17/05/2026
*ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం...*
*పార్టీ ఐడి కార్డు తో ప్రతి కార్యకర్తకు గుర్తింపు...*
*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు..*
ఈరోజు 25వార్డు సీతంపేట వెన్నెల ఫంక్షన్ హల్లో 25వార్డు అధ్యక్షుడు మువ్వల పోలరావు గారి ఆధ్వర్యంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 25వ వార్డు నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది..
ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు* ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులు,కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ కె.కె.రాజుగారు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజలు నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని అన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో వేలకోట్లు ప్రజాధనంను కూటమి ప్రభుత్వం లూటి చేస్తుంది అని మండిపడ్డారు. రానున్న కాలంలో వైసీపీ క్యాడర్ నేరుగా జగన్ గారితో మమేకం అయ్యే విధముగా పార్టీ కమిటీ లు నిర్మాణం చేబడుతుంది అని, వైసీపీ లో ప్రతి కార్యకర్తకు సమూచిత స్థానం ఉంటుంది అని అన్నారు. వార్డులో ఉన్న ప్రతి ఒక వైసీపీ కార్యకర్త కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరించి రానున్న రోజుల్లో శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ జోన్-1 జి.వి రవిరాజు,యం.సునీల్,కర్రీ మురళీకృష్ణ రెడ్డి,దల్లి రామకృష్ణ రెడ్డి, భోగవల్లి గోవింద్, శ్రావణ్ కుమార్,నూకరాజు,మువ్వల సంతోష్, సారిపల్లి సంతోష్, గుదే రాజు,హరికృష్ణ, బోర గోవింద్,స్వర్ణపూడి సత్యనారాయణ,జోరీగల గణేష్ బొమ్మాలి రవి, అప్పలరాజు,నాగు, పవన్,జామి రాజు, అశోక్,రవీంద్ర, శివ,ఉమా, వీరమ్మ, మణి, పావని ముఖ్య నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు