Telugu Desam Party: Srisailam

Telugu Desam Party: Srisailam Official Page of TDP Srisailam

31/08/2026

అరకు కాఫీకి నేనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అరకు కాఫీ గురించే చెబుతున్నా. గతంలో ఈ ప్రాంతాలలో తీవ్రవాద సమస్యల వల్ల సరైన అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీరు, ఇళ్లు, రోడ్ల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించి పెద్ద మార్పు తీసుకువచ్చాం. మీలో ఇంకా చైతన్యం పెరిగి జీవితాల్లో మంచి పురోగతి సాధించాలి.



31/08/2026

మెగా డీఎస్సీ–2025పై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాం. మా శ్రమ, కష్టంపై నిందలు వేసి అవమానించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. మమ్మల్ని మానసికంగా వేధిస్తూ వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలకు వ్యతిరేకంగా.. విశాఖ వేదికగా ఉమ్మడి నాలుగు జిల్లాల మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల గళం వినిపించాం.




31/08/2026

మేము డబ్బులిచ్చి వచ్చామని చెబుతున్నారు. అవును ఇచ్చాం 750 రూపాయలు. అది కూడా జగన్ వల్లే 250 రూపాయలు ఎక్కువ ఇచ్చాం. డీఎస్సీ నోటిఫికేషన్ ఫీజు రూ.250లు అధికంగా పెంచి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాపై వస్తోన్న అసత్య ఆరోపణలను కొండా రెడ్డి బురజుకి వేలాడదీశాం. అయినా వైసీపీ నాయకుల తీరు మారలేదు. విజయవాడలో సమాధి చేసి చివరగా నేడు ఈ అసత్య ఘోషను బంగాళాఖాతంలో కలిపేయడానికి ఇక్కడికి వచ్చాం.




31/08/2026

30 ఏళ్ల కల సాకారం.. కరువు నేలకు కృష్ణమ్మ పరవళ్లు!
చంద్రబాబు గారి అపర భగీరథ ప్రయత్నం.. స్వప్నం సాకారం
వెలిగొండ సొరంగం నుంచి బయటకు వస్తున్న కృష్ణా జలాల తొలి దృశ్యాలు.


31/08/2026

మధురవాడ మారికవలసలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'గా మార్చడం జరిగింది. ఇందులో 600 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటారు. ఐతే ఇప్పటికే అక్కడ చదువుతున్న 445 మంది పాఠశాల విద్యార్థుల్లో 411 మంది ఇతర పాఠశాలల్లో చేరారు. కేవలం 34 మంది విద్యార్థులు మాత్రమే చేరలేదు. ఆ 34 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రెచ్చగొట్టి కొందరు ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల పేరిట ధర్నాలు, రాస్తారోకోలు చేయడం బాధాకరం. సీఎం చంద్రబాబు గారు గిరిజన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ఏర్పాటు చేసారు. దీనిపై రాజకీయం చేయడం తగదు. గిరిజనులంతా ఆలోచించాలి.


31/08/2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకేజీ కింద రూ.12,76,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.


31/08/2026

ఏళ్ల కష్టం.. ఎన్నో నిరీక్షణలు.. చివరకు సాధించిన ఉపాధ్యాయ ఉద్యోగం. తమ ప్రతిభను అవమానించే ఆరోపణలకు విశాఖ వేదికగా మెగా డీఎస్సీ టీచర్లు గట్టిగా సమాధానం చెప్పారు. ఆత్మగౌరవంతో కదం తొక్కారు.




31/08/2026





జగన్.. దమ్ముంటే మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ గారు విసిరిన సవాల్ ను స్వీకరించు. అంతేగానీ కష్టపడి మెరిట్ లో ఉద్యోగాలు సాధించిన మాపై దుష్ప్రచారం చేయడం మానుకో. స్పోర్ట్స్ కోటా గురించి అసలు మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందడం అంత సులువు కాదు; ఎన్నో కఠినమైన పరీక్షలు, నిరూపణలు దాటి సాధించుకున్నాం.

31/08/2026

అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట. హారిజాంటల్ రిజర్వేషన్ల జీవో తీసుకొచ్చిందే వైసీపీ హయాంలో. 2023, ఆగస్టు 2న జీవో జారీ చేసారు. ఆ జీవో ప్రకారమే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 నియామకాలు చేపట్టింది. ఆ జీవో ప్రకారమే మేము ఉద్యోగాలు పొందాం. అధికారంలో ఉంటే ఒకలా.. లేదంటే మరోలా మాట్లాడడం సబబు కాదు జగన్ గారు.




31/08/2026

1996లో వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిన చంద్రబాబు గారు.. నేడు 2026లో పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు!

చరిత్రను వక్రీకరించి, అసత్య ప్రచారాలతో వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్‌ను కొట్టేయాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

వాస్తవం ఒక్కటే.. సంకల్పం చంద్రబాబుది, సాకారం చేసింది చంద్రబాబు గారే — డా. గొట్టిపాటి లక్ష్మీ


Address

Srisailam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Srisailam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Srisailam:

Shortcuts

Share