DPRO Wanaparthy

DPRO Wanaparthy INFORMATION & PUBLIC RELATIONS DEPARTMENT

తేదీ : 11-04-2026           వనపర్తి జిల్లా          *ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యసన చ...
11/04/2026

తేదీ : 11-04-2026
వనపర్తి జిల్లా

*ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యసన చికిత్స వార్డును ప్రారంభించిన అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్*

యువత మాదకద్రవ్యాల వైపు మల్లకుండా భవిష్యత్తుపై దృష్టి సారించి చక్కగా చదువుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ సూచించారు.

శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా యాంటీ డ్రగ్స్ "డ్రగ్స్ ను నిర్మూలిద్దాం" అనే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిజిహెచ్ లో మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వార్డును అదనపు కలెక్టర్ ప్రారంభించారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వైపు మల్లకుండా భవిష్యత్తుపై దృష్టి సారించి చక్కగా చదువుకోవాలని సూచించారు. నేటి యువతే రేపటి దేశ భాగ్యవిధాతలని, డ్రగ్స్ వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మానసిక వికాసం ఆగిపోయి యువ బంగారు భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడం కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఒకరిపై ఒకరు నిఘా ఉంచుకుని, ఎవరైనా తప్పుదారి పడితే వారిని ప్రేమతో మార్చడానికి ప్రయత్నించాలన్నారు. వైద్య వృత్తి ఎంతో గొప్పదని వైద్యులు సమాజానికి ఉపయోగపడేవిధంగా పని చేయాలన్నారు.

ఈ సందర్బంగా యాంటీ డ్రగ్స్ అంశంపై నిర్వహించిన క్విజ్ మరియు వ్యాసర చిన్న పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.

కార్యక్రమంలో డిఎస్పీ బాలాజీ నాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, సూపరిండెంట్ అరుణకుమారి, ఈగల్ విభాగం డిఎస్పి హరిచంద్ర రెడ్డి, వైద్య విద్యార్థులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy -drugs
Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 11-04-2026           వనపర్తి జిల్లా           *​స్త్రీ విద్య కోసం పాఠశాలలు స్థాపించిన మహనీయుడు ఫూలే*​            ...
11/04/2026

తేదీ : 11-04-2026
వనపర్తి జిల్లా

*​స్త్రీ విద్య కోసం పాఠశాలలు స్థాపించిన మహనీయుడు ఫూలే*

*అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే నిరంతర కృషి: అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్*

సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన కృషి వెలకట్టలేనిదని, కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ పేర్కొన్నారు.

శనివారం మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలే గారి మహోన్నత సేవలను స్మరించుకున్నారు.

వేదికపై ఆర్డీవో సుబ్రహ్మణ్యం, బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్, డీపీ ఆర్ఓ సీతారాం, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు కౌన్సిలర్లు శరవంద, మహేశ్వరి ఉన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు. సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని తెలిపారు. మహిళలకు విద్య అందించడంలో పూలే ముందుండి పోరాటం చేసి తొలి బాలికల పాఠశాలను స్థాపించారని గుర్తుచేశారు. సమాజంలో ఉన్న కులవివక్ష, అన్యాయాలపై ఆయన నిరంతరం పోరాడుతూ సమాన హక్కుల కోసం కృషి చేశారని వివరించారు.

పూలే ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ఆయన చూపిన దారిలో నడవడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత పూలే గారి స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని సూచించారు.

విద్య అందరికీ సమానంగా అందాలి అనే లక్ష్యంతో పూలే అనేక పాఠశాలలను స్థాపించడం గొప్ప విషయం అని అన్నారు. భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో మహిళా విద్యాభివృద్ధికి బలమైన పునాది పడిందని గుర్తుచేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవం పెంపొందించే దిశగా పూలే ఆలోచనలు ఎంతో ప్రేరణనిస్తాయని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూలే ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని, వాటిని సక్రమంగా ప్రజలకు అందించాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఒక్కరు పూలే జీవితం నుండి స్ఫూర్తి పొందుతూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యార్థులకు చదువు కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకొని పైకి రావాలని సూచించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా మహాత్మ జ్యోతిబాపూలేను గుర్తు చేస్తూ కళాకారులు చేసిన ప్రదర్శనలుఅందరినీ ఆకట్టుకున్నాయి.

సమావేశంలో మహనీయుల సభ కమిటీ అధ్యక్షులు గంధం నాగరాజు, ప్రజా సంఘాల నాయకులు రాజారాం ప్రకాష్, బండలయ్య, చీర్ల జనార్ధన్, ఉమల్ల రాములు, కే వెంకటేష్, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఇతర కవులు కళాకారులు, ఉపాధ్యాయులు కిరణ్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy



Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 10-04-2026           వనపర్తి జిల్లా           ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూను ఖచ్చితంగా అమలు చేయడంతో ...
10/04/2026

తేదీ : 10-04-2026
వనపర్తి జిల్లా

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల విద్యార్థుల సంక్షేమ హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల గదులు, వంటశాల (కిచెన్), స్టాక్ రూమ్‌ను పరిశీలించి హాస్టల్‌లో అందిస్తున్న అన్ని సదుపాయాలను తనిఖీ చేశారు.

ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విచారించిన కలెక్టర్, సమస్యలు ఉంటే వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని, అవి త్వరితగతిన పరిష్కరించబడతాయని సూచించారు.

కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. మెనూను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హాస్టల్‌కు నాణ్యమైన బియ్యం సరఫరా జరుగుతోందా అని అడగగా, అధికారులు నాణ్యమైన బియ్యం అందుతోందని తెలిపారు.

కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి హాస్టల్ సదుపాయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోగా, విద్యార్థులు అన్ని సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు.

*డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో సదుపాయాలు కల్పించాలి*
కలెక్టర్ రాజపేట గ్రామ శివారులోని డబల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనిని సందర్శించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాన రహదారికి కలిసే కనెక్టివిటీ రోడ్ విషయం సహా, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలియజేయగా, వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రమేష్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 09-04-2026           వనపర్తి జిల్లా             జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించా...
09/04/2026

తేదీ : 09-04-2026
వనపర్తి జిల్లా

జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో జిల్లా కలెక్టర్ భూభారతి పెండింగ్ అప్లికేషన్లు సహ సాదాభైనామ అప్లికేషన్ల అంశంపై అన్ని మండలాలు తహసిల్దార్లు ఇతర రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి పెండింగ్ ఫైల్స్ ను కలెక్టర్ లాగిన్ కు పంపడంతో పాటు వాటి యొక్క ఫిజికల్ ఫైల్స్ కూడా పంపాలని సూచించారు. అలాగే సాదా బైనామా దరఖాస్తులను జీ ఓ 76, 77 ప్రకారం నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములకు సంబంధించి అన్ని మండలాల్లో తహసిల్దార్ ల వద్ద ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేసి ఉంచుకోవాలని చెప్పారు.

అదేవిధంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియలో భాగంగా తహసీల్దార్లు తమ సీఎంఎంఎస్ లాగిన్ లో హెచ్ ఎల్ బి లను ( హౌస్ లిస్టింగ్ బ్లాక్ ) క్రియేట్ చేయడం మొదలుపెట్టాలన్నారు. చిన్న గ్రామాలను గుర్తించి వాటిని త్వరగా హెచ్ ఎల్ బిలు క్రియేట్ చేయాలన్నారు.

సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, అన్ని మండలాల తహసిల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 09-04-2026           వనపర్తి జిల్లా            ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 13వ తే...
09/04/2026

తేదీ : 09-04-2026
వనపర్తి జిల్లా

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డి తో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమం నిర్వహణపై హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్యా నాయక్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రజలెందరో ప్రాణాలు కోల్పోతున్నారని, అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించవలసిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వారం రోజులపాటు రోడ్డు భద్రతపై రోజువారి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. తద్వారా రోడ్డు భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలియజేశారు. గ్రామస్థాయి నుండే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, రోడ్డు భద్రత నియమాలు పాటించడంపై ప్రతిజ్ఞలు చేయించాలని సూచించారు.

డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అధికారులు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి, రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 వ తేది నుంచి నిర్వహించే అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 13వ తేదీన గ్రామీణ స్థాయిలో రోడ్డు భద్రత కోసం కమిటీలు వేసి, గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో తరచు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఏమైనా ఉంటే గుర్తించి, ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వారం రోజులపాటు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగేలా విద్యార్థులచే ర్యాలీలు, మండల స్థాయి కార్యక్రమాలు, వాహన చోదకులకు, డ్రైవర్లకు కంటి పరీక్షలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. అన్ని కార్యక్రమాలలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున భాగ్యస్వామ్యం చేయాలని అన్నారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చునని తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీన స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. 16వ తేదీన మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ట్రాఫిక్ నియమాలు పాటించని వారికి, రోడ్డు భద్రత నియమాలు పాటించని వారికి చలానాలు కఠినంగా విధించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ గా పాటించే వారికి ప్రోత్సాహం చేయాలన్నారు. చిన్నారులతో ట్రాఫిక్ నియమాలపై ప్రతిజ్ఞ చేయించడం, సామాజిక మాధ్యమాల ద్వారా రోడ్డు భద్రత పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

సమావేశంలో డిఎస్పి బాలాజీ నాయక్, ఆర్ అండ్ బి డిఈ దేశ్యా నాయక్, డీఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, డి టి ఓ మానస, డిపిఓ రఘునాథ్, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. &BDE Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 09-04-2026           వనపర్తి జిల్లా         నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాబోయే వర్షాకాలా...
09/04/2026

తేదీ : 09-04-2026
వనపర్తి జిల్లా

నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాబోయే వర్షాకాలానికి అవసరమైన మొక్కలను సమృద్ధిగా సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ తెలిపారు.

గురువారం ఘనపూర్ మండలం పరిధిలోని మల్క్ మియాన్ పల్లి గ్రామంలో వైకుంఠధామం, నర్సరీతో పాటు ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మరియు జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠధామంలో కల్పిస్తున్న వసతులను పరిశీలించినట్లు తెలిపారు. వైకుంఠధామంలో అంత్యక్రియలు కేవలం దహన విధానంలోనే నిర్వహించాలని, పూడ్చివేతలు చేయకూడదని సూచించారు.

అలాగే నర్సరీలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాబోయే వర్షాకాలానికి అవసరమైన మొక్కలను సమృద్ధిగా సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులపై మాట్లాడుతూ, కూలీలకు ఎండాకాలంలో పని ప్రదేశాల్లో టెంట్ ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే కూలీలకు కొలతల ప్రకారం సమయానికి వేతనాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఘనపూర్ మండల ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 09-04-2026           వనపర్తి జిల్లా             జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్య...
09/04/2026

తేదీ : 09-04-2026
వనపర్తి జిల్లా

జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్
పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ భవనంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల గ్రంథాలయ భవనంలో చేపట్టిన మొదటి అంతస్తు నిర్మాణ పనులు మరియు మరమ్మత్తు పనులను జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. త్వరలోనే నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్, గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను సరైన రీతిలో వినియోగించుకునేలా సంబంధిత అధికారులను సూచించారు.

*ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ కేంద్రం సందర్శన*
వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో అందించిన సిటీ స్కాన్ యంత్రాన్ని పరిశీలించారు. రోగులకు సిటీ స్కాన్ యంత్రం ద్వారా మెరుగైన సేవలను అందించాలని, స్కానింగ్ అనంతరం రోగులకు నివేదికలను సమయానికి అందించాలని వైద్యులను ఆదేశించారు. త్వరలోనే సిటీ స్కాన్ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు తేదీ ఖరారు చేయడం జరుగుతుందని అందుకు తగ్గట్టు సిద్ధంగా ఉండాలని సూచించారు.

జిజిహెచ్ సూపర్డెంట్ అరుణ కుమారి ఆర్ఎంవో రెడ్డి కుమారి, ఇతర వైద్యులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేది: 9-4-2026                              వనపర్తి జిల్లా      వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్ర...
09/04/2026

తేది: 9-4-2026
వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు కావడం జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 239 ప్రకారం 2022 లో జారీచేసిన అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి ఏప్రిల్ 30 తో ముగుస్తున్నందున మే, 1వ తేదీ నుండి 2 సంవత్సరాల కాల పరిమితితో కూడిన కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

కావున జర్నలిస్టులు తేది: 12-4-2026 లోపు తప్పులు లేకుండా అన్ని దృపత్రాలతో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు.
తేది: 12-4-2026 సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మాత్రమే మొదటి అక్రిడేషన్ జాబితా కింద పరిగణనలోకి తీసుకొని జిల్లా కమిటీ ద్వారా పరిశీలన చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయబడును.
నిర్ణీత గడువు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారిని రెండవ జాబితాలో పరిశీలించబడుననీ తెలియజేశారు. Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 08-04-2026           వనపర్తి జిల్లా           రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని వనపర్తి శాసనసభ్య...
08/04/2026

తేదీ : 08-04-2026
వనపర్తి జిల్లా

రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి అన్నారు.

బుధవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూరైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. పెబ్బేరు చుట్టూ పక్కల పరిధిలో మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను సంప్రదించి పెబ్బేరులో మొదటిసారి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు రూ. 2400 మంచి మద్దతు ధర కల్పిస్తోందని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 08-04-2026           వనపర్తి జిల్లా            *ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శ్రీరంగాపూర్ మండల ...
08/04/2026

తేదీ : 08-04-2026
వనపర్తి జిల్లా

*ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

*కేజీబీవీలో రూ. 88 లక్షల వ్యయంతో అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణానికి శంకుస్థాపన*

*విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి*

ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మండలాల్లో నూతన కార్యాలయ భవనాల ఏర్పాటుకు కృషి చేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.

శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి అడుగుపెట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు.

అనంతరం తహసిల్దార్ కార్యాలయం పక్కనే రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహంలో ఏర్పాటుచేసిన గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 88 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని పలు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు మారడం సంతోషకరమన్నారు.

ఇప్పటికే ఏదుల, రేవల్లి మండల కేంద్రాల్లో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.32 లక్షలను కలెక్టర్ తన సొంత నిధుల నుంచి కేటాయించి వేగంగా పూర్తి చేయించడం అభినందనీయమని తెలిపారు. ఈ కొత్త భవనాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు.

*అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ*
అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు ముఖ్యమైన సేవలు అందిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులతో సమన్వయం, సమాచారం వేగంగా చేరవేయడం వంటి అంశాల్లో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అందుకే అంగన్వాడీలకు 538 కొత్త 5జి స్మార్ట్ ఫోన్లను అందజేయడం జరిగిందని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో అంగన్వాడీ సేవలు మరింత సమర్థవంతంగా అందించగలమని ఆయన అన్నారు.

అంగన్వాడీ టీచర్లు కూడా ఈ సదుపాయం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా తమ విధులు మరింత సులభంగా నిర్వహించగలమని వారు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్పంచి మద్దిలేటి, డీఈఓ అబ్దుల్ ఘని, బి డబ్ల్యు ఓ సుధారాణి, తాసిల్దార్ వరలక్ష్మి, మాజీ జెడ్పిటిసి రాజేంద్రప్రసాద్, ఇతర అధికారులు తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేది: 8-4-2026                         వనపర్తి జిల్లా         *జిల్లాలోని రైతులు  పంట మార్పిడి వైపు ఆలోచించి  పామాయిల్ స...
08/04/2026

తేది: 8-4-2026
వనపర్తి జిల్లా
*జిల్లాలోని రైతులు పంట మార్పిడి వైపు ఆలోచించి పామాయిల్ సాగును చేపట్టి లాభాలు ఆర్జించాలి*
*రైతులకు లాభదాయకమైన పామాయిల్ సాగు విస్తరించేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*
రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం పామాయి సాగు లక్ష్యం 3 వేల ఎకరాలు సాధించే విధంగా రైతులకు ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ సంవత్సరంలో ఆయిల్ మిల్ కంపెనీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకసారి సాగు చేస్తే రైతులకు దీర్ఘ కాలం 30-40 సంవత్సరాల వరకు లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగు వైపు రైతులను మళ్లించాలన్నారు. ఇందుకు ఒక్కో వ్యవసాయ విస్తీర్ణాధికారుకి 20 మంది రైతులను ప్రోత్సహించే విధంగా లక్ష్యాలను నిర్దేశించారు. ఉద్యాన శాఖ అధికారులకు ఒక్కొక్కరికి వంద మంది రైతులు పామాయిల్ సాగు చేసే విధంగా చూసేందుకు లక్ష్యాలను నిర్దేశించారు.
సబ్సిడీ పై పామాయిల్ మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ప్రియునిక్ కంపెనీ వారితో సమన్వయం చేసుకొని అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారి విజయ్ భాస్కర్, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథ్, కో ఆపరేటివ్ అధికారి బి. రాణి, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు తదితరులు పాల్గొన్నారు. -operativeOfficer Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 08-04-2026                                 వనపర్తి జిల్లా         *రబీ సీజన్   వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బ...
08/04/2026

తేదీ : 08-04-2026
వనపర్తి జిల్లా

*రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా సజావుగా నిర్వహించాలి*
*ధాన్యం ఎఫ్.సి.సి. నియమ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం సేకరించాలి*
*అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా, రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి*
*ధాన్యం నిర్ధారించిన మిల్లుకు కాకుండా ఇతర మిల్లుకు పంపించినా మరెక్కడైనా నిల్వ చేసినా కఠిన చర్యలు - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*
ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని మొత్తం ధాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
బుధవారం జిల్లా పౌర సరఫరాల అధికారి ఆధ్వర్యంలో ఐ డి ఓ సి సమావేశ మందిరంలో వ్యవసాయ మండల అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, సహకార సంఘాల సీఈవోలు ఈ.పి.యం లతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై సమావేశం నిర్వహించగా అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఈసారి 414 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో ఐకెపి సిబ్బందికి 192 కేంద్రాలు పిఎసిఎస్ సంఘాలకు 214 మెప్మా కు 8 వరి కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు.
వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రంలో టెంట్ , తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్లు పెట్టాలని, రైతులు ధాన్యం తెచ్చినప్పుడు తేమ ఎంత ఉంది అనే విషయాలను అందులో రాయాలని, ధాన్యం తెచ్చినప్పుడు, కొనుగోలు చేశాక రైతు నుండి మొబైల్ నుండి ఓటిపి తీసుకొని పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
అనుమతి లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోడానికి వీలు లేదని, నిర్దేశించిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లుకు మాత్రమే తరలించాలని అలా కాకుండా వేరే మిల్లులకు తరలించిన లేదా మరి ఎక్కడైనా నిలువచేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ధాన్యాన్ని ఎఫ్.సి .ఐ నిబంధనల మేరకు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దీని కొరకు వ్యవసాయ విస్తీర్ణాధికారులు హార్వెస్టర్ లపై నియంత్రణ ఉండాలని సూచించారు. తాలు, చెత్త లేకుండా ఉండేందుకు హార్వెస్టింగ్ చేసేటప్పుడు యంత్రంలో 19-21 ఆర్ పి.యం. ఉండేవిధంగా నిర్దేశించాలని సూచించారు.
అన్ని కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేరకు తార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే యంత్రాలు, గన్ని బ్యాగులు ఉండే విధంగా చూడాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో వివరాలు అప్లోడ్ చేయాలని లేనిపక్షంలో రైతులకు డబ్బులు పడటంలో ఆలస్యం అవుతుందన్నారు.

ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్ కల్పిస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సన్న రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లకు క్లస్టర్ల వారిగా రైతులకు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలకు శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ విస్తీర్ణాధికారులను ఆదేశించారు. ప్రతి ఇంచార్జీకి డిజిటల్ గ్రేయిన్ కాలిబర్ మీటర్ ను ఎలా వినియోగించాలో తెలిసి ఉండాలని, సన్న రకం వరి ధాన్యానికి, దొడ్డు రకానికి వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

సమావేశంలో పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, పి.డి. డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి బి. రాణి, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన శాఖ అధికారి విజయ భాస్కర్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, సహకార సంఘం సి.ఈ.ఓ లు తదితరులు పాల్గొన్నారు. -operativeOfficer Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

Address

ROOM NO. 29, IDOC WANAPARTHY
Wanaparthy
509103

Website

Alerts

Be the first to know and let us send you an email when DPRO Wanaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share