22/08/2024
బౌద్ధంలో బోధిసత్వ కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది.. బౌద్ధాన్ని సంరక్షించే వారిని బోధిసత్వ అని పిలుస్తారు..
చరిత్రలో చూస్తే బోధిసత్వలు వందల సంఖ్యలో ఉన్నారు.. ఉదాహరణకు కొన్ని పేర్లు మీకు చెప్తాను.. పురుషులలో..వజ్రపాణి,పద్మపాని,దమ్మపాని.. మహిళలలో మంజు శ్రీ,హారిక,హారతి ఇలా చాలామంది ఉన్నారు.. వారు ఎవరో కాదు నాగజాతి రాజవంశీయులు.. బౌద్ధం నాగజాతి నుండి మొదలు కావడం కూడా విశేషం..
మనం చరిత్రలో చూసుకుంటే మొదటి బుద్ధుడు తనహంకర్ కూడా ఒక రాజవంశం నుంచి వచ్చిన వారే.. ఈ విషయాన్ని అఖండ భారత దేశ చరిత్ర రెండవ భాగంలో వివరంగా చూపించడం జరిగింది.. చూడని వారు ఉంటే యూట్యూబ్ లో వెళ్లి "My Quest for Buddhism" అని టైప్ చేసి చూడండి.
కాలక్రమేన ఈ బోధిసత్వాలు ఎలా రూపాంతరం చెందారంటే..?
మనదేశంలో శిల్ప సంపద రానంతవరకు బౌద్ధానికి ఎక్కడ ఇబ్బంది కలగలేదు.. రాజ్యాలకు రాజ్యాలకు యుద్ధాలు జరుగుతున్నప్పటికీ బౌద్ధ విహారాలు మందిరాల జోలికి వచ్చేవారు కాదు వాటిని పవిత్రంగా చూసేవారు.. గెలిచిన రాజులు బౌద్ధ విహారాలకు నిధులు కేటాయించేవారు.. ఈ కాలాన్ని హీనయానంగా బౌద్ధంలో ప్రస్తావించారు..
కానీ ఒకటో శతాబ్దం కుషాను రాజవంశం ద్వారా గాంధార శిల్పకళ వచ్చిన తర్వాత బౌద్ధాన్ని శిల్పాల రూపంలో అందులోనూ బోధిసత్వాలను కూడా విగ్రహాలు చెక్కించడం మొదలైంది.. ఈ కాలాన్ని మహాయానంగా బౌద్ధంలో ప్రస్తావించారు.
అది కాస్త ఐదవ శతాబ్దం వచ్చేసరికి వజ్రయాన కల్చర్ గా రూపాంతరం చెంది బుద్ధుడు బుద్ధుడితోపాటు బోధిసత్వాలు వారితోపాటు రాజవంశాల విగ్రహాలు కూడా చెక్కించడం మొదలైంది..
ఎప్పుడైతే రాజవంశీయులు బౌద్ధ విహారాలలో విగ్రహాలు చెక్కించుకోవడం మొదలైందో రాజ్యాల మధ్యన యుద్ధాలు జరిగే సమయంలో రాజా మందిరాలతోపాటు బౌద్ధ విహారాలలో రాజవంశీల విగ్రహాలు ఉండటంవల్ల వాటిని కూడా ధ్వంసం చేయడం మొదలైంది.. ధ్వంసం తో పాటు అక్కడ ఉన్న సంపదను కూడా దోచుకోవడం మొదలైంది..
ఈ క్రమంలోనే బోధిసత్వాలపైన విపరీతమైన ప్రభావం పడింది.. బౌద్ధ మందిరాలను అక్కడ ఉన్న ధన బండారాన్ని కాపాడడానికి ఎందరో బోధిసత్వులు ప్రాణ త్యాగాలు చేశారు.
బౌద్ధాన్ని ఒక మార్గంగా ఉంచకుండా బౌద్ధ విహారాల్లో కూడా రాజుల శిల్పాలు చెక్కించడం వల్ల బౌద్ధం పతనానికి నాంది పడిందని చెప్పాలి..గెలిచిన రాజు ఓడిపోయిన రాజు యొక్క సంపదను వారి యొక్క ఉనికి లేకుండా చేసే క్రమంలో విహారాలను కూడా ధ్వంసం చేయడం.. ఓడిన రాజులు నిర్మించిన బౌద్ధ విహారాలకు నిధులు ఇవ్వకుండా అటువైపు ప్రజలని వెళ్లకుండా చేయడం కూడా జరిగేది.. ఈ సాంప్రదాయము చాళుక్యులు మరియు పల్లవుల కాలంలో మొదలైంది.
బాదామి గుహలలో చూస్తే అడవి పంది అవతారంతో ఉన్న చాళుక్య రాజు తన కాళ్ళ కింద నాగుపాము తలతో ఉన్న ఒక రాజుని తొక్కుతున్నట్టు.. మరో చేత నాగజాతి యువరాణిని ఎత్తుకొని వెళుతున్నట్టు శిల్పాలు చూడవచ్చు.. ఈ విధంగా గెలిచినవారు ఓడిన వారిని బౌద్ధ విహారాలలో హీనంగా శిల్పాలు చెక్కించే సంస్కృతి మొదలైంది..
ఇలా రాజ్యాల మధ్యన ఆధిపత్య పోరులో బౌద్ధాన్ని కాపాడుకునే ప్రధాన పాత్ర పోషించింది బోధిసత్వులె.. వజ్రయానం నుండి బ్రాహ్మణులు రాకతో బౌద్ధం కాస్త తాంత్రిక యానంగా మారిన తర్వాత కూడా బోధిసత్వాలు వివిధ పేర్లతో కొనసాగారు.. వారిని కాలభైరవులు వీరభద్రులు వివిధ పేర్లతో పిలువబడుతున్నారు.. శివునికి (బుద్ధునికి) అంగరక్షకులుగా సేవకులుగా పిలువబడుతున్నారు.
... Bandapalli Shiva Reddy.