Vizianagaram District Police

Vizianagaram District Police The police are the public and the public are the police;

/మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణే ప్రధమ కర్తవ్యంగా జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు/విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్...
04/06/2026

/మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణే ప్రధమ కర్తవ్యంగా జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు/
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జిల్లా వ్యాప్తంగా మహిళలు మరియు చిన్నారుల భద్రత, రక్షణ, సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ జూన్ 4న ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలో మహిళలు, బాలికలు, చిన్నారులు భయరహిత వాతావరణంలో జీవించేందుకు అవసరమైన అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను భాగస్వాములను చేయడం, చట్టాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్వయం సహాయక సంఘాలు, మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు, బాలికలు, చిన్నారులు తమ హక్కులు, భద్రతా చర్యలు, చట్టపరమైన రక్షణలు, అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే సహాయ సేవల గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలపై జరిగే వేధింపులు, గృహ హింస, స్టాకింగ్, ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు, బాధితులు ఫిర్యాదు చేయడానికి ఉన్న సౌకర్యాలు వివరిస్తూ, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, చట్టం బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ముఖ్యంగా పోక్సో చట్టం గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అదే విధంగా ప్రతి మహిళ తమ ఫోనులో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో పోలిసుల సేవలను శక్తీ యాప్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. విద్యార్ధినులు లక్ష్యాలను నిర్దేసించుకొని వాటిని చేరుకొనేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రేమ వైపు ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లాలో ఉండే అన్ని విధ్యసంస్థలలో విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించి, స్వీయ రక్షణ పద్ధతులపై శిక్షణ అందించామని, ప్రమాదకర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై నిపుణుల ద్వారా ప్రదర్శనలు నిర్వహించామని, ఈ శిక్షణ కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం శక్తీ టీంలను ఏర్పాటు చేసామని, ఈ బృందాల ద్వారా నిరంతరం విద్యాసంస్థలు మరియు రద్దీ ప్రాంతాల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, ప్రత్యేక నిఘా ఉంచడం, మహిళలకు మరియు బాలికలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల పట్ల జిల్లా పోలీసు శాఖ సున్నా సహన విధానాన్ని (Zero Tolerance Policy) అవలంబిస్తోందని స్పష్టం చేశారు. అదేవిధంగా, మహిళలు మరియు చిన్నారులకు అందుబాటులో ఉన్న అత్యవసర సేవలు, హెల్ప్‌లైన్ నంబర్లు 1098, 181 మహిళా సహాయ కేంద్రాలు, బాధితుల పునరావాస సేవలు వంటి అంశాలపై కూడా అవగాహన కార్యక్రమాలు చేపదుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారులపై ఎలాంటి నేరాలు, వేధింపులు, అన్యాయాలు జరిగినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయిల్ 100/112 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసు శాఖ బాధితుల గోప్యతను కాపాడుతూ, చట్టపరమైన సహాయం అందిస్తూ, వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల సహకారం, అప్రమత్తత మరియు భాగస్వామ్యంతో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయగలమని జిల్లా ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.

//జిల్లా పోలీసు కార్యాలయం,//
//విజయనగరం.//



Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space





















||పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన 11మంది పేకాటరాయుళ్లు||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్గజపతినగరం మండలం మరుపల్లి...
02/06/2026

||పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన 11మంది పేకాటరాయుళ్లు||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ శివార్లలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 11మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి బెట్టింగులకు వినియోగిస్తున్న రూ.1,73,830/- ల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జూన్ 2న తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - తమకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ శివార్లలోని మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారన్నారు. మామిడి తోటలో పేకాట ఆడుతున్న 11మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 9 సెల్ ఫోన్లు, బెట్టింగులకు వినియోగిస్తున్న రూ.1,73,830/- నగదు సీజ్ చేసి, తదుపరి చర్యలు నిమిత్తం గజపతినగరం పోలీసులకు అప్పగించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

జిల్లాలో పేకాట, కోడిపందాలు, గొర్రి పందాలు, బెట్టింగులు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే దాడులు తప్పవని, అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపైనా, పాల్గొన్న వారిపైన కఠిన చర్యలు తప్పవన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112/100 కు అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజ్ఞప్తి చేశారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం||



Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space





















01/06/2026

మార్ఫింగ్ ఫోటోలు పంపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 1930కు కాల్ చేయండి.



Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space
Cyber Dost





















||గోశాల ముసుగులో పశువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టిన గుర్ల పోలీసులు||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్🌀 పోలీసుల వ...
01/06/2026

||గోశాల ముసుగులో పశువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టిన గుర్ల పోలీసులు||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

🌀 పోలీసుల విచారణలో ఓంశక్తి గోశాల నిర్వాహకులు పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

🌀 ఓంశక్తి గోశాలలో పశువుల సంరక్షణకు కనీస నిబంధనలు పాటించడం లేదని గుర్తించామన్న జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్,ఐపీఎస్

🌀 గోశాల నిర్వహణ పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

విజయనగరం జిల్లా గుర్ల మండలం గుజ్జింగవలసలోని ఓంశక్తి గోశాల నిర్వహణ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న గోశాల నిర్వాహకుడు అట్టాడ రామకృష్ణపై విచారణ చేపట్టి, పశువుల అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా గుర్తించి, అతడిపై గుర్ల పోలీసు స్టేషన్ లో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జూన్ 1న తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎన్ మాట్లాడుతూ - గుర్ల మండలం గుజ్జింగవలసలో ఓంశక్తి గోశాల నిర్వహిస్తున్న అట్టాడ రామకృష్ణపై ఇటీవల కొన్ని ఫిర్యాదులు రావడంతో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులును విచారణ చేపట్టాలని ఆదేశించామన్నారు. డీఎస్పీ రాఘవులు, చీపురుపల్లి సిఐ జి.శంకరరావు, గుర్ల ఎస్ఐ పి.నారాయణరావు విచారణ చేపట్టగా ఓంశక్తి గోశాల నిర్వాహకుడు అట్టాడ రామకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లుగా వెల్లడైందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో వశువుల అక్రమ రవాణ నియంత్రణకు చర్యలు చేపట్టి, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి, పోలీసులు స్వాధీనం (పట్టుకున్న) చేసుకున్న వశువులను సంరక్షించేందుకు గుజ్జింగవలస గ్రామంలోని ఓంశక్తి గోశాలకు అప్పగిస్తున్నామన్నారు. కానీ, సదరు గోశాల నిర్వాహకుడు అట్టాడ రామకృష్ణ పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులతో కుమ్మక్కై, వివిధ పోలీసు స్టేషన్ అధికారులు సీజ్ చేసి, అప్పగించిన పశువులను తిరిగి పశువుల అక్రమ రవాణదారులకే విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందన్నారు. అంతేకాకుండా, గోశాలలో పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన రక్షణ చర్యలు తీసుకోకుండా పశువులకు అవసరమైన నీరు, ఆహారం వంటి కనీస అవసరాలు తీర్చకుండా, సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా, నిబంధనలను తుంగలో త్రొక్కినట్లుగా గుర్తించామన్నారు. నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న గోశాల నిర్వాహకుడు అట్టాడ రామకృష్ణ పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని, గోశాల అనుమతులు రద్దు చేసేందుకు సిఫార్సు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఓంశక్తి గోశాలలో ఉన్న 79 పశువులను సీజ్ చేసి, గరివిడిలో నూతనంగా నిర్మించిన మరో గోశాల తరలించి, వాటి సంరక్షణ బాధ్యతలను అక్కడ నిర్వాహకులకు అప్పగించామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

గోశాల నిర్వహణ ముసుగులో అక్రమాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారంను డయల్ 112/100 కు అందించాలని, పశువుల అక్రమ రవాణ నియంత్రణకు పోలీసుశాఖ చేవడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||



Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space





















30/05/2026

||పగటి నేరాలకు పాల్పడే నిందితులు అరెస్టు - చోరీ సొత్తు స్వాధీనం||
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

బొబ్బిలి, బాడంగి, సీతానగరం, ఎస్.కోట, జామి, భోగాపురం పోలీసు స్టేషను పరిధిలో పగటి దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను, ఒక రిసీవరును అరెస్టు చేసి, వారి వద్ద నుండి సుమారు 26 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయంలో మే 30న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వెల్లడించారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - రామభద్రపురం మండలం రొంపిల్లి గ్రామానికి చెందిన (ఎ-1) పువ్వల మణికంఠ (22 సం.లు) తే.30-05-2026 దిన మెట్టవలస బస్టాపు వద్ద అనుమానస్పదంగా సంచరిస్తుండగా బొబ్బిలి సిఐ కే.నారాయణరావు మరియు సిబ్బంది అదుపులోకి తీసుకొని, విచారణ చేయగా నిందితుడు వువ్వల మణికంఠ (22 సం.లు) ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ గా పని చేస్తూ, పగటి సమయాల్లో బొబ్బిలి, బాడంగి, సీతానగరం మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ వస్తువలను డెవరీ చేస్తూ, ఆయా ప్రాంతాలపై మంచి అవగాహన కలిగి ఉండేవాడన్నారు. గ్రామస్థులు వగటి సమయాల్లో వ్యవసాయ పనులకు, చెరువు పనులకు వెళ్ళడం, వారిండ్లలో ఎవ్వరూ లేకపోవడం గమనించి, ఆయా ఇండ్లలో 2023 సం. నుండి చోరీలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో గుర్తించామన్నారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను నిందితుడు మణికంఠ సాలూరులో బంగారు షాపు యజమాని (ఎ-2) కానూరు బాలేశ్వరరావుకు విక్రయిస్తు, వచ్చిన డబ్బులను తన వ్యసనాలకు, అలవాట్లుకు ఖర్చు చేసేవాడన్నారు. నిందితుడు పువ్వల మణికంఠ ఇప్పటి వరకు బొబ్బిలి మండలంలో నాలుగు, బాడంగి మండలంలో నాలుగు, సీతానగరంలో రెండు పగటి దొంగతనాలకు పాల్పడినట్లుగా విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ పది కేసుల్లో ప్రధాన నిందితుడు అయిన పువ్వల మణికంఠ, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన (రిసీవర్) లను అరెస్టు చేసి, వారి వద్ద నుండి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

అదే విధంగా ఎస్.కోట మండలం పోతనాపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న చలుమూరి కుమారి ఇంటిలో మే 28న గుర్తు తెలియని దొంగలు చొరబడి, తలుపు తాళాలు పగులగొట్టి, దొంగతనంకు పాల్పడినట్లుగా ఎస్.కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినారన్నారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నేరస్థలంలో సేకరించిన ఆధారాలతో ఎస్.కోట రైల్వే స్టేషను ప్రాంతంలో మే 30న అనుమాన స్పదంగా సంచరిస్తున్న పెందుర్తి మండలం నరవ గ్రామానికి చెందిన బండి అప్పారావు (28సం.లు) అనే వ్యక్తిని కొద్ది గంటల్లోనే అరెస్టు చేసి, అతడి వద్ద నుండి సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

అదే విధంగా విజయనగరం నుండి అనకాపల్లి వెళ్ళేందుకు ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్న అనకాపల్లికి చెందిన బుద్ధ గాయత్రి బ్యాగులో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకొని పోయినట్లుగా భీమసింగి జంక్షను వద్ద గుర్తించి, జామి పోలీసులకు ఫిర్యాదు చేయగా, జామి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఈ కేసులో కొత్తవలస 202 కాలనీకి చెందిన రావుల పార్వతి (30సం.లు) అనే మహిళను చోరీకి పాల్పడినట్లుగా గుర్తించి, రెండు తులాల బంగారు వస్తువులను జామి పోలీసులు రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

ఈ కేసుల్లో రికవరీ చేసిన బంగారు వస్తువులను కోర్టు అనుమతితో బాధితులకు త్వరలో అందజేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులను చేధించుటలో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఎన్. రాఘవులు, బొబ్బిలి డిఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి సీఐ కే.నారాయణరావు, ఎస్.కోట సిఐ వి.నారాయణమూర్తి, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, జామి ఎస్సై వీర జనార్ధన్ పాల్గొన్నారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||



Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space





















||క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే.. కేసులు తప్పవు||- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్🌀 జీవితాలను నాశనం చేసే బె...
30/05/2026

||క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే.. కేసులు తప్పవు||
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

🌀 జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ ల జోలికి పోతే.. జైలే దిక్కని యువతకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

🌀 ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

ఐ.పి.ఎల్. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బెట్టింగు రాయుళ్ళును, ఆన్-లైన్, ఆఫ్ లైన్ బెట్టింగు ముఠాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మే 30న మరోసారి తీవ్రంగా హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - ఐపిఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి డబ్బులు నష్టపోయే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్రికెట్ బెట్టింగులను నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమ స్టేషను పరిధిలోని లాడ్జిలు, హాస్టల్స్, విద్యార్థులు, యువత ఎక్కువగా గుమిగూడే కళాశాలలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. తనిఖీలు సమయంలో యువత మొబైల్ ఫోనులను తనిఖీ చేసి బెట్టింగు యాపులను తొలగించాలన్నారు. బెట్టింగులకు పాల్పడడం వలన కలిగే అనర్ధాలను యువతకు వివరించాలన్నారు. బెట్టింగులకు పాల్పడటం వలన ఆర్థికంగా నష్ట పోవడంతోపాటు, విద్యాభ్యాసం దెబ్బతింటుందన్న విషయం పట్ల యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యువత క్రికెట్ బెట్టింగు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్నారు. అవసరాలకు డబ్బులు చాలక రుణాల కోసం అనధికార లోన్ యాప్ లను ఆశ్రయిస్తున్నారన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మంచి లక్ష్యాలతో ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఆన్ లైను క్రికెట్ బెట్టింగు యాప్ లతో డబ్బులు సంపాదించడం సాధ్యం కాదన్నారు. యాప్ తయారీదార్లు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే బెట్టింగు యాప్ లను రూపొందించి, యువతను ఆకర్షిస్తారన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడి, పోలీసులకు పట్టుబడి, పోలీసు స్టేషన్లులో కేసులు నమోదైతే, ఉద్యోగాలు పొందే అవకాశం ఉండదన్నారు. కావున, జీవితాలను నాశనం చేసే ఆన్ లైను /ఆఫ్ లైను బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.

జిల్లాలో క్రికెట్ బెట్టింగును తీవ్రమైన నేరంగా పరిగణించి, నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, సమాచారం సేకరించి, ఆకస్మిక దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్రికెట్ బెట్టింగులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100/112 లేదా స్థానిక పోలీసు అధికారులకు అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||


Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space





















//గంజాయి నియంత్రణ మరియు నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలి//విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐఎఎస్✳️ బహుముఖ వ్యూహాలతో జ...
30/05/2026

//గంజాయి నియంత్రణ మరియు నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలి//
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐఎఎస్

✳️ బహుముఖ వ్యూహాలతో జిల్లాలో గంజాయిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు

✳️ మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

✳️ గంజాయి అక్రమ రవాణకు సంబందించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కు అందించాలన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

✳️ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు దాడులను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ

✳️ గంజాయి డిటెక్షన్ కిట్స్ ఉపయోగించి గంజాయి సేవించిన వారిని నిమిషాల్లో నిర్దారిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన, నియంత్రణకు పోలీసు, రెవెన్యూతోపాటు ఇతర లైను శాఖలకు చెందిన అధికారులు సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ఐపిఎస్, మే 30న పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మరియు జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నార్కోటిక్ కో-ఆర్డినేషను కమిటీ (NCORD) సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్సు ద్వారా మే 30న నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లాలో గంజాయి వినియోగం చాలా వరకు తగ్గిందని, గంజాయి సరిహద్దు రాష్ట్రాలు ఒడిస్సా, చత్తీస్ ఘడ్ నుండి మన జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణ జరుగుతుందని, వాటి నియంత్రణకు చెక్ పోస్టులను బలోపేతం చేసామని, సమాంతరంగా విస్తృతంగా తనిఖీలను కూడా ఆకస్మికంగా చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, గంజాయి వినియోగం, అక్రమ రవాణే నియంత్రణే లక్ష్యంగా 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' కార్యక్రమంతో ప్రతి వారం జిల్లాలో ఎంపిక చేసిన గ్రామంలో కార్టన్ అండ్ సెర్చ్ తనిఖీలను చేపడుతున్నామన్నారు. ఈగల్ బృందాలు, స్థానిక పోలీసులు తరుచూ స్కూల్స్, కాలేజీలను సందర్శించి, గంజాయి వినియోగం వలన కలిగే అనర్దాలను వివరిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు, యువతకు, విద్యార్థులకు వివరించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. డ్రగ్స్ అలవాటుపడిన వ్యక్తులు కొన్ని మత్తు కలిగించే మందులను కొనుగోలు చేసి, వాటిని వినియోగిస్తున్నందున డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి పోలీసు అధికారులు, సిబ్బంది మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభాలను ప్రజలకు వివరిస్తూనే, మరోవైపు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా జిఆర్పీ, ఈగల్ వంటి ఇతర విభాగాలతో ట్రైన్ లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇటీవల ఒడిస్సా నుండి విశాఖపట్నం వైపు వెళుతున్న ట్రైనులో తనిఖీలు చేపట్టగా, “రుద్ర” అనే నార్కోటిక్ డాగ్ సుమారు 14కి.ల గంజాయిని కనిపెట్టిందని జిల్లా ఎస్పీ తెలిపారు. తరుచూ గంజాయి నేరాలలో పట్టుబడిన 10మంది నేరస్తులపై పిట్ ఎన్దిపిఎస్ క్రింద సంవత్సరం పాటు జైలుకు పంపడం జరిగిందని తెలిపారు. గంజాయిని కట్టడి చేసేందుకు జిల్లాలో నిరంతరం పని చేసేందుకు ఐదు పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన నిందితుల ఆస్తులను అటాచ్ చేసామన్నారు. గంజాయికి అలవాటుపడిన వ్యక్తులను గుర్తించి, వారికి చికిత్స అందించేందుకు డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ, నిర్మూలనకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని, జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ఇతర శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ - జిల్లాను గంజాయిరహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి, వాటి దుష్పప్రభావాల పట్ల పోలీస్ శాఖతో పాటుగా మిగతా శాఖలు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో తరుచుగా సమావేశాలు నిర్వహించి డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలను విద్యార్ధులకు, తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు పోలీసు వారితో పాటు ఆర్టీఎ, జిఆర్పీ, డ్రగ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర డిపార్టుమెంట్స్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు.

ఈ జూమ్ మీటింగులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఈగల్ మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

//జిల్లా పోలీసు కార్యాలయం,//
//విజయనగరం.//



Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space





















//విధుల నుండి తాత్కాలికంగా హెడ్ కానిస్టేబులు తొలగింపు//విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్పని చేస్తున్న చోట తోటి ...
29/05/2026

//విధుల నుండి తాత్కాలికంగా హెడ్ కానిస్టేబులు తొలగింపు//
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

పని చేస్తున్న చోట తోటి మహిళా పోలీసు ఉద్యోగులు మరియు అధికారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఫోనులో అసభ్యకర సందేశాలను పంపడం, పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించిన తెర్లాం హెడ్ కానిస్టేబులు ఎం.సురేష్ కుమార్ ను తాత్కాలికంగా (సస్పెండ్) విధుల నుండి తొలగించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మే 29న ఒక ప్రకటనలో తెలిపారు.

ఎం.సురేష్ కుమార్ అనే హెడ్ కానిస్టేబులు గతంలో పోలీస్ కంట్రోల్ రూమ్ మరియు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో పనిచేసి ఇటీవల తెర్లాం పోలీస్ స్టేషన్ కు బదిలీ మీద వెళ్ళాడని తెలిపారు. ఇతను పోలీస్ కంట్రోల్ రూములో పని చేసే సమయంలో మరియు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో పని చేసే సమయంలో తోటి మహిళా ఉద్యోగులకు మరియు అధికారులకు ఫోనులో అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని, అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, డిపిటిసి సిఐ పిలిచి మందలించినా తన ప్రవర్తనను మార్చుకోలేదని తెలిపారు. అంతేకాకుండా అతని మొదటి భార్య ఉంటుండగా మరో మహిళను పెళ్లి చేసుకొని మోసం చేసాడని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు ఎం.సురేష్ కుమార్ పై విచారణకు ఆదేశించారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. విచారణలో ప్రస్తుతం తెర్లాం పోలీసు స్టేషనులో హెడ్ కానిస్టేబులుగా పని చేస్తున్న ఎం.సురేష్ కుమార్ పై మోపబడిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో సదరు హెడ్ కానిస్టేబులుగా ఎం.సురేష్ కుమార్ ను విధుల నుండి తాత్కాలికంగా తొలగిస్తూ (సస్పెండ్) జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఉత్తర్వులు జారీ చేసారు.

విధి నిర్వహణలో పోలీసు ఉద్యోగులు నిష్పక్షపాతంగా, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించినా, నిబంధనలు ఉల్లంఘించినా అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ హెచ్చరించారు.

//జిల్లా పోలీసు కార్యాలయం,//
//విజయనగరం.//


Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space






















29/05/2026

||'ఆపరేషన్ దండయాన' తో మహిళా నేరాలపై జీరో టాలరెన్స్||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జిల్లాలో మహిళలు, బాలికల సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యతను కల్పిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాల్లో నేరస్థులను అరెస్ట్ చేసి, త్వరితగతిన శిక్షింపబడే విధంగాను, నిందితులపై నిఘా పెట్టేందుకు మరియు స్పీడు ట్రయల్ మానిటరింగు చేసేందుకు 'ఆపరేషన్ దండయాన' ను జిల్లాలో అమలు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మే 29న తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - బాలలు, మహిళల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తూ జిల్లాలో 'ఆపరేషన్ దండయాన' ను అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, బాలలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహ హింస, పోక్సో తదితర కేసుల్లో నేరస్థులపై నిఘా మరియు నేరాల నియంత్రణ, ఆయా కేసుల్లో త్వరితగతిన కోర్టుల్లో విచారణ పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 'ఆపరేషన్ దండయాన' కార్యక్రమాన్ని రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు మరియు మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజిపి శ్రీమతి బి.రాజకుమారి గారు ఇటీవల ప్రారంభించారన్నారు. మహిళలపై జరిగే నేరాలపై 'జీరో టాలరెన్స్ పాలసీ' విధానం అనుసరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ తరహా కేసుల్లో సత్వర విచారణ, నేరస్థులకు కఠిన శిక్షలు విధించడం, నేరస్థుల కదలికలపై నిఘా పెట్టడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్లో ప్రతీ కేసులో 60 రోజుల్లోగా అభియోగ పత్రం దాఖలు చేయడం, సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి, శిక్షలు విధించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. బాధిత మహిళలకు ఎన్జీవోల సహకారంతో కౌన్సిలింగు, న్యాయ సహాయం అందించడంతోపాటు, పునరావృత నేరస్థులు, అనుమానితులపై ఎస్.ఓ.ఎస్. (సెక్సువల్ అఫెండర్) షీట్లు ప్రారంభంచి, వారిపై నిఘా పెట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో 'నైబర్ హుడ్ వాచ్' అమలు చేసి, జియో ట్యాగింగు ద్వారా నిందితులపై నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. నేరస్థుల్లో పరివర్తన తీసుకొని వచ్చేందుకు 'పరివర్తన' సదస్సులు కూడా గత 15 రోజులుగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు మరియు బాలల రక్షణ కల్పించే చట్టాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని, మహిళలపై జరిగిన దాడుల్లో ఇటీవల న్యాయస్థానాలు వెల్లడించిన తీర్పులను పాఠశాలలు, కళాశాలల్లోను, గ్రామాల్లోను తెలియజేస్తూ విద్యార్ధిని, విద్యార్థులకు, ప్రజలకు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోక్సో కేసుల్లో నిందితులు చాలా వరకు బాధితుల ఇంటి చుట్టూ ఉన్నవారు, దగ్గరి బంధువులే నేరస్థులు అయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, తమ పిల్లలను ఒక కంట కనిపెడుతుండాలని తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ తరహా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేటట్టు 'కన్విక్షన్ బేస్డ్ పోలీసింగు' విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతీ బాధితురాలికి న్యాయం జరిగే వరకు 'పరేషన్ దండయాన' కొనసాగుతుందని, మహిళలు, బాలికల భద్రత కోసం జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

జిల్లాలో 2025 సం.లో 42 క్రైం ఎగినిస్ట్ వుమన్ మరియు చిల్డ్రెన్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, వాటిలో మూడు కేసుల్లో జీవిత ఖైదు, 13 కేసుల్లో 20 సం. లుకు పైబడిన కఠిన కారాగార శిక్ష, 6 కేసుల్లో 7 సం.లు పైబడి, 20 కేసుల్లో 5 సం.లకు లోబడి శిక్షలు పడ్డాయన్నారు. 2026 సం.లో ఇప్పటి వరకు 20 క్రైం ఎగినిస్ట్ వుమన్ మరియు చిల్డ్రన్ కేసుల్లో నిందితులు శిక్షింపబడగా, వాటిలో రెండు కేసుల్లో జీవిత ఖైదు, 8 కేసుల్లో 20 సం.లకు పైబడిన కేసుల్లోను, ఒక కేసుల్లో 7సం.లకు పైబడి, 9 కేసుల్లో 5 సం.లకు లోబడి నిందితులకు శిక్షలు విధించ బడ్డాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||


AAndhra Pradesh PoliceDDgp Andhra PradeshAAP Police Space





















//మత సామరస్యానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండగ//విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*️⃣ బక్రీద్ పండ...
28/05/2026

//మత సామరస్యానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండగ//
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

*️⃣ బక్రీద్ పండగ సందర్భంగా హిందూ ముస్లిం సోదరుల మధ్య పెల్లుబికిన సోదర భావం, స్నేహం

*️⃣ జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు

*️⃣ జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో భద్రతను సిసి కెమెరాలు, డ్రోన్ లతో పర్యవేక్షించిన పోలీసు అధికారులు

జిల్లాలో బక్రీద్ పండగ హిందూ-ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మే 28న తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ - బక్రీద్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలిచ్చాయని అన్నారు. బక్రీద్ పండగను దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, భద్రత ఏర్పాట్లును సంబంధిత పోలీసు అధికారులు సిసి కెమెరాలు, డ్రోన్ లతో పర్యవేక్షించారు. మసీదుల వద్ద ప్రార్ధనలకు విచ్చేసిన ముస్లిం సోదరులకు హిందూ సోదరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. కొన్ని మసీదుల వద్ద హిందువులు, ముస్లింలు సోదర భావంతో ఒకరినొకరు అలింగనం చేసుకొని, శుభాకాంక్షలు తెలుపుకొన్నారన్నారు. పట్టణంలో ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్ లతో నిఘా ఏర్పాటు చేసి, ప్రార్ధనలకు వచ్చే ముస్లిం సోదరుల వాహనాల వలన ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమని, బక్రీద్ పండగ రోజున హిందూ-ముస్లిం సోదరులు ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకొంటూ, శుభాకాంక్షలు తెలుపుకొంటూ మతసామరస్యానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ మసీదుల వద్ద సంబంధిత సిఐలు, ఎస్ఐలు భద్రత విధులు నిర్వహించగా, డిఎస్పీలు బందోబస్తు, భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించారు.

//జిల్లా పోలీసు కార్యాలయం,//
//విజయనగరం.//


Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space






















Address

District Police Office
Vizianagaram
535003

Alerts

Be the first to know and let us send you an email when Vizianagaram District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vizianagaram District Police:

Share