20/08/2026
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రెస్ మీట్..
విజయనగరం, జిల్లా పూసపాటిరేగ మండల విశాలాంధ్ర విలేకరి గోవింద్ పై భూ అక్రమార్కుల దాడిని ఖండిస్తున్నాం.
జర్నలిస్ట్ గోవింద్ పై దాడికి పాల్పడిన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
రాష్ట్రంలో జర్నలిస్టులపై భూకబ్జాదారుల, రియల్, ఇసుక, మట్టి మైనింగ్ మాఫియాల అక్రమాలు, దాడులు మితిమీరిపోతున్నాయి.
జర్నలిస్టుల రక్షణకు, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి.
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించి, ఫీజు రాయితీ ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం-2009 సక్రమంగా అమలు జరగటం లేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ద్వారా బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కుగా ఉండాలి.
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నాయి.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల సరుకుల కొనుగోలు టెండర్లలో రూ.25 కోట్లు అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.
మార్కెట్ ధరలకన్నా దాదాపు 30% అధిక ధరలు వెచ్చించి సరుకులు కొనుగోలుకు కేజీబీవీ టెండర్లు ఖరారు చేయడం దుర్మార్గం
దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ఫ్లాట్ ఫారంలలోని ధరలను ప్రామాణికంగా తీసుకోలేదు
10 నెలల కాలానికి బల్క్ గా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు సాధారణ రిటైల్ ధర కంటే ధర తగ్గాలేగాని పెరగకూడదు
డి మార్ట్ మెట్రో వంటి సంస్థల్లో కూడా సాధారణ రిటైల్ ధరల కంటే సుమారు 6 శాతం ధరలు తక్కువగా ఉంటాయి
బ్లింక్ఇట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ల ధరలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరం ఎందుకు? డైరెక్ట్ గానే కొనుగోలు చేయవచ్చు కదా
కేజీబీవీ టెండర్లను అర్ధరాత్రి హడావుడిగా ఖరారు చేయటంతోపాటు అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
కేజీబీవీ సరుకుల అక్రమ టెండర్లను రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలిచి, పారదర్శకంగా నిర్వహించాలి.
లేనిపక్షంలో సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాపిత ఆందోళన చేపడతాం.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల నిర్ణయంపై పలు అనుమానాలు ఉన్నాయి.
బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం జరపాలి.
- గుజ్జుల ఈశ్వరయ్య,
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి