28/10/2024
ప్రచురణార్థం* 28-10-2024
పశ్చిమంలో భారీ స్థాయిలో టిడిపి సభ్యత్వ నమోదు
విజయవాడ : విజయవాడ పశ్చిమంలో నియోజకవర్గంలో భారీ స్థాయిలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా చురుగ్గా సాగుతోంది.54వ , డివిజన్ లో సోమవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా *మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్నగారు,* **టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా గారు, syed రఫీ గారు , జగన్ మోహన్ గారు ** హాజరై ఈ డివిజన్ లో టిడిపి కార్యకర్తలకు, అభిమానులకు, సానుభూతి పరులకు పార్టీ సభ్యత్వ నమోదు పై అవగాహన కల్పించి పార్టీ బలోపేతానికి భారీగా సభ్యత్వ నమోదులు చేయించారు. నూతన సభ్యత్వ విధానంలో రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే టిడిపి కార్యకర్తలకు అందించే సదుపాయాలను బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వివరించారు.
ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు సలీమ్, తాజుద్దీన్, యూనిట్ ఇంచార్జి syed హుస్సేన్, మౌనిక, శివ రామ్ ప్రసాద్, వర lakmi, ఖలీల్, అజాంపాషా , ఉమా మహేశ్వర్ రావు, సత్తార్, వెంటేశ్వర్లు, చిన్ని,సల్మాన్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవాడ పశ్చిమ, షేక్ తాజుద్దీన్