SUCI Communist, AP

SUCI Communist, AP Socialist Unity Centre of India (communist) SUCI(C)

Protest Rally Held in Anantapur, Andhra Pradesh, on May 31, Organized by the SUCI (Communist) Party, Demanding the Rollb...
31/05/2026

Protest Rally Held in Anantapur, Andhra Pradesh, on May 31, Organized by the SUCI (Communist) Party, Demanding the Rollback of Increased Prices of Petrol, Diesel, Cooking Gas, and Essential Commodities.

పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ SUCI COMMUNIST పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన నిరసన ర్యాలీ







ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులను ఉపసంహరించాలి! ప్రముఖ జర్నలిస్టు, మేధావి, ప్రజాస్వామ్యవాది, మాజీ ఎం.ఎల్.సి. ప్రొఫెసర్ నాగే...
29/05/2026

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులను ఉపసంహరించాలి!

ప్రముఖ జర్నలిస్టు, మేధావి, ప్రజాస్వామ్యవాది, మాజీ ఎం.ఎల్.సి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్టు) పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఖండిస్తోంది. ఇది వాక్ స్వాతంత్రాన్ని, పత్రికా స్వాతంత్రాన్ని నియంత్రించడానికి, పాత్రికేయులను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమే.

ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైయితే, వాటిని ఖండించవచ్చు. అలా కాకుండా బెదిరిస్తూ ట్రోల్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. అధికారంలో ఉన్న నాయకులు తక్షణం ఈ ప్రయత్నాలను మానుకొని ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.

బి.ఎస్.అమర్ నాథ్
రాష్ట్ర కార్యదర్శి
ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్టు)
తేదీ: 28-05-2026

SUCI Communist

25/05/2026
క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుధ్ధసన్నాహాలను తీవ్రంగా నిరసిస్తూ ప్రపంచవ్యాపిత ఐక్య ప్రతిఘటనకై SUCI(C) పార్ట...
25/05/2026

క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుధ్ధసన్నాహాలను తీవ్రంగా నిరసిస్తూ ప్రపంచవ్యాపిత ఐక్య ప్రతిఘటనకై SUCI(C) పార్టీ పిలుపు!

-కామ్రేడ్ ప్రవాష్ ఘోష్, ప్రధాన కార్యదర్శి, ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్ట్)

అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ రహస్య సైనిక చర్య ద్వారా వెనిజులా అధ్యక్షుడు మదురోను అపహరించిన తర్వాత, తన తొత్తు జియోనిస్ట్ ఇజ్రాయెల్‌ను వెంటబెట్టుకుని ఇరాన్‌పై నిష్కారణంగా, అమానవీయ సాయుధ దాడి చేసిన అమెరికా సామ్రాజ్యవాదులు, ఇప్పుడు సోషలిస్టు క్యూబాపై తమ దాడిని ఎక్కు పెట్టారు. కఠినమైన ఆంక్షలు, చమురు దిగ్బంధంతో క్యూబాను ఉక్కిరిబిక్కిరి చేసి తీవ్ర ఇంధన సంక్షోభం, సామాజిక-ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారు.

యుద్ధ పిపాసి అమెరికా సామ్రాజ్యవాద అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని విస్తరించడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. క్యూబా ప్రభుత్వాన్ని కూల్చి, మొత్తం లాటిన్ అమెరికాపై అడ్డులేని ఆధిపత్యాన్ని స్థాపించాలని ట్రంప్ చూస్తున్నాడు.

1959 లో క్యూబా విప్లవం ద్వారా అమెరికా అండదండలున్న నిరంకుశ బటిస్టా పాలనను కూలదోసిన తర్వాత, క్యూబా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లాటిన్ అమెరికా ప్రజల పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. అప్పటి నుండి అమెరికా పదేపదే కుట్రలు చేసి ప్రతీఘాత-విప్లవాన్ని రెచ్చగొట్టి క్యూబా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించింది, కానీ పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు సంపూర్ణ ఆర్థిక దిగ్బంధం విధించి, క్యూబా ప్రజలకు తీవ్ర సంక్షోభం సృష్టించి, మాజీ క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై తప్పుడు ఆరోపణలు చేసి ఆ సాకుతో క్యూబాపై దాడి చేయాలని చూస్తోంది.

కానీ ధైర్యవంతులైన క్యూబా ప్రజలు తలవంచడానికి నిరాకరిస్తున్నారు. ‘మాతృభూమి రక్షణ లేదా మరణం మాముందున్న మార్గం– మేము గెలుస్తాం’ అని ధైర్యంగా ప్రకటించారు. మేము అన్ని దేశాలలోని సామ్రాజ్యవాద వ్యతిరేక, స్వాతంత్ర్య కాంక్షిత ప్రజలతో కలిసి పోరాడుతాం .

శక్తివంతమైన సోషలిస్టు శిబిరం లేని నేపథ్యంలో అడ్డూఅదుపూ లేని అమెరికా సామ్రాజ్యవాదుల అంతర్జాతీయ గూండాయిజాన్ని, పెత్తందారీతనాన్ని ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్టు) పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. క్యూబాను కూల్చివేసి ఆ భూమిపై తమ ఆధిపత్యాన్ని స్థాపించాలన్న రాక్షస అమెరికా సామ్రాజ్యవాదుల, వారి అనుచరుల దుష్ట కుట్రలను అడ్డుకోవడానికి ప్రపంచంలోని సామ్రాజ్యవాద వ్యతిరేక, శాంతికాముక ప్రజలందరూ ముందుకు రావాలని పార్టీ పిలుపునిస్తోంది.

23-05-2026


24/05/2026

పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరకుల ధరలు ఉపసంహరించాలి.



ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానాన్ని ఆపాలి!విద్యుత్ వినియోగం, బిల్లింగులో పారదర్శకత, వినియోగ దారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు...
19/05/2026

ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానాన్ని ఆపాలి!

విద్యుత్ వినియోగం, బిల్లింగులో పారదర్శకత, వినియోగ దారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు అనే పేరుతో ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించడాన్ని ఎస్.యు.సి.ఐ (కమ్యూనిస్టు) ఖండిస్తోంది. ఈ విధానములో వినియోగదారుడు వినియోగించాల్సిన కరెంటుకు డబ్బు ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు అమర్చిన స్మార్ట్ మీటర్ల ద్వారా ఈ విధానాన్ని ప్రస్తుతం అమలు పరచాలని ప్రభుత్వం చూస్తోంది. వాటిని ప్రీపెయిడ్ విధానంలోకి మార్చడమే తరువాయి. క్రమేణా వాణిజ్య, గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసి, ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వo మద్దతుతో ఈ విధానాన్ని డిస్కంలు నిర్ణయించాయి.

ప్రజలకు నష్టం కలిగించే ఈ ప్రీపెయిడ్ విధానాన్ని తక్షణం మానుకోవాలని, గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీ డిమాండ్ చేస్తోంది.

బి.ఎస్.అమర్ నాథ్
రాష్ట్ర కార్యదర్శి
ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్టు)
తేదీ: 17-05-2026
-------------

ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానాలను ఆపండి! ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ...
19/05/2026

ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానాలను ఆపండి!

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు కూటమి రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎస్ యు సి ఐ (కమ్యూనిస్టు) పార్టీ ఖండిస్తుంది. 2029 నాటికి 100% విద్యుత్ బస్సులు విధానం అమలు ముసుగులో ఈ ప్రైవేటీకరణ అమలుకు ప్రభుత్వము పూనుకొంటోంది. ప్రస్తుతం ఆర్టీసీ లో ఉన్న 100 ఈ బస్సులలో ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. ఈ - బస్సుల విధానాన్ని 100% అమలు చేస్తే భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగులు ఉండరనేది స్పష్టం. విద్యుత్ బస్సుల ఆపరేటర్ల కోసం 12 ఆర్ టి సి డిపోలను కట్టబెట్టడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాము. విద్యాధరపురము, గుంటూరు-2, నెల్లూరు-2 డిపోలను ఇప్పటికే ఖాళీ చేయించారు. ఆర్టీసీలు ప్రైవేటు బస్సులు తప్పనిసరి అంటూ ఆర్టీసీ చైర్మన్ కూడా ప్రకటించారు. వీటన్నిటిని పరిశీలిస్తే ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ధృఢ నిశ్చయముతో ఉందని స్పష్టమవుతుంది.

కావున తక్షణం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక ఈ విధానాన్ని తక్షణం ఉపసంహరింకోవాలి లేనిచో ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బి.ఎస్.అమర్ నాథ్
రాష్ట్ర కార్యదర్శి
ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్టు)
తేదీ: 17-05-2026

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరం, సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నందు ఎస...
18/05/2026

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరం, సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నందు ఎస్‌యూసీఐ(కమ్యూనిస్టు) పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా SUCI (C) పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డి.రాఘవేంద్ర,
సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.గిరీష్ మాట్లాడుతూ
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఛార్జీలు, కూరగాయలు, సరుకుల ధరలు మరింత పెరిగి సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కార్మికులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలు అమలు చేస్తూ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో ధరలు తగ్గించడం లేదని, బదులుగా పన్నుల భారం పెంచి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నేడు ఉన్న సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Address

Ajith Singh Nagar
Vijayawada
520015

Alerts

Be the first to know and let us send you an email when SUCI Communist, AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SUCI Communist, AP:

Share