16/10/2025
గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, మద్దూర్ పోలీసులు.
*నిందితుల వివరాలు*
1 పండ్ల ప్రణయ్ కుమార్ తండ్రి మల్లయ్య, వయస్సు 21 సంవత్సరాలు, నివాసం అమ్మాపూర్, మండలం నర్మెట, జనగామ జిల్లా.
2 గడ్డం పువణ్ తండ్రి చంద్రయ్య వయస్సు 25 సంవత్సరాలు, నివాసం వడ్లకొండ, మండలం జనగామ.
3 మహమ్మద్ సోహెల్ తండ్రి అజిజ్, వయస్సు 20 సంవత్సరాలు, నివాసం వల్లంపట్ల, మండలం మద్దూర్.
*నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు*
*👉123 గ్రాముల గంజాయి స్వాధీనం*
*👉2 మొబైల్ ఫోన్*
*👉1 మోటార్ సైకిల్*
*చేర్యాల సిఐ శ్రీను కేసు వివరాలు తెలియపరుస్తూ*
పై నిందితులు మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరంగూడా గ్రామ శివారులో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నారనే సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, సిబ్బంది కలిసి వెళ్లి పై ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేసి నిందితుని వద్ద పై వస్తువులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది.
*ఈ సందర్భంగా చేర్యాల సీఐ శ్రీను మాట్లాడుతూ*
గ్రామాలలో మరియు హోటళ్లల్లో కళ్ళు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లుగానే కలిగి ఉన్నారని సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదంటే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు, లేదా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447, లకు
సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళుతున్నారు వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న మరియు విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు, మద్దూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్. శ్రీను
చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్