మన దేశ ప్రజల అభివృద్ధిని నిరంతరం ఆకాంక్షిస్తూ.. మన దేశ సాంస్కృతిక వైభవాన్ని మరియు సమగ్రతని పెంపొందించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ భారతీయ జనతా పార్టీ. 1980 లో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. క్రమక్రమంగా భా.జ.పా ఒక జాతీయ పార్టీగా రూపు సంతరించుకుంది. సంఘ్ పరివార్ అనే సాంఘిక సంస్థల కూటమిలో భా.జ.పా ఒక అవిభక్త భాగము. భారతీయ జనతా పార్టీ యొక్క మూలాలు భారతీయ జన సంఘ్ లో కనుగొనవచ్చు. భారతీయ జన
సంఘ్ ని భారతీయ జనతా పార్టీ కి స్ఫూర్తిగా పేర్కొంటారు. ఈ భారతీయ జన సంఘ్ 1952లో నెలకొల్పబడింది. అదే సంవత్సరం లో జరిగిన భారతదేశపు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 3 పార్లమెంట్ స్థానాలు గెల్చుకుని వచ్చే 24 సం॥లు ఒక రాజకీయ పార్టీగా తన ఉనికిని చాటుకుంది. 1977 లో భారతీయ జన సంఘ్ "జనతా పార్టీ" లో విలీనం అయ్యి హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ కూటమి నుండి 1979లో జనతా పార్టీ తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న మీదట భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది.
గౌరవనీయులైన పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి మార్గనిర్దేశకత్వం లో దార్శనిక మేధావి డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు పార్టీ ని నెలకొల్పారు. ఈ ఇద్దరి ఉద్దండుల అండదండలతో పార్టీ ఒక బలీయమైన రాజకీయ శక్తి గా ఎదిగింది.
భారతదేశం యొక్క మూలస్తంభాలు అయిన ఆరు విశిష్ట దిశా దశలను పరిరక్షించడానికి కంకణం కట్టుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ఐక్యత, జాతీయ సమగ్రత, అంతర్గత విశిష్టత, సామజిక బలం, వ్యక్తిగత నైతిక విలువలు మరియు సాంస్కృతిక ప్రత్యేకత : ఇవీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దిశా నిర్దేశకాలు.
అనేకానేకమైన అసాంఘిక కార్యకలాపాలకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడ్డ దేశం భారతదేశం. అలాంటి అవాంచిత శక్తులని ఎదుర్కుంటూనే ఒకప్రక్క దేశ సంస్కృతి, జాతీయ సమగ్రత ని కాపాడుకోవడం కేవలం భారత దేశానికే చెల్లింది. చత్రపతి శివాజీ యొక్క దేశభక్తి, కాకతీయుల ఘనచరిత్ర, మహారాణా ప్రతాప్ యొక్క వీరోచితత్వం, మొదలగు అంశాలు మన దేశ ఘన చరిత్రకి నిలువుటద్దాలు.
ఆ ప్రాచీన మహాపురుషుల కర్మఫలాన్ని స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వంటి ఆధునిక కాల మేధావులు ముందుకి తీసుకువెళ్ళారు. లోకమాన్య తిలక్, మహాత్మా గాంధి మరియు శ్రీ ఆరోబిందో వంటి చరిత్ర గర్వించదగ్గ మహానుభావులు మనదేశానికి బానిస బ్రతుకుల నుండి విముక్తి కల్పించారు.
అందరికి సమన్యాయం అనే సూత్రాన్ని బలంగా నమ్మి అదే ఆచరణ లో పెట్టి దేశాన్ని ముందుకు నడిపించడానికి డా. కె బి హెగ్డేవార్ గారు 1925 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ని స్థాపించారు. ఎం. ఎస్. గోల్వాల్కర్ గారు 1940 వరకు సంఘ్ ని బలోపేతం చేయడం లో కీలక పాత్ర పోషించారు.