03/09/2026
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
గణేష్ ఉత్సవ అనుమతులు ఆన్లైన్లో ఉచితం
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
మండపాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనసరి - జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి.
శ్రీకాకుళం, సెప్టెంబర్ 3: జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా 'సింగిల్ విండో' విధానంలో రూపాయి కూడా రుసుము చెల్లించకుండా ఉచితంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోగానే అధికారులే నేరుగా వచ్చి పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ,జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు తగినంత ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనుమతుల విధానంపై శుక్రవారం డివిజన్, ఆ మరుసటి రోజు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణహిత మండపాలను ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో కమిటీ సభ్యులు ప్రజలను చైతన్యవంతలను చేయాలని కోరారు. అన్నదానాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని లేకుండా చూడాలని,బీఐఎస్ లేదా ఐఎస్ఐ ప్రమాణాలున్న విద్యుత్ పరికరాలనే మండపాలలో వాడాలని, భారీ విగ్రహాలకు సంబంధించి మండపాల వద్ద ఇంజినీరింగ్ అధికారుల నుంచి నిర్మాణ దృఢత్వ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని తేల్చిచెప్పారు.నిమజ్జన ప్రాంతాల్లో తాగునీరు, వెలుతురు, పారిశుధ్యం, క్రేన్లు అందుబాటులో ఉంచాలని, ఈతగాళ్ల వివరాలను ముందే నమోదు చేసుకుని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ 'గణేష్ ఉత్సవ్ 2026' పోర్టల్ ( https://ganeshutsav.net)ద్వారా దరఖాస్తు చేసుకుంటే స్థానిక సంస్థలు, ఇతర శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఊరేగింపుల్లో అధిక శబ్ద తీవ్రత కలిగిన డీజేలు వినియోగించరాదని కోరారు, మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదకరమైన ప్రవాహం ఉన్న నదులు, కాలువల్లో నిమజ్జనానికి అనుమతి లేదని, తహసిల్దార్లు, పోలీసులు ముందే గుర్తించిన సురక్షిత ప్రాంతాలు, తాత్కాలిక నిమజ్జన గుండాల వద్దనే నిమజ్జనాలు చేయాలని కలెక్టర్, ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద, కాశీబుగ్గ డీఎస్పీ భవాని, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు, ఆన్లైన్ ద్వారా పలాస టెక్కలి ఆర్డీవోలు కృష్ణమూర్తి అప్పలరాజు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సింతు సుధాకర్, భాస్కరరావు, డాక్టర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police