30/08/2026
బంటుపల్లిలో ఘనంగా “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమం 🇮🇳
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో యువ నాయకుడు, బీఎల్ఏ–1 Teja Nadukuditi ఆధ్వర్యంలో నిర్వహించిన “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి బంటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాను.
గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం నా ప్రధాన లక్ష్యం. బంటుపల్లి గ్రామంలో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
అనంతరం నిర్వహించిన “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమంలో జిల్లా నాయకులు, నాలుగు మండలాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, NER యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజలతో నేరుగా మమేకమై, ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే “నమస్తే ఎచ్చెర్ల” కార్యక్రమం లక్ష్యం.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో, ప్రజల ఆశీస్సులతో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తాను.
ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి...
ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి...
ఎచ్చెర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి... 🇮🇳