AISA Andhrapradesh

AISA Andhrapradesh all India Students' Association state chapter andhrapradesh

22/03/2026
17/03/2026
*JNU 14 – రోడ్డుపై పోరాట యాత్ర!*UGC తీసుకొచ్చిన అన్యాయ ఈక్విటీ రెగ్యులేషన్లకు వ్యతిరేకంగా, అలాగే Jawaharlal Nehru Univer...
10/03/2026

*JNU 14 – రోడ్డుపై పోరాట యాత్ర!*

UGC తీసుకొచ్చిన అన్యాయ ఈక్విటీ రెగ్యులేషన్లకు వ్యతిరేకంగా, అలాగే Jawaharlal Nehru University (JNU)లో వీసీ అమలు చేస్తున్న జాతివాద, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడినందుకు “JNU 14” విద్యార్థి నాయకులను తిహార్ జైలుకు పంపించారు.

*జైళ్లు పోరాటాలను ఆపలేవు… జైలు గోడలు విప్లవ స్వరాలను ఆపలేవు!*

*సమానత్వం (Equity), విద్యలో న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటం ఒక యూనివర్సిటీ గడపలోనే ఆగిపోదు. అది దేశం మొత్తం వ్యాప్తి చెందే ప్రజా ఉద్యమంగా మారుతోంది.*

ఇప్పుడు JNU 14 పోరాట యోధులు దేశవ్యాప్తంగా ప్రజల మధ్యకి వచ్చి UGC అన్యాయ రెగ్యులేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈక్విటీ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు.

సమానత్వం కోసం జరిగే పోరాటాన్ని తిహార్ గోడలు బంధించలేవు!
విద్యను కార్పొరేట్లకు అమ్మే విధానాలను ప్రజా శక్తి తుడిచిపెట్టేస్తుంది!

✊ *పోరాట యాత్ర షెడ్యూల్*
Rae Bareilly – 12 మార్చి
Darbhanga – 14 మార్చి
Bhojpur – 15 మార్చి
Lucknow – 16 మార్చి
Ranchi – 17 మార్చి
Allahabad – 18 మార్చి
Patna – 18 మార్చి

ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ
UGC అన్యాయ రెగ్యులేషన్లకు వ్యతిరేకంగా – దేశవ్యాప్త సమానత్వ ఉద్యమం
____AISA🚩🚩🚩

01/03/2026

JNU 14 RELEASED FROM TIHAR JAIL!

जेल के ताले टूट गए,
हमारे साथी छूट गए!

*JNU విద్యార్థి సంఘం నాయకులు తీహార్ జైలు నుంచి విడుదల*ఆదివారం పటియాలా హౌస్ కోర్టు ఆదేశంతో అరెస్టు చేసిన JNUకి చెందిన 14 ...
01/03/2026

*JNU విద్యార్థి సంఘం నాయకులు తీహార్ జైలు నుంచి విడుదల*

ఆదివారం పటియాలా హౌస్ కోర్టు ఆదేశంతో అరెస్టు చేసిన JNUకి చెందిన 14 మంది విద్యార్థులను విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. వీరిలో AISA నాయకురాలు, JNUSU అధ్యక్షురాలు అదితి, ఉపాధ్యక్షురాలు గోపిక, సంయుక్త కార్యదర్శి డానిష్, మాజీ అధ్యక్షుడు నితీష్, AISA ఆల్ ఇండియా అధ్యక్షురాలు నేహా తదితరులు ఉన్నారు.

విద్యార్థులు వీసీ కులవివక్ష వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని, JNUSU ప్రతినిధుల అన్యాయ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని, UGC ఈక్విటీ నిబంధనలు అమలు చేయాలని, రోహిత్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న సమయంలో ఢిల్లీ పోలీస్, RAF దారుణంగా దాడి చేసి అరెస్టు చేశారు.

శుక్రవారం రోజే బెయిల్ మంజూరు అయినప్పటికీ “పర్మనెంట్ అడ్రస్ వెరిఫికేషన్” పేరుతో విడుదలను ఆలస్యం చేశారు. దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఈ విద్యార్థులు హాస్టల్‌లో నివసిస్తున్నారు కాబట్టి, ఆ వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల వారి స్వేచ్ఛను అన్యాయంగా నిలిపివేశారు.

కోర్టు స్పష్టంగా పేర్కొంది:
బెయిల్ మంజూరు చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు కేవలం సాంకేతిక విషయాలు మాత్రమే. అవి విద్యార్థులను అవసరంలేని కాలం పాటు జైలులో ఉంచడానికి కారణం కావొద్దు. బెయిల్ ఉద్దేశం శిక్ష విధించడం కాదు, విచారణకు హాజరు కావడం మాత్రమే అని కోర్టు తెలిపింది.

ఇది విద్యార్థి ఉద్యమానికి ఒక ముఖ్యమైన విజయం. కానీ పోరాటం ఇక్కడితో ఆగదు.

మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుంది:

UGC ఈక్విటీ నిబంధనలు మరియు రోహిత్ చట్టం అమలు చేయాలి

NEP పేరుతో తీసుకొచ్చిన నాసిరకం, విద్యను బలహీనపరచే కోర్సులను రద్దు చేయాలి

JNU వీసీ రాజీనామా చేయాలి

JNUSU ప్రతినిధుల సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలి

AISA - All India Students' Association

*దేశవ్యాప్తంగా విద్యార్థి నిరసన*📢 రోహిత్ చట్టం వెంటనే అమలు చేయాలి!📢 UGC Equity Regulations తక్షణమే రద్దు చేయాలి!📢 జేఎన్య...
28/02/2026

*దేశవ్యాప్తంగా విద్యార్థి నిరసన*

📢 రోహిత్ చట్టం వెంటనే అమలు చేయాలి!
📢 UGC Equity Regulations తక్షణమే రద్దు చేయాలి!
📢 జేఎన్యూ వైస్ చాన్సలర్ రాజీనామా చేయాలి!
📢 అరెస్టు చేసిన 14 మంది జేఎన్యూ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి!

విద్యాసంస్థల్లో కులవివక్షకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం – సమానత్వం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. జేఎన్యూలో శాంతియుతంగా లాంగ్ మార్చ్ నిర్వహించిన All India Students’ Association (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా సహా 14 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి.

ఈ చర్యలను ఖండిస్తూ, దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో AISA ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించబడింది. కులవివక్షను కప్పిపుచ్చే విధానాలకు వ్యతిరేకంగా, దళిత-బహుజన విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఈ పోరాటం కొనసాగుతుంది.

✊ విద్యలో సమానత్వం మా హక్కు!
✊ కులవివక్షకు చెక్ పెట్టాలి!
✊ ప్రజాస్వామ్య హక్కులను అణచివేత ఆపాలి!

26/02/2026

Today Com. Aditi, President JNUSU along with former JNUSU President Nitish Kumar and many students were brutally attacked by Delhi Police and detained. Delhi police shamelessly attacked many students of JNU, those who got injured by police are not provided with any treatment yet.

We demand the immediate release of all the students.

AISA

13/02/2026

Akhil Bharatiya Violence Parishad at work. Where logic ends, violence takes over.

11/02/2026

🎶 🔥 Come one, come all for the strike, For the strike of the working class! Feb 12, 2026 General Strike! Let us reaffirm our unity, and ask for what is rightfully ours!

సమానత్వానికి మద్దతుగా విద్యార్థులు–ఉపాధ్యాయులు–సామాజిక కార్యకర్తల ఐక్యం*UGC ఈక్విటీ నిబంధనల కోసం ఆల్ ఇండియా ఫోరం ప్రారంభ...
08/02/2026

సమానత్వానికి మద్దతుగా విద్యార్థులు–ఉపాధ్యాయులు–
సామాజిక కార్యకర్తల ఐక్యం

*UGC ఈక్విటీ నిబంధనల కోసం ఆల్ ఇండియా ఫోరం ప్రారంభం*

ఈక్విటీ నీ సమర్థించే విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కలిసి UGC ఈక్విటీ నిబంధనల అమలుకు మద్దతుగా ఇవ్వడం జరిగింది
ఈక్విటీ కోసం విద్యార్థులు గొంతు ఎత్తితే, మోదీ ప్రభుత్వం మరోసారి JNUని అపఖ్యాతిపాలుచేయడానికి, విద్యార్థి నాయకులను వేధించడానికి ప్రయత్నిస్తోంది.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్య వాదులు కలిసి ఏర్పడిన ఈ ఐక్య పోరాటం సామాజిక వివక్ష, భావజాల వేధింపులు, అణచివేతకు వ్యతిరేకంగా ఎద్దఎత్తున ఉద్యమం అవసరం , ఇది ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం కోసం పోరాటానికి బలం చేకూరుస్తుంది.

ప్రెస్ రిలీజ్

08.02.2026

*UGC ఈక్విటీ నిబంధనల కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, సామాజిక ఐక్య పోరాటం!*

ఢిల్లీలో “ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ – UGC నిబంధనల సమతా ఆందోళన్” ప్రారంభం!

ఫిబ్రవరి 8న ఢిల్లీలోని హెచ్‌కేఎస్ సూర్జీత్ భవన్‌లో, విపక్ష విద్యార్థి సంఘాల జాతీయ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజా మేధావులు, క్రింది స్థాయి సామాజిక ఉద్యమా నాయకులు కలిసి “ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ”ని ప్రారంభించారు.

ఈ ఫోరమ్‌లో భాగమైన సంస్థలు, నాయకులు:
డా. జితేంద్ర మీనా, డా. లక్ష్మణ్ యాదవ్, మహేష్ చౌధరీ, భన్వర్ మేఘవంశీ, JNUSU, AISA, SFI, NSUI, AISF, MSF, RYA, DSF, ASA, AIOBCSA, CRJD, Collective, BAPSA, సామాజిక న్యాయ ఉద్యమం బిహార్, గోండ్వాన గణతంత్ర పార్టీ, రిహాయి మంచ్, సోషల్ జస్టిస్ ఆర్మీ, FTII విద్యార్థి సంఘ అధ్యక్షుడు, OBC ఆరక్షణ సంగ్రహ్ సమితి, SF రాజస్థాన్–బార్మర్, JAYS మధ్యప్రదేశ్, BPVM ఉద్యమం తదితరులు.

సమావేశానికి డా. జితేంద్ర మీనా అధ్యక్షత వహించారు.
SC/ST/OBC విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఎదుర్కొంటున్న అణచివేత చరిత్రను ఆయన గుర్తుచేశారు.
“కుల వివక్ష కారణంగా తమ జీవితాలను కోల్పోయిన ఎన్నో విద్యార్థుల బాధను దృష్టిలో పెట్టుకుని UGC కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చింది. కానీ అనవసర భయం సృష్టించి, చివరకు కోర్టు ద్వారా ఆ మార్గదర్శకాలపై నిలుపుదల తెచ్చారు” అని ఆయన అన్నారు.

JNUSUకి చెందిన కామ్రేడ్ అదితి మాట్లాడుతూ, మీడియా మరియు బ్రాహ్మణవాద శక్తులు దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
“సాధారణమైన సమానత్వ చర్యను కూడా ఒక వర్గానికి ముప్పుగా చూపించారు. ‘దుర్వినియోగం అవుతుందనే’ అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి భయ వాతావరణం సృష్టించారు” అని ఆమె అన్నారు.
రోహిత్ వేముల చట్టం ఆధారంగా మరింత బలమైన ఈక్విటీ నిబంధనలు అవసరమని ఆమె స్పష్టం చేశారు.
“ఈ పోరాటంలో JNUSU ముందుండి నడుస్తుంది” అని ఆమె చెప్పారు.

ప్రొఫెసర్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, మండల్ కమిషన్ ఉద్యమ కాలాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు.
సమానత్వ చర్యలను అడ్డుకోవడంలో కోర్టుల పాత్రను విమర్శించారు.
SIR వంటి అంశాలను పట్టించుకోని కోర్టులు, EWS రిజర్వేషన్‌ను అనుమతించాయని గుర్తు చేశారు.
“కొద్ది మందితో జరిగిన UGC వ్యతిరేక నిరసనలను మీడియా భారీ ఉద్యమాలుగా చూపించింది. కానీ అలహాబాద్, పాట్నా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వందల మంది విద్యార్థులు బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే, మీడియా వాటిని పట్టించుకోవడం లేదు” అని అన్నారు.

ఈ సమావేశంలో మహేష్ చౌధరీ (అరవల్లి బచావో మంచ్), నేహా (AISA), సూరజ్ ఎలమోన్ (SFI), విరాజ్ (AISF), అఖిలేష్ కుమార్ (NSUI), క్రాంతి కుమార్ (BAPSA), హార్దిక్ (DSF), ప్రియం (Collective), అహ్మద్ సాజు (MSF), శరణ్య (AUDSC), రాజేంద్ర (OBC ఆరక్షణ సంగ్రహ్ సమితి) తదితరులు మాట్లాడారు.

JNUSU మాజీ అధ్యక్షుడు సహా పదవి నుంచి తొలగించబడిన విద్యార్థి నాయకులపై జరిగిన చర్యలను ఫోరం తీవ్రంగా ఖండించింది.
క్యాంపస్ ప్రజాస్వామ్యంపై జరిగిన నియంతృత్వ దాడికి వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటించింది.

ఫిబ్రవరి 13న దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు!

100కు పైగా క్యాంపస్‌లలో నిరసన సభలు!

UGC నిబంధనల అమలుకు మద్దతుగా ఫిబ్రవరి 13న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని ఫోరం పిలుపునిచ్చింది.
100కు పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నిరసన సభలు జరగనున్నాయి.

“ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ – UGC నిబంధనల సమతా ఆందోళన్”

UGC నిబంధనలు 2026 కోసం దేశవ్యాప్త ఉద్యమానికి వేదిక.
రోహిత్ వేముల చట్టం ఆధారంగా మరింత బలమైన UGC సామాజిక సమానత్వ నిబంధనలు అమలు చేయాలని ఫోరం డిమాండ్ చేస్తోంది.

ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ – UGC నిబంధనల సమతా ఆందోళన్

Revoke Rustication of JNUSU Office Bearers and former JNUSU President!This is nothing but throttling of voices that are ...
06/02/2026

Revoke Rustication of JNUSU Office Bearers and former JNUSU President!
This is nothing but throttling of voices that are fighting to keep the doors of knowledge open for everyone!
They have been rusticated just when JNU and other campuses are rising up against the roll back of UGC Regulations against caste discrimination!
They are demanding Rohith Act!
They are fighting against the imposition of NEP and valueless courses in JNU!
JNU VC Dhulipudi Pandit need not be taught about the strength of JNUSU!
If needed, that also can be done.

Address

26-7-13/A, Garikapati Street Gandhi Nagar
Vijayawada
520003

Website

Alerts

Be the first to know and let us send you an email when AISA Andhrapradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share