31/10/2025
తిరుపతి
31-10-2025
*వెంకటగిరి రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు వినతిపత్రం అందించిన నేదురుమల్లి*
పాలనా సౌలభ్యంతోపాటు భౌగోళిక, సాంస్కృతిక అనుబంధం ప్రాతిపదికగా తీసుకొని వెంకటగిరి అర్బన్, రూరల్ , డక్కిలి, బాలాయపల్లి మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ...
* విద్య, వైద్య మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు వెనుకబడి ఉన్న వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను జిల్లా కలెక్టర్ కు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
* వెంకటగిరి ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రెవిన్యూ డివిజన్ ఏర్పాటు అంశం ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్సిపి నిర్వర్తించినట్లు తెలియజేశారు.