18/08/2026
* *కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి...*
*
* బర్మా కాలనీలో భూ అక్రమాలపై కలెక్టర్ గారికిl ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు..
* -* *శ్రీ కె. కె.రాజు గారు*
49వ వార్డు బర్మాకాలనీలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన గృహాలను తొలగించాలని కోరుతూ *నిరుపేద కాందీశీకుల* పోరాట ఐక్య వేదిక' చేపట్టిన అమరణ నిరాహార దీక్షకు మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,జిల్లా అధ్యక్షులు *శ్రీ కె.కె. రాజు గారు* సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కె కె రాజు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 49వ వార్డులో బర్మా కాలనీ లోని ప్రభుత్వ భూమిని ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని కాంధీశీకుల పోరాట ఐక్యవేదిక సభ్యులుతో కలిసి స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే కనీసం ఈరోజు వరకు పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా అధికార పార్టీకి వత్తాసు పలకడం చాలా దారుణమని అన్నారు..
కాలి స్థలంలో చిన్న గుడిసి కట్టుకుంటేనే జీవీఎంసీ సిబ్బంది గానీ రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడ వాలిపోయి హడావుడి చేసి కూల్చేస్తారు చేస్తారు అలాంటది నగరం నడిబొడ్డున ఇంత స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అంటే ఇక్కడ ఎంత అవినీతిమయం జరుగుతుందో ప్రజలు అందరూ గమనించాలని అన్నారు..
మా మీద మా పార్టీ నాయకులు మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ కూటమి నాయకులకి ఒకటే సవాలు చేస్తున్న మేము గాని మా పార్టీ కార్యకర్తలు గాని ఒక గజం స్థలం ఆక్రమించాని నిరూపిస్తే మీకు నచ్చిన కేసులు పెట్టుకోవచ్చని ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు..
మీరు చేస్తున్న తప్పులను మేము ఎత్తిచూపితే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తే మమ్మలిని అరాచక శక్తులని రౌడీలని చిత్రీకరిస్తున్నారని మీరు ఎన్ని నిందలు వేసిన ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు..
ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన గృహాలను తొలగించాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు...
ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తిప్పల దేవన్ రెడ్డి, SEC సభ్యులు కట్టమూరి సతీష్,బాణాల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు అల్లు శంకర్ రావు,సాడి పద్మా రెడ్డి, బర్కత్ ఆలీ, వార్డుప్రెసిడెంట్స్ బొడేటి కిరణ్, బీశెట్టి ప్రసాద్, జక్కంపూడి సత్యనారాయణ, డోప్ప శ్రీను,లాలం వేణు, ఎర్రం శెట్టి శ్రీను,సీనియర్ నాయకులు అంబటి శైలేష్, బోగవల్లి గోవింద్, పైడి శ్రీను, తుల్లీ చంద్రశేఖర్,కరి రామారెడ్డి, సబ్బవరపు శ్రీను,మువ్వల సంతోష్, శ్రవణ్, జాయ్, సారిపల్లి సంతోష్, భద్రి, శివరాం, సురేష్, ఢిల్లీ రావు, విమల్, అశోక్, గుదే రాజు, బాలాజీ,తదితరులు పాల్గొన్నారు