Tirupati Police

Tirupati Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirupati Police, Government Organization, sp office , old sv high school, near town club, opp manasa restaurant, nxt to grt jewellery, Tirupati.
(1977)

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.తేదీ: 04-06-2026.- విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం – స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల ప్ర...
04/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 04-06-2026.

- విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం – స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి.

- గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

- పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలి.

- పోలీస్ శాఖతో సమన్వయంగా విద్యార్థుల భద్రతకు కృషి చేయాలని పిలుపు.

- విద్యార్థుల భద్రతకు పాఠశాల యాజమాన్యాల సహకారం అవసరం.

తిరుపతి జిల్లా : ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నియమాల అమలు మరియు పాఠశాల రవాణా వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వై కన్వెన్షన్ హాల్‌లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు వాహన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

స్కూల్ బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉండాలి
ఈ సందర్భంగా రేణిగుంట సీఐ జయచంద్ర మాట్లాడుతూ, విద్యార్థులను రవాణా చేసే ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌తో పాటు సంబంధిత అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. బస్సులను ఎల్లప్పుడూ సురక్షితమైన స్థితిలో నిర్వహించడంతో పాటు డ్రైవర్లు, అటెండెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు ఉన్న వ్యక్తులను డ్రైవర్లుగా నియమించరాదని హెచ్చరించారు.

గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి
పిల్లలపై జరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పిల్లలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా యాజమాన్యాలు పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించి, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసులకు తెలియజేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులతో నిరంతర సమీక్ష సమావేశాలు నిర్వహించాలి
ప్రతి 15 రోజులకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల ప్రవర్తన, విద్యా పురోగతి మరియు భద్రత అంశాలపై చర్చించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖ మధ్య సమన్వయం ఉంటే విద్యార్థులకు సురక్షితమైన మరియు క్రమశిక్షణతో కూడిన వాతావరణం కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు.

మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
పాఠశాలల పరిసర ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాలు లేదా ఇతర వ్యాపార సంస్థల్లో విద్యార్థులకు మత్తు పదార్థాలు, హానికర వస్తువులు అందుబాటులో లేకుండా యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ మరియు ఉత్తమ భవిష్యత్తు కోసం పాఠశాల యాజమాన్యాలన్నీ పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని సీఐ జయచంద్ర పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని కోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, వాహన నిర్వాహకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ- జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన "పల్లె నిద్ర" కార్యక్రమాల్లో ప్రజల సమస్యలపై అవగాహన, పరిష్కార చర...
03/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ

- జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన "పల్లె నిద్ర" కార్యక్రమాల్లో ప్రజల సమస్యలపై అవగాహన, పరిష్కార చర్యలు.

- సైబర్ నేరాలు, డ్రగ్స్, మహిళలు మరియు చిన్నారులపై నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన.

- రోడ్డు భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత అంశాలపై ప్రజలకు సూచనలు.

- గ్రామస్థులతో ప్రత్యక్షంగా మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకున్న పోలీసు అధికారులు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు "పల్లె నిద్ర" కార్యక్రమాలను నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందించారు.

అలాగే ప్రజల్లో నేరాల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో సైబర్ నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం, బాల్య వివాహాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, మహిళా రక్షణకు అందుబాటులో ఉన్న అత్యవసర సేవలు, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. అదేవిధంగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ లావాదేవీలు, నకిలీ లింకులు, ఫోన్ కాల్స్, పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టు వంటి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలల విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి అవగాహన కల్పించారు.

అదేవిధంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, "పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావడం, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించడం 'పల్లె నిద్ర' కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రజలు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు లేదా డైల్ 112 కి సమాచారం అందించి సహకరించాలి" అని తెలిపారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల సహకారం పోలీసులకు ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.తేదీ : 03-06-2026.- కువైట్లో చిక్కుకున్న బాధిత మహిళను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సురక్షితంగా స్...
03/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేదీ : 03-06-2026.

- కువైట్లో చిక్కుకున్న బాధిత మహిళను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సురక్షితంగా స్వదేశానికి రప్పించిన జిల్లా యంత్రాంగం.

- సోషియల్ మీడియా ద్వారా బాదిత మహిళ చేసిన విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ యస్. వేంకటేశ్వర్, ఐ.ఏ.యస్ మరియు జిల్లా యస్పీ శ్రీ యల్. సుబ్బరాయుడు ఐ. పి. యస్ గార్లు.

- తిరుపతి జిల్లా అదనపు యస్పీ అడ్మిషన్ శ్రీ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు.

- కువైట్ కి పంపిన ఏజెంట్ ని వెంటనే గుర్తించి, ఎప్పటికీ అప్పుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని బాధిత మహిళను సురక్షితంగా రప్పించిన యంత్రాంగం.

- రాష్ట్ర ప్రభుత్వానికి మరియు జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బాధిత మహిళ.

- విదేశాలకు వెళ్లే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని మహిళలకు సూచన.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన భాగ్యవతి అనే మహిళ ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏజెంట్ చెప్పిన ఉద్యోగం కాకుండా ఇతర పనులు చేయించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రావాలని కోరుతూ సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె వీడియోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, రాష్ట్ర విద్యా, ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో జిల్లా యంత్రాంగం అత్యంత వేగంగా చర్యలు చేపట్టింది.

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ వెంకటేశ్వర్ ఐఏఎస్., గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో అదనపు ఎస్పీ శ్రీ వెంకట్రావు (పరిపాలన) వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారుల సమన్వయంతో బాధితురాలి కుటుంబ సభ్యులను, సంబంధిత ఏజెంట్ను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడంతో భాగ్యవతి సురక్షితంగా భారతదేశానికి చేరుకొని స్వగ్రామానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా బాధితురాలు భాగ్యవతి ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారిని మర్యాదపూర్వకంగా కలిసి తనను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అలాగే తనకు అండగా నిలిచిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా భాగ్యవతి మాట్లాడుతూ, నన్ను సురక్షితంగా భారతదేశానికి రప్పించి నా కుటుంబ సభ్యులతో కలిపిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, నాకు సహకరించిన అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలుపుకున్నారు.

అలాగే విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారు ఏజెంట్ల మాటలు మాత్రమే నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,గారు సూచనలు చేస్తూ, విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, సంస్థల ద్వారానే వెళ్లాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సూచించారు. ఉద్యోగం, జీతభత్యాలు, పని పరిస్థితులు, వీసా నిబంధనలు, యజమాని వివరాలు తదితర అంశాలను పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఏజెంట్ల మాటలు మాత్రమే నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

విదేశాలకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేయడంతో పాటు సంబంధిత పత్రాల ప్రతులను భద్రపరచుకోవాలని సూచించారు. విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులను లేదా కుటుంబ సభ్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మోసపూరిత ఏజెంట్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.తేదీ: 03-06-2026తిరుమల..- పోగొట్టుకున్న విలువైన బ్యాగును యజమానికి క్షేమంగా అప్పగించిన తిరుమల ట...
03/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 03-06-2026
తిరుమల..

- పోగొట్టుకున్న విలువైన బ్యాగును యజమానికి క్షేమంగా అప్పగించిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు.

- బ్యాగులో సుమారు రూ.4.50 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు గుర్తింపు.

- కుటుంబ సభ్యులను గుర్తించి వెంటనే సంప్రదించిన ట్రాఫిక్ సిబ్బంది.

- పోలీసుల నిజాయితీ, సేవాభావానికి బాధిత కుటుంబ సభ్యుల ప్రశంసలు.

- తిరుమల ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ నిజాయితీ, సేవాభావాన్ని చాటుకున్నారు.

తిరుపతి జిల్లా : కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన శ్రీ సునీల్ కుమార్ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుమలకు విచ్చేశారు. దర్శనానికి వెళ్తున్న క్రమంలో పీఏసీ–3 సమీపంలో తమ బ్యాగును అనుకోకుండా మరిచిపోయారు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న తిరుమల ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ జి.వి. రావు గారు ఆ బ్యాగును గుర్తించి పరిశీలించగా, అందులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు సుమారు 30 గ్రాముల బరువు గల, సుమారు రూ.4,50,000 విలువైన బంగారు తాళిబొట్టు ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే బ్యాగులో లభించిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించి సంప్రదించిన ట్రాఫిక్ పోలీసులు, బ్యాగును సురక్షితంగా వారికి అప్పగించారు. తమ విలువైన వస్తువులు తిరిగి లభించినందుకు శ్రీ సునీల్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ జి.వి. రావు గారికి, అలాగే తిరుమల ట్రాఫిక్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, "ప్రజల ఆస్తులను భద్రంగా కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ జి.వి. రావు గారు చూపిన నిజాయితీ, విధి నిర్వహణ పట్ల అంకితభావం అభినందనీయం. ఇలాంటి సంఘటనలు పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ కోసం తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నాను" అని తెలిపారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.02.06.2026.పోలీస్ ప్రకటన- సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మరియు మల్లం...
02/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
02.06.2026.
పోలీస్ ప్రకటన

- సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మరియు మల్లం రవిచంద్ర రెడ్డి ఇచ్చిన వినతి పత్రం మేరకు శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిదిలో గల జూ పార్క్ కు పోయే దారిలో టిఫిన్ సెంటర్లు/టీ బంకులు తిరిగి పునఃస్థాపించాలని, తేది 03.06.2026 న, ఉదయం 9 గంటలకు అలిపిరి నుండి జూ పార్క్ వరకు షాప్ YSR Congress Party నాయకులు మరియు కార్యకర్తలు నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారని పోలీసు వారికి విశ్వసనీయంగా తెలియవచ్చింది. దీనివల్ల తిరుపతి పట్టణములో శాంతి భద్రతలకు విఘాతం కలిగి, తిరుమలకు వెళ్ళే యాత్రికులకు మరియు సాదారణ ప్రజలకు అసౌకర్యము కలిగే అవకాశము ఉన్నది.

- శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా శాంతికి భంగం వాటిల్లకుండా తిరుపతి జిల్లాలోని అన్ని పోలీసు సబ్-డివిజన్ల పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ (Section 30 Police Act) ఇప్పటికే అమలులో ఉంది.

- కావున,వైస్సార్సీపి పార్టీ వారు తలపెట్టిన పై కార్యక్రమాలకు ఎటువంటి పోలీస్ అనుమతి లేదు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించినట్లేతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేయడమైనది.

- చంద్రగిరి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, ఇంచార్జి ఆఫ్ తిరుపతి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.తేదీ: 02.06.2026.“మీ భద్రత – మా బాధ్యత”- ఒబులవారిపల్లి మండలం, Y.Kota  గ్రామం నందు మహిళల భద్రతప...
02/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 02.06.2026.

“మీ భద్రత – మా బాధ్యత”

- ఒబులవారిపల్లి మండలం, Y.Kota గ్రామం నందు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ.

- సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్, కుటుంబ సమస్యలపై అవగాహన.

- అత్యవసర సేవల నెంబర్లు, శక్తి యాప్పై పోలీసుల సూచనలు.

- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, “మీ భద్రత – మా బాధ్యత” అనే థీమ్తో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం ఈ రోజు ఒబులవారి పల్లి మండలం, Y.Kota గ్రామం నందు నిర్వహించడం జరిగింది.

- ఈ కార్యక్రమాన్ని ఒబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వారు మండల అధికారులతో కలిసి సమన్వయంతో నిర్వహించగా, Y.Kota గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు సుమారు 250 మంది పాల్గొన్నారు.

- ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు రూరల్ సీఐ, ఒబులవారిపల్లి ఎంపీడీఓ, ఒబులవారిపల్లి ఎస్ఐ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు మరియు వెలుగు అధికారులు హాజరయ్యారు.

- అవగాహన కార్యక్రమంలో భాగంగా మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలు, అలాగే పెరుగుతున్న కుటుంబ వివాదాలు, దాంపత్య సమస్యల కారణంగా కుటుంబ విభజన వంటి అంశాలపై అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. కుటుంబ విలువలను కాపాడుకోవడం, గృహ సమస్యలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం, పిల్లలకు మంచి అలవాట్లు మరియు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని సూచించారు.

- అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం వెంటనే డయల్ 112 కు కాల్ చేయాలని మహిళలకు సూచించారు. అలాగే శక్తి యాప్ వినియోగం, దాని ద్వారా అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.తేదీ: 02-06-2026.పత్రికా ప్రకటన.- మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును కాపాడుకోండి- గంజాయి నిర్మ...
02/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 02-06-2026.
పత్రికా ప్రకటన.

- మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును కాపాడుకోండి

- గంజాయి నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ.

- జిల్లా వ్యాప్తంగా "మెగా గంజాయి టెస్టింగ్" కార్యక్రమాల నిర్వహణ.

- గంజాయి వినియోగదారులను గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా మార్పుకు చర్యలు.

- యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్న పోలీసులు.

- "డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా" లక్ష్యంతో నిరంతర చర్యలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతోంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం, సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని ప్రతి సబ్ డివిజన్‌లో సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో "మెగా గంజాయి టెస్టింగ్" కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అనుమానిత ప్రాంతాలు, పరిశ్రమలు, కార్మికుల సమూహాలు మరియు ఇతర గుర్తించిన ప్రదేశాలలో గంజాయి పరీక్షలు నిర్వహిస్తూ, మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులకు కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ వారిని సన్మార్గంలోకి తీసుకురావడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో, డీఎస్పీ గారి పర్యవేక్షణలో, తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కజారియా ఫ్యాక్టరీ మరియు వి-ఫార్మ్ పరిశ్రమల కార్మికులకు మెగా గంజాయి టెస్టింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది సమక్షంలో కార్మికులకు పరీక్షలు నిర్వహించారు.

మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు, యువత, విద్యాసంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు మరియు తల్లిదండ్రులు పోలీస్ శాఖకు సహకరించాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., విజ్ఞప్తి చేశారు. "మత్తుకు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజ శాంతి భద్రతలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలి. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉంది. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ప్రీ నెంబర్లు 1972 (ఈగల్) లేదా 112 పోలీసులకు తెలియజేసి ప్రజలు సహకరించాలి. ప్రజల భాగస్వామ్యంతోనే 'డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా' లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలమని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.తేదీ: 01-06-2026.తిరుమల.- తిరుమలలో మహిళ హ్యాండ్బ్యాగ్ దొంగతనం కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన ...
01/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 01-06-2026.
తిరుమల.

- తిరుమలలో మహిళ హ్యాండ్బ్యాగ్ దొంగతనం కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు.

- ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.

- దొంగిలించిన హ్యాండ్బ్యాగ్, నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం.

- వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్న కమాండ్ కంట్రోల్, పోలీస్ సిబ్బంది.

- అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., గారు.

- తిరుపతి జిల్లా : తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళకు చెందిన హ్యాండ్బ్యాగ్ను అపహరించిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

- ఈ రోజు తేదీ 01-06-2026 ఉదయం తిరుమలలోని లేపాక్షి సర్కిల్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఓ మహిళ తన హ్యాండ్బ్యాగ్ను పక్కన ఉంచిన సమయంలో, అక్కడే సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెతో మాటలు కలిపి దృష్టి మరల్చి, హ్యాండ్బ్యాగ్ను అపహరించారు. ఈ ఘటనను గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసుల కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సంప్రదించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కమాండ్ కంట్రోల్ సిబ్బంది మరియు పెట్రోలింగ్ పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టి, నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి దొంగిలించిన హ్యాండ్బ్యాగ్, రూ.5,000 నగదు మరియు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.

- పోలీసుల విచారణలో నిందితులను ఆనందన్ రమేష్ (42), వెల్లూరు జిల్లా, తమిళనాడు. అరుణ్ కుమార్ విజయన్ అలియాస్ అరుణ్ (30), తిరుచ్చి జిల్లా, తమిళనాడు. గోపు అఖిల్ (31), పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ గా గుర్తించారు.

- నిందితుల వద్ద నుండి ఒక నలుపు రంగు లేడీస్ హ్యాండ్బ్యాగ్, రూ.5,000 నగదు మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.

- ఈ మేరకు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారి నేర చరిత్రను పరిశీలించి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. విచారణలో మొదటి నిందితుడు ఆనందన్ రమేష్ గతంలో కూడా తిరుమల ప్రాంతంలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడి పలు కేసుల్లో అరెస్టై శిక్ష అనుభవించినట్లు వెల్లడైంది.

- ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ రద్దీ ప్రదేశాలలో భక్తులు, ప్రజలు తమ విలువైన వస్తువులు, హ్యాండ్బ్యాగులు, నగదు మరియు మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీసులకు లేదా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు.

- భక్తురాలి ఫిర్యాదుపై వెంటనే స్పందించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు దొంగిలించిన సొత్తును రికవరీ చేసిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది మరియు పెట్రోలింగ్ పోలీసులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ- శ్రీ సిటీలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహణ.- "మీ భద్రత మా బాధ్యత" నినాదంతో మహిళలకు ప్రత్...
01/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ

- శ్రీ సిటీలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహణ.

- "మీ భద్రత మా బాధ్యత" నినాదంతో మహిళలకు ప్రత్యేక అవగాహన.

- శక్తి యాప్, డయల్- 112, 1930, 181 సేవలపై వివరాలు.

- సైబర్ నేరాలు, మహిళల హక్కులు, బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై చైతన్యం.

- మహిళల భద్రత, సాధికారత మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, ఈరోజు శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని “టీఐఎల్ ఇండియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ, శ్రీసిటీ, చెరివి గ్రామం, సత్యవేడు మండలంలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది. మహిళల రక్షణ, భద్రత మరియు సాధికారతను లక్ష్యంగా చేసుకుని “మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీ సిటీ డీస్పీ శ్రీ బి.వి. శ్రీనివాసులు గారు, శ్రీ సిటీ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి ఎం. ప్రియాంక గారు హాజరై, కంపెనీ యాజమాన్యం సహకారంతో మహిళా ఉద్యోగులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీ బి.వి. శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, మహిళల హక్కులు, రోడ్డు భద్రత మరియు కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.
మహిళలు తమకు ఎటువంటి వేధింపులు, అన్యాయాలు లేదా అసౌకర్య పరిస్థితులు ఎదురైన వెంటనే పోలీసులను లేదా సంబంధిత సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించాలని సూచించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సాధికారత సమాజ అభ్యున్నతికి పునాది అని పేర్కొన్నారు.

అనంతరం శ్రీ సిటీ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి ఎం. ప్రియాంక గారు మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలు, వ్యక్తిగత భద్రత, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే మహిళలు మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడం, స్వీయ రక్షణపై అవగాహన కలిగి ఉండడం, హింస లేదా వేధింపుల విషయంలో మౌనంగా ఉండకుండా ధైర్యంగా స్వరం వినిపించడం, కుటుంబంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి అంశాలపై చైతన్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు డ్రగ్స్ మరియు గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్, డయల్-112, సైబర్ హెల్ప్‌లైన్ 1930, మహిళా హెల్ప్‌లైన్ 181 సేవల వినియోగంపై కూడా సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో టీఐఎల్ ఇండియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం, మహిళా ఉద్యోగులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ- పి.జి.ఆర్‌.ఎస్ (Public Grievance Redressal System) కార్యక్రమం నిర్వహణ.- జిల్లా వ్యాప్తంగా అంద...
01/06/2026

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ

- పి.జి.ఆర్‌.ఎస్ (Public Grievance Redressal System) కార్యక్రమం నిర్వహణ.

- జిల్లా వ్యాప్తంగా అందిన 63 పిటిషన్ల స్వీకరణ.

- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదని జిల్లా ఎస్పీ స్పష్టం.

- ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశాలు.

- బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని వెల్లడి.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పి.జి.ఆర్‌.ఎస్ (Public Grievance Redressal System) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదును ఓర్పుతో విని, సమస్యల స్వభావాన్ని అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఫిర్యాదుదారులకు సమస్యల పరిష్కార ప్రక్రియను వివరించి, వారికి భరోసా కల్పించారు.

అందిన ప్రతి పిటిషన్‌ను సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, వాటిని ప్రాధాన్యత ఆధారంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేదా నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రజలకు సత్వర న్యాయం అందించడం, వారి సమస్యలకు పారదర్శకంగా పరిష్కారం చూపడం పి.జి.ఆర్‌.ఎస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు ఇచ్చిన ప్రతి ఫిర్యాదును సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ రావి మనోహరచారి గారు (శాంతిభద్రతలు), శ్రీ శ్రీనివాసులు గారు (క్రైమ్స్), ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.

Address

Sp Office , Old Sv High School, Near Town Club, Opp Manasa Restaurant, Nxt To Grt Jewellery
Tirupati
517502

Alerts

Be the first to know and let us send you an email when Tirupati Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tirupati Police:

Share