Andhra BJP Supporters

Andhra BJP Supporters భారతీయులకోసం .. భారతదేశ సౌభాగ్యం కోసం భారతీయ జనతా పార్టీ

భారత యుద్ధము జరిగిన పిమ్మట మన దేశములో జరిగిన చరిత్ర మనకు మన వారు అన్నీ చక్కగా పాలకుల వివరాలతో సహా అందించారు.  అవన్నీ కావ...
13/04/2022

భారత యుద్ధము జరిగిన పిమ్మట మన దేశములో జరిగిన చరిత్ర మనకు మన వారు అన్నీ చక్కగా పాలకుల వివరాలతో సహా అందించారు. అవన్నీ కావ్య పరిభాషలో ఉండటం.. అందరికీ చేరువ కాలేదు. వీటిని ఆనాటి పండితులు పరిష్కరించి అందించినా మన వారు పాశ్చాత్యులు మరియు కొందరు అమ్ముడుబోయిన మిడిమిడి జ్ఞానుల వివరణలతో చరిత్ర అనేది కాచి వడబోసిన సత్యాల మయంగా గాక వక్రీకరణలతో అందరికీ పరిచయం చేయబడ్డది.

మన చరిత్ర మనకు బోధించనివి కింద క్లుప్తంగా ఔత్సాహికుల కోసం అందించాను... వీటన్నింటినీ మనవాళ్ళు పరిశోధన చేసి మన భవిష్యత్ తరాలకు తిరిగి మనము పరిచయం చేయాలి. ఇవన్నీ కల్పిత గాథలు కావు..చారిత్రిక సత్యాలు.

పరీక్షితాబ్ధము - భారత యుద్ధము పిమ్మట , శ్రీకృష్ణ నిర్యాణమునకు పూర్వము ధర్మరాజు ముప్పది ఆరేళ్ళ పాలనము తర్వాత పరీక్షిత్తు కు పట్టాభిషేకం చేసి వారు దేశాటనం వెళ్లారు.

బార్హదృధాబ్ధము - మగధను పాలించిన బార్హద్రధ వంశ పాలనం

ప్రద్యోతనాబ్ధము - మగధ ను పాలించిన ప్రద్యోతన వంశ పాలనం

శిశునాగాబ్ధము - మగధను పాలించిన శిశునాగవంశ పాలనము

తృతీయ గోనందాబ్ధము - కాశ్మీర పాలకులు

పశుప్రేక్ష దేవాబ్ధము - నేపాల్ పాలకులు

భూమ వర్మాబ్ధము - నేపాల్ పాలకులు

నందాబ్ధము - మగధను పాలించిన మగధ వంశ పాలనము

మౌర్యాబ్ధము - మగధను పాలించిన మౌర్య వంశ పాలనము.

శుంగాబ్ధము - మగధను పాలించిన శుంగ వంశ పాలనము.

ప్రతాపాదిత్యాబ్ధము - కాశ్మీర్ పాలకులు

కాణ్వాబ్ధము - మగధను పాలించిన కాణ్వ వంశ పాలనము

ఆంధ్రాబ్ధము - మగధను పాలించిన ఆంధ్ర శాతవాహనుల పాలనము

మేఘవాహనాబ్ధము - కాశ్మీరపాలకులు

శక కాలబ్ధము - శకులను ఓడించి తరిమి ధర్మ స్థాపన

శ్రీహర్షాబ్ధము - ఉజ్జయినీ రాజధానిగా శకులను ఓడించి తరిమి ధర్మ స్థాపనము చేసిన శ్రీహర్షుని పాలనము. ఇతడు శక కర్త. ఆది శంకరుని గురువు అయిన గోవింద భగవత్పాదునికి పూర్వాశ్రమములో సన్యాసాశ్రము స్వీకరించక మునుపు కలిగిన కుమారుడు.మనం నేడు పాటించే పంచాంగ శకాలు శాలివాహన , విక్రమార్క శకానికి పూర్వము శ్రీహర్ష శకం వాడుకలో ఉండెడిది.

గుప్తాబ్ధము - మగధను పాలించిన గుప్త వంశ పాలనము

వసంతదేవాబ్ధము - నేపాల్ పాలకులు

అంశువర్మాబ్ధము - నేపాల్ పాలకులు

విక్రమాబ్ధము - మాలవ దేశము ముఖ్యముగా పాలించిన విక్రమాదిత్యుని పాలనము. మొదటి కాళిదాసు ఈతని కాలానికి చెందిన వారే.శకులను తిరిగి పారద్రోలి శక కర్త అయ్యారు. ఈతని మనవడు శాలివాహన..

శాలివాహనాబ్ధము - ప్రమర వంశానికి చెందిన విక్రమాదిత్యుని పిమ్మట అతని కుమారుడి తర్వాత ఆయన శాలివాహన శక కర్త అయ్యారు. నేడు మనం అనుసరిస్తున్న పంచాంగ శకం శాలివాహన శకం ఇతడి పేరు మీదనే ఆరంభించ బడినది. భోజరాజు ప్రమరవంశములో పదునాల్గవ తరము వాడు.

వీర దేవాబ్ధము - కాశ్మీర్ పాలకులు

కర్కోటాబ్ధము - కాశ్మీర్ పాలకులు

హర్షవర్ధనాబ్ధము - కనౌజ్ ని పాలించిన రాజు

ప్రతాపరుద్రాబ్ధము - కాకతీయ పాలకుల వీరవిక్రమ ధీరత

గుణకామ దేవాబ్ధము - నేపాల్ పాలకులు

సదాశివ దేవాబ్దము - నేపాల్ పాలకులు

కొల్లాబ్ధము - కేరళ రాజవంశ పాలనము

ఉత్పలాబ్ధము - నేపాల్ పాలకులు

నేపాళాబ్ధము - నేపాల్ ని పాలించిన జయదేవ మల్లుని పాలనము.

నారాయణ దేవాబ్ధము - నేపాల్ పాలకులు

యశస్కర దేవాబ్ధము - కాశ్నీర దేశ పాలకులు

ప్రథమ లోద్రాబ్ధము - కాశ్మీర దేశ పాలకులు

భోజ దేవాబ్ధము - ఇతడే ప్రమర వంశానికి చెందిన తెలుగు బ్రహ్మ క్షత్రియులు అయిన విక్రమాదిత్యుని వంశములో పదునాల్గవ తరము వారు అయిన భోజరాజు .మూడవ కాళిదాసు ఈతని పాలనకు చెందినవారు.ధారా నగరము ఈతని రాజధాని.

ద్వితీయ లోద్రాబ్ధము - కాశ్నీర రాజ వంశము.

రామదేవాబ్ధము - దేవగిరి పాలకుల చరిత్ర.

హరి సింహ దేవాబ్ధము - నేపాల్ పాలకులు

కృష్ణారాయాబ్ధము - విజయనగర రాజవంశావళి

పృథ్వీ నారాయణాబ్ధము - నేపాల్ పాలకులు.

ఇవన్నీ కూలంకషముగా తెలిస్తే గానీ భారత చరిత్ర మీద మనకు కొంతయినా మనకు పట్టు గలిగినట్టు..ఇవేమీ లేకుండా మొఘలులు, సుల్తానులు తోనే దేశ చరిత్ర అంటూ మనమీద రుద్ధబడిన చరిత్ర మనకు అవసరమా!ఆలోచించండి

12/04/2022

నాలుగు రాష్ట్రాల్లో తురకలు శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్న హిందువుల మీద చేసిన దాడులను నామ మాత్రంగా అయినా వ్రాయని పత్రికలు..రాగా ట్వీట్ ని, జే ఎన్ యూ లోని కమ్మీలు మొదలెట్టిన గొడవ లు మాత్రం హైలైట్ చేస్తూ వ్రాయడం ఈనాడు తో సహా అన్ని తెలుగు పత్రికల నైచ్యానికి ,ద్వంద్వ నీతికి నిదర్శనం.

12/04/2022

అశాంతి కిషోర్ చెప్పిందల్లా చేసి మమతక్క పదవి దక్కించుకుందని,ఇపుడు దొర కూడా అదే దారిలో ఆయన ఆడిస్తున్న దారిలో ఆడటానికి బయలుదేరాడు..

పట్టణాల్లో ఇంతింత విశాలమైన స్థలాలు చర్చ్ లకు ఏ విధంగా వస్తాయి? అదే హిందువుల గుడులు మాత్రం ఇరుకు సందుల్లో ఉంటూ వీటితో పోల...
12/04/2022

పట్టణాల్లో ఇంతింత విశాలమైన స్థలాలు చర్చ్ లకు ఏ విధంగా వస్తాయి? అదే హిందువుల గుడులు మాత్రం ఇరుకు సందుల్లో ఉంటూ వీటితో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటున్నాయి. ఈ చర్చ్ మియాపూర్ మదీన గూడ ప్రధాన రహదారిలోనే ఉంది.. దాదాపు ఎకరం స్థలం కి తక్కువ లేదు

ఓ వైపు శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతూ ఉండగానే అదే రోజు ఆలయ పరిసరాల్లో కట్టిన బ్యానర్లు, శ్రీరాముని  ఫ్లెక్సీలు మొత్తం తొల...
12/04/2022

ఓ వైపు శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతూ ఉండగానే అదే రోజు ఆలయ పరిసరాల్లో కట్టిన బ్యానర్లు, శ్రీరాముని ఫ్లెక్సీలు మొత్తం తొలగించి చెత్తలో వేసిన అధికారులు ..ఇదంతా గుంటూరులో జరిగింది

12/04/2022

ప్రశాంతంగా శ్రీరామ నవమి జరుపుకుంటున్న హిందూ తీవ్ర వాదుల మీద రాళ్ళ వర్షం కురిపించిన శాంతి దూతలు మహమ్మద్ అనుయాయులు =D . ఇదంతా మధ్యప్రదేశ్ లో జరిగింది.దీనిని ఏ వార్తలు వ్రాసే అమ్ముడు పోయిన వెధవాయి వ్రాయలేదు. కారణం అందరికీ తెలుసు.

ప్రశాంతంగా జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాలు కార్యక్రమం మీద ముందస్తు ప్రణాళికలతో రాళ్లవర్షము కురిపించిన వారి మీద చర్యలు తీసుకోవాలని , ఆలయాల పరిధిలో అక్రమంగా ఉన్న ఆ ఇల్లు, కట్టడాలు అక్కడ నుండి వెంటనే తొలగించివేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు వెంటనే తీసుకుంది.

దీని మీద మాత్రం అవాకులు చెవాకులు ఎన్ని వ్రాస్తున్నారో!!??

01/04/2022

అయ్యా భాజపా అధ్యక్షులు సోమూ వీర్రాజు గారూ , రాష్ట్ర ఎంపీ జి వి ఎల్ గారూ.

మీకు ఒక కథ చెప్పాలి. ఒకప్పుడు తెలుగునాట ఒక కొయ్యల వ్యాపారి ఉండేవాడు..ఆతడికి కొన్నాళ్ళకు ఒక హిందీ వ్యాపారస్తుడూ తోడయ్యాడు. ఆతడూ ఈతనితో తిరిగి కొంచెము తెలుగు నేర్చాడు..ఓ సారి హిందీ ఆతను ఫోన్ లో మాటాడుతూ.. అయ్యా మనం నిక్కచ్చిగా వ్యాపారం చేయాలి అంటే కుదరదూ.. చందనం, కుందనం, గంధం సందున "ఏపియ్యయినా" ( వేపవి అని అతడి అర్థం) సరే లోడ్ లో వేసేస్తే కలసి పోతాయి..మనకు అంతో ఇంతో లాభం వస్తుందని చెప్పాడు. ఇది విన్న తెలుగు వ్యాపారికి ఆతడిచ్చిన ఐడియా బ్రహ్మాండముగా అనిపించింది.

తెలుగు వ్యాపారి ఇంటి వెనుక పెద్ద మైదానంలో చెట్లు గుంపు గా పొదలుగా పెరుగున్నాయి..ఆ ఊరి వారు అందరూ ప్రొద్దునా , సాయంత్రం చెంబు పట్టుకుని ఆ మైదానంలో చెట్లచాటుకు పోయేవారు. తెలుగు వ్యాపారి అత్యవసరం గా ఒక లారీ పిలిపించాడు.. వెంటనే ఆ మైదానం అంతా ఊడిపించి లారీ కెత్తించి బాగా టర్బన్ వేసి కట్టి బిగించి పంపాడు. దారిలో కొంచెం ధారాపాతంగా వర్షము కురిసింది..లారీ ఆగిపోయింది. ఆ హిందీ వ్యాపారి దారి మధ్యలో లారీని కలుసుకుని మా భాగస్వామి ఏమేమి పంపాడో అని టర్బన్ తీసి చూద్దాం అనుకున్నాడు.. వెంటనే టర్బన్ తీసి చూసి ఆ కంపుకు అక్కడే కడుపులో తిప్పి పడిపోయాడు.

అలా ఆ తెలుగు వ్యాపారిలా ఉంది మీ తీరు. చందనం, కుందనం, గంధం సందున వేపవి అయినా సరే అంటే మంచి మంచి నాయకులు మధ్యలో ఒకరో ఇద్దరో చెడు నాయకులు అయినా సరే వంద శాతం మంచి ఉండదు కాబట్టి అని పార్టీ నాయకత్వం చెబితే మీరేమో..వేపని తప్పుగా అర్థం చేసుకుని లారీ కి మైదానంలో ఉన్న సరుకు నింపుకుని వెళ్లినట్టు వెళుతున్నారు. ఇది పార్టీపై తీరని కళంకము వచ్చేలా చేస్తోంది. మీ తీరు మారాలి. ప్రత్యర్థులు బ్రహ్మరాక్షసులు అయినపుడు మీరు చేతిలో విల్లంబులు ధరించి వారిని నిలువరించే ప్రయత్నం చేయక పోగా అవినీతిపరులను జంప్ జిలానీల ను ఎడాపెడా చేర్చుకుంటే తీరని కంపు కొడుతుంది. ఇది భవిష్యత్ లో తీరని నష్టాన్ని కలుగ జేస్తుంది.

ఇది నాటు కథే కానీ దీనిని సరిగ్గా భావము మాత్రమే గ్రహించి పార్టీని ముందుకు సాగించాలి.


.

10/02/2022

ఒక మంత్రి గారు వ్యవహరించే తీరు ఇదేనా.. ఇదే రీతిలో ఒక స్త్రీ ఎమ్మార్వో ని కొట్టిన ఘనత ఇంతకు ముందు.తెదేపాలో చూశాం.. ఇపుడు అలాంటి ఘోరాలు మరిన్ని చూస్తున్నాము.. వీళ్ళు అధికారంలో ఉండదగ్గవారా.. మార్పును మనం కోరుకోవడం నేరమా!

నాయకుడు అనేవాడు మాటాడేప్పుడు అత్యంత జాగరూకత వహించాలి.. ఏదో మాటాడాలి, ఏదో చేయాలి అని ఏదో అయిపోవడము , ఒక సమస్య మీద మాటాడేప...
30/12/2021

నాయకుడు అనేవాడు మాటాడేప్పుడు అత్యంత జాగరూకత వహించాలి.. ఏదో మాటాడాలి, ఏదో చేయాలి అని ఏదో అయిపోవడము , ఒక సమస్య మీద మాటాడేప్పుడు దాని మీద పూర్వాపరాలు చర్చ చేయకుండా మైక్ దొరికింది కదా అని ఏదేదో మాటాడితే
ఆ సదరు నాయకుడి తో సహా పార్టీ కేడర్ ని స్వీయ రక్షణలో పడేస్తుంది.

అయ్యా సోమూ వీర్రాజు గారూ తమరు ఏనాడైనా పార్టీ ప్రగతికోసం కృషి చేశారా ఈ రెండు మూడేళ్ళలో? ఆ వ్యాఖ్యలు ఆదుర్దా తనం కింది స్థాయి పార్టీ కేడర్ ని స్వీయ రక్షణలో పడేసి ఆయనేమన్నారో మాకు తెలీదండీ బహుశా వ్యంగ్యంగా నో లేదా తన స్వంత అభిప్రాయం నో చెప్పుంటారు అనేదానికి కూడా లేకుండా చేశారు.

మీది అమాయకత్వం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియట్లేదు. మీరు ఇంకా ఆట్టే కాలం ఆ అధ్యక్షుడు పదవిలో కూర్చోకుండా కాస్త ఓపిక కూడదీసుకుని రాజీనామా చేసి సగౌరవంగా కార్యకర్తలా కొనసాగుతాను అని గౌరవంగా మెలగండి.

ఇట్లు

ఓ భాజపా అభిమాని

వీర నరసింహ రాజు

2024 కి రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా గుల్ల అవుతుంది. ఇది ఆంధ్రుల స్వయంకృతాపరాధం.రాష్ట్ర విభజన జరిగిన పిమ్మట మన పరిస్థితి ...
23/11/2021

2024 కి రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా గుల్ల అవుతుంది. ఇది ఆంధ్రుల స్వయంకృతాపరాధం.రాష్ట్ర విభజన జరిగిన పిమ్మట మన పరిస్థితి ఓ మారు వెనక్కి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. మనకు కావలసింది ప్రస్తుతం కులాల కుమ్ములాటలు కాదు ఈ పార్టీలను విడనాడి అభివృద్ధి పథం లోకి నడిచే ప్రయత్నం చేయాలి. ఈ పరిస్థితిలో ఇపుడు పెనమా, పొయ్యా, అయోమయమా కాదు.. ఇంకో అయిదేళ్ళు వృథా చేస్తే మన అంత తెలివి తక్కువ వారు ఉండరు అనుకుంటాను.

ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే దారిలో మనం వెళ్లక పోతే భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుంది.


ఆలోచించండి..

Lotus?? Or Loot us!!మన ఆంధ్రులకు ఉన్న ఒకే ఒక్క ఏకైక మార్గం కమలం ని వికసింపజేయడమా లేదంటే రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన రెం...
17/10/2021

Lotus?? Or Loot us!!

మన ఆంధ్రులకు ఉన్న ఒకే ఒక్క ఏకైక మార్గం కమలం ని వికసింపజేయడమా లేదంటే రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన రెండు పార్టీల ద్వారా మరింత ఊబిలోకి రాష్ట్రాన్ని తోసివేయడమా !

మన భవిష్యత్ తరాల తల వ్రాత మన చేతిలో ఉంది. దానిని మార్చే మార్గము మన చేతిలోనే ఉన్నది.

మన ఆంధ్ర హిందువులకు ఉన్న ఒకే ఒక్క ఊతము కమలం. కమల వికాసానికి మన అంత మనము చేయూత ఇవ్వక పోతే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారక తప్పదు.

అప్పుల ఊబిలో కూరుకుని పోతున్న రాష్ట్రానికి కేంద్ర సహకారం అత్యంత అవసరం.

రాజధాని, దిక్కు దిశ లేని రాష్ట్రానికి రాష్ట్ర భాజపా నాయకత్వం న్యాయం చేస్తుందా అని చూడకండి.

ప్రధాన సేవకుడు నరేంద్ర మోడీ ని నమ్మి కమల వికాసం కి తోడ్పాటు అందించండి.

సర్కార్ వారి మటన్, చికెన్, పులావ్, బజ్జీలుఅన్నీ త్వరలో
09/09/2021

సర్కార్ వారి మటన్, చికెన్, పులావ్, బజ్జీలుఅన్నీ త్వరలో

Address

Vijayavada
502355

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra BJP Supporters posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Andhra BJP Supporters:

Share