08/02/2026
సమానత్వానికి మద్దతుగా విద్యార్థులు–ఉపాధ్యాయులు–
సామాజిక కార్యకర్తల ఐక్యం
*UGC ఈక్విటీ నిబంధనల కోసం ఆల్ ఇండియా ఫోరం ప్రారంభం*
ఈక్విటీ నీ సమర్థించే విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కలిసి UGC ఈక్విటీ నిబంధనల అమలుకు మద్దతుగా ఇవ్వడం జరిగింది
ఈక్విటీ కోసం విద్యార్థులు గొంతు ఎత్తితే, మోదీ ప్రభుత్వం మరోసారి JNUని అపఖ్యాతిపాలుచేయడానికి, విద్యార్థి నాయకులను వేధించడానికి ప్రయత్నిస్తోంది.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్య వాదులు కలిసి ఏర్పడిన ఈ ఐక్య పోరాటం సామాజిక వివక్ష, భావజాల వేధింపులు, అణచివేతకు వ్యతిరేకంగా ఎద్దఎత్తున ఉద్యమం అవసరం , ఇది ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం కోసం పోరాటానికి బలం చేకూరుస్తుంది.
ప్రెస్ రిలీజ్
08.02.2026
*UGC ఈక్విటీ నిబంధనల కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, సామాజిక ఐక్య పోరాటం!*
ఢిల్లీలో “ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ – UGC నిబంధనల సమతా ఆందోళన్” ప్రారంభం!
ఫిబ్రవరి 8న ఢిల్లీలోని హెచ్కేఎస్ సూర్జీత్ భవన్లో, విపక్ష విద్యార్థి సంఘాల జాతీయ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజా మేధావులు, క్రింది స్థాయి సామాజిక ఉద్యమా నాయకులు కలిసి “ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ”ని ప్రారంభించారు.
ఈ ఫోరమ్లో భాగమైన సంస్థలు, నాయకులు:
డా. జితేంద్ర మీనా, డా. లక్ష్మణ్ యాదవ్, మహేష్ చౌధరీ, భన్వర్ మేఘవంశీ, JNUSU, AISA, SFI, NSUI, AISF, MSF, RYA, DSF, ASA, AIOBCSA, CRJD, Collective, BAPSA, సామాజిక న్యాయ ఉద్యమం బిహార్, గోండ్వాన గణతంత్ర పార్టీ, రిహాయి మంచ్, సోషల్ జస్టిస్ ఆర్మీ, FTII విద్యార్థి సంఘ అధ్యక్షుడు, OBC ఆరక్షణ సంగ్రహ్ సమితి, SF రాజస్థాన్–బార్మర్, JAYS మధ్యప్రదేశ్, BPVM ఉద్యమం తదితరులు.
సమావేశానికి డా. జితేంద్ర మీనా అధ్యక్షత వహించారు.
SC/ST/OBC విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఎదుర్కొంటున్న అణచివేత చరిత్రను ఆయన గుర్తుచేశారు.
“కుల వివక్ష కారణంగా తమ జీవితాలను కోల్పోయిన ఎన్నో విద్యార్థుల బాధను దృష్టిలో పెట్టుకుని UGC కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చింది. కానీ అనవసర భయం సృష్టించి, చివరకు కోర్టు ద్వారా ఆ మార్గదర్శకాలపై నిలుపుదల తెచ్చారు” అని ఆయన అన్నారు.
JNUSUకి చెందిన కామ్రేడ్ అదితి మాట్లాడుతూ, మీడియా మరియు బ్రాహ్మణవాద శక్తులు దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
“సాధారణమైన సమానత్వ చర్యను కూడా ఒక వర్గానికి ముప్పుగా చూపించారు. ‘దుర్వినియోగం అవుతుందనే’ అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి భయ వాతావరణం సృష్టించారు” అని ఆమె అన్నారు.
రోహిత్ వేముల చట్టం ఆధారంగా మరింత బలమైన ఈక్విటీ నిబంధనలు అవసరమని ఆమె స్పష్టం చేశారు.
“ఈ పోరాటంలో JNUSU ముందుండి నడుస్తుంది” అని ఆమె చెప్పారు.
ప్రొఫెసర్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, మండల్ కమిషన్ ఉద్యమ కాలాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు.
సమానత్వ చర్యలను అడ్డుకోవడంలో కోర్టుల పాత్రను విమర్శించారు.
SIR వంటి అంశాలను పట్టించుకోని కోర్టులు, EWS రిజర్వేషన్ను అనుమతించాయని గుర్తు చేశారు.
“కొద్ది మందితో జరిగిన UGC వ్యతిరేక నిరసనలను మీడియా భారీ ఉద్యమాలుగా చూపించింది. కానీ అలహాబాద్, పాట్నా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వందల మంది విద్యార్థులు బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే, మీడియా వాటిని పట్టించుకోవడం లేదు” అని అన్నారు.
ఈ సమావేశంలో మహేష్ చౌధరీ (అరవల్లి బచావో మంచ్), నేహా (AISA), సూరజ్ ఎలమోన్ (SFI), విరాజ్ (AISF), అఖిలేష్ కుమార్ (NSUI), క్రాంతి కుమార్ (BAPSA), హార్దిక్ (DSF), ప్రియం (Collective), అహ్మద్ సాజు (MSF), శరణ్య (AUDSC), రాజేంద్ర (OBC ఆరక్షణ సంగ్రహ్ సమితి) తదితరులు మాట్లాడారు.
JNUSU మాజీ అధ్యక్షుడు సహా పదవి నుంచి తొలగించబడిన విద్యార్థి నాయకులపై జరిగిన చర్యలను ఫోరం తీవ్రంగా ఖండించింది.
క్యాంపస్ ప్రజాస్వామ్యంపై జరిగిన నియంతృత్వ దాడికి వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటించింది.
ఫిబ్రవరి 13న దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు!
100కు పైగా క్యాంపస్లలో నిరసన సభలు!
UGC నిబంధనల అమలుకు మద్దతుగా ఫిబ్రవరి 13న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని ఫోరం పిలుపునిచ్చింది.
100కు పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నిరసన సభలు జరగనున్నాయి.
“ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ – UGC నిబంధనల సమతా ఆందోళన్”
UGC నిబంధనలు 2026 కోసం దేశవ్యాప్త ఉద్యమానికి వేదిక.
రోహిత్ వేముల చట్టం ఆధారంగా మరింత బలమైన UGC సామాజిక సమానత్వ నిబంధనలు అమలు చేయాలని ఫోరం డిమాండ్ చేస్తోంది.
ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ – UGC నిబంధనల సమతా ఆందోళన్