02/08/2026
భోగాపురం ఎయిర్పోర్టుకు భూములు సేకరించింది.. నిర్వాసితులకు పునరావాసం కల్పించింది.. రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది.. అన్నీకూడా గారి ప్రభుత్వ హయాంలోనే. వాస్తవాలు ఇవే:
* జూన్ 2020లో జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం.
* భూసేకరణ, ఆర్ & ఆర్ పూర్తి చేయడం.
* సైట్ క్లియరెన్స్, అన్ని NOCలు, భద్రతా అనుమతులు సాధించడం.
* నీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు, ఏరోనాటికల్ సేవలు, ఆర్థిక సమీకరణ వంటి మౌలిక ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం.
ముఖ్యంగా, మీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన భూసేకరణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసి, నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం:
* భూసేకరణ & ఆర్ & ఆర్ – ₹967 కోట్లు
* నీటి సరఫరా – ₹75 కోట్లు
* మౌలిక సదుపాయాలు – ₹134.5 కోట్లు
* ప్రత్యామ్నాయ రోడ్లు – ₹7.29 కోట్లు
* సబ్స్టేషన్ – ₹2.35 కోట్లు
మొత్తం సుమారు ₹1,200 కోట్లకు పైగా ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే పనులను ఆపకుండా కొనసాగించి, 2024 ఎన్నికల నాటికే రన్వే పనులను కీలక దశకు చేర్చడంతో పాటు టెర్మినల్ నిర్మాణాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్ గారి ప్రభుత్వానిదే.
ఇదంతా మీ ఘనత అని చెప్పుకోవడం క్రెడిట్ చోరీ చేయడం కాదా గారూ?