31/05/2026
వేసవి శిక్షణ తరగతుల ప్రగతిని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్.బేగ్ గారు
ఈ రోజు విజయవాడ స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో విశేష స్పందనతో అత్యుత్సాహంగా జరుగుతున్న వేసవి శిక్షణా తరగతులను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు శిక్షణ తరగతులను సందర్శించడం జరిగినది. ఆయన చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ....
* శిక్షణ తరగతులు రాష్ట్రమంతా విజయవంతంగా కొనసాగుతున్నాయని చిన్నారుల్లో ప్రతిభ సృజనాత్మకత మరియు క్రమశిక్షణ పెంపొందించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు
* ఈ తరగతుల ద్వారా విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, కళలు, సాంస్కృతిక అంశాలు మరియు వివిధ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు అని కొనియాడారు. శిక్షణ ఇస్తున్న రిసోర్స్ పర్సన్స్ ను, విజయవంతంగా కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రంథాలయ అధికారి కె.రమాదేవిని మరియు సిబ్బందిని అభినందించారు.
మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం. ఎస్. బేగ్ గారు మాట్లాడుతూ...
* వేసవి శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా పిల్లలు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించి తమ సమయాన్ని పుస్తక పఠనం, ఆటలు మరియు స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవటం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవటం వంటి అనేక మంచి గుణాలు ఈ సమ్మర్ క్యాంపు ద్వారా అభివృద్ధి చెందుతాయని, అందువలన సమ్మర్ క్యాంపులు విద్యార్థులు సమగ్ర వికాసానికి ఎంతో దోహదపడతాయని అని తెలియజేశారు.
అనంతరం గిన్నిస్ అవార్డు తీసుకున్న కుసుమ గారు ఊలుతో చేసిన జాతీయ జెండా అతిధులకు చూపించి బహుకరించారు. చిన్నారులకు ఊలుతో ఫ్లవర్ అల్లిక నేర్పించారు. ఆమె ప్రతిభను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కే రమాదేవి, సిబ్బంది వై ధనలక్ష్మి, రిసోర్స్ పర్సన్స్ వి.సుమతి గారు, కుమారీ చైత్రిక, ఝాన్సీ గారు, రాజీవ్ గారు, వివిధ స్కూల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.