29/05/2026
*మంత్రి నారా లోకేష్ చొరవ తో మంగళగిరి లో ఏపీఎల్-2026 క్రికెట్ సందడి*
*మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జూన్ 24 నుంచి 30 వరకు ఉత్కంఠభరిత మ్యాచ్లు – ఫైనల్కు భారీ ఏర్పాట్లు*
మంగళగిరి, మే 29: క్రికెట్ అభిమానులకు పండుగలా నిలిచే GMR "APL-2026" టోర్నమెంట్కు మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. జూన్ 24 నుంచి జూన్ 30 వరకు జరుగనున్న ఈ లీగ్ మ్యాచ్లు, ఎలిమినేటర్, క్వాలిఫైయర్లు మరియు ఫైనల్ పోటీలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి.
టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు సింహాద్రి విజాగ్ లయన్స్తో తలపడనుండగా, అదే రోజు భీమవరం బుల్స్ మరియు క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు పోటీ పడనున్నాయి. వరుసగా విజయవాడ సన్షైనర్స్, కాకినాడ కింగ్స్, తుంగభద్ర వారియర్స్ వంటి బలమైన జట్లు కూడా పోటీలో పాల్గొననున్నాయి.
జూన్ 28న ఎలిమినేటర్ మరియు క్వాలిఫైయర్-1 మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 29న క్వాలిఫైయర్-2, జూన్ 30న రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఆటకు అంతరాయం కలిగితే జూలై 1ను రిజర్వ్ డేగా నిర్ణయించారు.
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తో మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియం లో జరగనున్న ఈ టోర్నమెంట్ కు భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
**************************