02/07/2026
*నాడు అల్లూరి సీతారామరాజు... నేడు ఇందుకూరి రఘురాజు!*
*గల్లీ టు ఢిల్లీ... రైతుల కోసం ఆయన తొక్కని గుమ్మం లేదు.. తిరగని ఆఫీసు లేదు!*
*జిందాల్ పై 600 రైతు కుటుంబాల చారిత్రాత్మక విజయం... ఘనంగా బైక్ ల పై విజయోత్సవ ర్యాలీ*
*రైతుల మొహాల్లో ఆనందమే నా 375 రోజుల కష్టానికి దక్కిన నిజమైన బహుమతి: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు*
375 రోజులు... 600 మంది రైతు కుటుంబాల ఆవేదన... వారికి అండగా నిలిచిన ఒకే ఒక్కడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు గారు. బలమైన కార్పొరేట్ సంస్థ, వారికి దన్నుగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధుల వలయాన్ని ఛేదించి, ఒంటరి పోరాటంతో రైతులకు ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించిన మేరునగ ధీరుడు ఆయన.
గ్రామ స్థాయి అధికారి మొదలుకొని దేశ స్థాయి అత్యున్నత అధికారుల వరకు ఆయన ఎక్కని గడప లేదు, తొక్కని మెట్టు లేదు. అధికారులకు వినతిపత్రాలు ఇస్తూనే, క్షేత్రస్థాయిలో శాంతియుత ధర్నాలు నిర్వహించారు.
ఒకవైపు ప్రజా క్షేత్రంలో ఉంటూనే, మరోవైపు కోర్టులు, జాతీయ స్థాయి కమిషన్ల చుట్టూ తిరుగుతూ నిరంతరం కాగితాలతో కుస్తీ పట్టారు.
రైతుల పక్షాన న్యాయం గెలవాలని, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలకుండా విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీల చుట్టూ నిద్రాహారాలు మాని అవిశ్రామంగా తిరిగారు. పోరాటంలో అన్నీ తానై ముందుండి నడిపించారు.
బలమైన కార్పొరేట్ శక్తులను ఎదిరించి, "ఒక మనిషికి ఇవన్నీ ఎలా సాధ్యం? ఎలా తిరుగుతున్నారు?" అని తోటి నాయకులు ఆశ్చర్యంతో ప్రశ్నించగా, రఘురాజు గారి నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట— "రైతులపై నాకున్న బాధ్యత". 'బాధ్యత' అనేది పలికేవారికి చాలా చిన్న పదమే కావచ్చు... కానీ, దాన్ని ఆచరణలో పెట్టి నెరవేర్చే ఆయన లాంటి నాయకులు ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం.
ఈ సుదీర్ఘ పోరాటంలో రైతులు సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రతీకగా ఈరోజు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ జిందాల్ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గారు తమ సతీమణితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతుల మొహాల్లో ఆనందమే ఆయన 375 రోజుల కష్టానికి దక్కిన నిజమైన బహుమతి గా ఆయన తెలిపారు.