30/05/2026
రణస్థలం మండలం జీరుపాలెం సముద్ర తీరంలో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "మెరైన్ ఫిష్ సీడ్ లాంచింగ్" కార్యక్రమంలో పాల్గొని సముద్రపు చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం సముద్ర జీవవైవిధ్య పరిరక్షణతో పాటు మత్స్య సంపద పెంపుదలకు దోహదపడుతుంది. మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం, భవిష్యత్ తరాలకు సమృద్ధిగా చేపల వనరులు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా మత్స్యకార సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ, వేట విరామ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం, సంక్షేమ కార్యక్రమాలు వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించాను.
అలాగే రాబోయే కాలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారుల జీవనోపాధికి మరింత భరోసా కల్పించడంతో పాటు వలసలను నివారించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశాను. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం గతంలోనూ, భవిష్యత్తులోనూ నా వంతు కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చాను.
మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక పురోగతే మా ప్రభుత్వ లక్ష్యం.