02/09/2026
*ప్రెస్ నోట్-02-09-2026*
*విజయవాడ*
*మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్*
*దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు:ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్*
*జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, దాదాపు 100 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు*.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రజలకు పరిచయం చేసి, సంక్షేమానికి రథసారధిగా నిలిచిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారేనని కొనియాడారు. జలయజ్ఞం ద్వారా రైతులకు సాగునీరు, తాగునీరు అందించిన మహోన్నత వ్యక్తి ఆయన అని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సర్వీసులు, పోలవరం, పులిచింతల, వెలిగొండ ప్రాజెక్టులు వైఎస్సార్ గారి దార్శనికతకు నిదర్శనాలని పేర్కొన్నారు.వైఎస్సార్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, చేయూత, ఇంగ్లీష్ మీడియం విద్య, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రతి ఇంట సంక్షేమాన్ని అందించారని తెలిపారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టులను, పథకాలను కూటమి ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటూ అబద్ధాలు చెప్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వెన్నుపోటు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్ లలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,నాయకులు ఘనంగా నివాళులు అర్పించి సేవా సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా, 2029 సాధారణ ఎన్నికల్లో అయినా రాష్ట్ర ప్రజల మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని, వైఎస్సార్ ఆశయ సాధనకు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్,రాష్ట్ర కార్యదర్శి లు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ ప్రెసిడెంట్లు,రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ,డివిజన్ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..