18/05/2026
కూటమి ప్రభుత్వంపై గుద్దుడే గుద్దుడు.. కావలి వైయస్ఆర్ సీపీ వినూత్న నిరసన...
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కావలి పట్టణంలోని వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో గుద్దుడే గుద్దుడు పేరుతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి నాయకులు సాధ్యంకాని హామీలను ఇచ్చి, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. నాడు పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే చంద్రబాబుతో మాట్లాడి ధరలు తగ్గిస్తామని, నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ నేడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112 నుండి రూ. 113 పైగా పలుకుతోంది. దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడ ఉండటం ఎవరి అసమర్థతో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ధరల విపరీత పెంపు వల్ల ప్రతి గృహిణి, రైతు, వ్యాపారి, కార్మికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిందని, ఈ మోసాన్ని, వెన్నుపోటును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించి, సామాన్యుడి జీవన విధానాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.