిల్వలను తొలగించాలని సూచించారు.
అలాగే పరిశుభ్రత పాటించడం, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం, తడి మరియు పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పారిశుధ్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.