TUNI VOICE

TUNI VOICE Social media

చెస్ విజేతలకు ఘనంగా బహుమతులువిద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తిని పెంచే సాధనం చెస్: ఎం. లక్ష్మీకుమారితుని: 80 వ స్వాతంత...
11/08/2026

చెస్ విజేతలకు ఘనంగా బహుమతులు

విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తిని పెంచే సాధనం చెస్: ఎం. లక్ష్మీకుమారి

తుని: 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ఎడ్యుకేటెడ్ ఫోరం – తుని ఆధ్వర్యంలో జూలై 31న తుని శాంతినగర్‌లోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన పాఠశాల స్థాయి చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మంగళవారం స్థానిక రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. లక్ష్మీకుమారి విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెస్ విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, మేధోపరమైన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.

ఫోరం కన్వీనర్ టి. శేషగిరి మాస్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, మేధోపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని విద్యా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు, కాకినాడ పోర్ట్ రిటైర్డ్ అధికారి జి. గాంధీ, జి. రాము తదితరులు పాల్గొన్నారు.
G. Ram Perumallu

తునిలో  ఉత్సాహంగా సాగిన పాఠశాల స్థాయి చెస్ పోటీలు…… స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  పీపుల్స్ ఎడ్యుకేటెడ్ ఫోరం  ...
31/07/2026

తునిలో ఉత్సాహంగా సాగిన పాఠశాల స్థాయి చెస్ పోటీలు……
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ఎడ్యుకేటెడ్ ఫోరం తుని ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జిల్లా గ్రంథాలయం ఆవరణలో నిర్వహించిన చెస్ పోటీలు ఉత్సాహంగా సాగాయి…..🤝

విద్యార్థులందరికీ హృదయపూర్వక ఆహ్వానం!రండి… ఆడండి… గెలవండి… మీ ప్రతిభను నిరూపించండి! ♟️🏅
26/07/2026

విద్యార్థులందరికీ హృదయపూర్వక ఆహ్వానం!
రండి… ఆడండి… గెలవండి… మీ ప్రతిభను నిరూపించండి! ♟️🏅

⬆️👌🤝
21/07/2026

⬆️👌🤝

పాఠశాలల్లో రక్షిత నీరు కరువు – మూలకు చేరిన ఆరో ప్లాంట్లువిద్యార్థులకు స్వచ్ఛమైన, రక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో లక...
16/07/2026

పాఠశాలల్లో రక్షిత నీరు కరువు – మూలకు చేరిన ఆరో ప్లాంట్లు

విద్యార్థులకు స్వచ్ఛమైన, రక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆరో (RO) ప్లాంట్లు అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పనికిరాక మూలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నచిన్న మరమ్మతులు చేయకపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు రక్షిత తాగునీటికి దూరమవుతున్నారు.

తుని మండలంలో పరిస్థితి ఆందోళనకరం

తుని మండలం, పట్టణ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 89 పాఠశాలల్లో సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

గత ప్రభుత్వం 57 పాఠశాలలకు 65 ఆరో ప్లాంట్లు మంజూరు చేయగా, ప్రస్తుతం వాటిలో 33 ప్లాంట్లు పనికిరాక మూలకు చేరాయి. కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారాయి.

ఈ విద్యా సంవత్సరానికి ముందు ప్రాథమిక పాఠశాలలకు పంపిణీ చేసిన మినీ ఆరో ప్లాంట్లు కూడా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. ఇదే పరిస్థితి కోటనందూరు, తొండంగి మండలాల్లో కూడా కనిపిస్తోంది.

చిన్నపాటి మరమ్మతులు, క్రమమైన నిర్వహణ చేపడితే ఈ ప్లాంట్లు తిరిగి పనిచేసి విద్యార్థులకు సురక్షితమైన తాగునీటిని అందించగలవు.

అధికారులకు విజ్ఞప్తి

పాఠశాలల్లో పనికిరాక ఉన్న ఆరో ప్లాంట్లను వెంటనే మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రతి విద్యార్థికి రక్షిత మంచినీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీ సర్వసతీ విద్యా సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ తుని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు, పేద ప్రజలకు ప...
13/07/2026

శ్రీ సర్వసతీ విద్యా సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ తుని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు, పేద ప్రజలకు ప్రేమతో అన్నప్రసాదం అందిస్తున్న శివరామకృష్ణ గారికి మరియు ఈ మహోన్నత సేవలో భాగస్వాములైన ప్రతి దాతకు నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.

ఆకలితో ఉన్న ప్రతి మనిషికి ఒక పూట భోజనం అందించడం కంటే గొప్ప దానం మరొకటి లేదు.

మనమందరం ఈ మహత్తర సేవకు అండగా నిలుద్దాం…

మనకు చేతనైనంత సహాయం చేసి, మరింత మంది ఆకలిని తీర్చే ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములమవుదాం.

“ఆకలితో ఉన్న ప్రతి మనిషికి ఒక పూట భోజనం అందిద్దాం…
అన్నదానం ద్వారా మానవత్వాన్ని చాటుదాం.”

అన్నదానం మహాదానం — మానవసేవే మాధవసేవ.

07/07/2026

తుని ప్రధాన కూడలి గొల్ల అప్పారావు సెంటర్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి

తుని పట్టణంలోని ప్రధాన కూడలి గొల్ల అప్పారావు సెంటర్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బస్సుల కోసం వేచి ఉండే సమయంలో ఎండ, వర్షాల నుంచి రక్షణ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులతో ప్రయాణించే కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు దివ్యాంగులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుని పట్టణానికి వచ్చే, వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రాంతం ప్రధాన రవాణా కూడలిగా ఉండటంతో బస్ షెల్టర్ అవసరం అత్యంత కీలకంగా మారింది.

అందువల్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వేచి ఉండే ప్రదేశంగా అన్ని వసతులతో కూడిన ఆధునిక బస్ షెల్టర్‌ను తక్షణమే నిర్మించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

– ప్రజా సంఘాలు, తుని

తుని లో  పీపుల్స్ ఎడ్యుకేటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన చిత్రలేఖన పోటీల్లో అద్భుతం వేసిన చిన్నారి….
04/07/2026

తుని లో పీపుల్స్ ఎడ్యుకేటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన చిత్రలేఖన పోటీల్లో
అద్భుతం వేసిన చిన్నారి….

03/07/2026

తమ సృజనాత్మకతతో అద్భుత చిత్రాలు గీసి అందరినీ ఆకట్టుకున్నారు.
వారి ప్రతిభకు అభినందనలు 💐Peoples educated forum, Tuni

Address

Tuni
533401

Telephone

+917893741611

Website

Alerts

Be the first to know and let us send you an email when TUNI VOICE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category