13/03/2026
ఎన్టీఆర్ జిల్లా..
తిరువూరు టౌన్..
పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2026 ఉగాది కానుకగా 'అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్ 3.0’ పథకాల కింద ప్రభుత్వం మూడో విడత ఆర్థిక సాయంను విడుదల చేయటంతో కూటమి నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు..
ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున జమ చేయనున్నారు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.2,676 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది..
ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,874 కోట్లు ఉండటం విశేషం..
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3.0 పథకాల కింద రైతులకు రెండు విడతలుగా రూ.14,000 అందించారు. .
ఈరోజు జమ చేయనున్న రూ.6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి ఇచ్చే రూ.20,000 ఆర్థిక సాయం పూర్తవుతుంది..
రైతుల ఆర్థిక భారం తగ్గించి వారికి మరింత మద్దతు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది..
'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆర్థిక మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రైతాంగానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆర్థిక మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మహిళలు రైతులు పాల్గొన్నారు..